![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Elon Musk: మోదీని కలవనున్న మస్క్ - అఫీషియల్గా అనౌన్స్ చేసిన టెస్లా సీఈవో!
Tesla Cars in India: భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఎలాన్ మస్క్ త్వరలో భారతదేశంలో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది.
![Elon Musk: మోదీని కలవనున్న మస్క్ - అఫీషియల్గా అనౌన్స్ చేసిన టెస్లా సీఈవో! Elon Musk Announced He Will Meet PM Narendra Modi in India Tour Check Details Elon Musk: మోదీని కలవనున్న మస్క్ - అఫీషియల్గా అనౌన్స్ చేసిన టెస్లా సీఈవో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/f63a8b0e8179d219749f1216fc969b731712917100809252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Elon Musk Meet with PM Narendra Modi: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ త్వరలో భారత్ను సందర్శించనున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ సమాచారాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా తెలిపారు. ఎలాన్ మస్క్ తన భారత పర్యటన గురించి సమాచారం ఇస్తూ ఎక్స్/ట్విట్టర్లో ఒక పోస్ట్ను షేర్ చేశారు. ఆ పోస్ట్లో టెస్లా సీఈవో భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవబోతున్నట్లు చెప్పారు.
గతంలో కూడా భేటీ
ఎలాన్ మస్క్ గత ఏడాది కాలంలో ప్రధాని నరేంద్ర మోదీని రెండుసార్లు కలిశారు. అయితే భారత్లో ప్రధాని మోదీని ఎలాన్ మస్క్ కలవడం ఇదే తొలిసారి. ఎలాన్ మస్క్ త్వరలో చేయనున్న ఈ పర్యటనపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ తన కంపెనీ టెస్లాను భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నాడు. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసే ప్రణాళికపై ఇప్పటికే పని ప్రారంభమైంది.
ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న అతిపెద్ద కంపెనీలలో టెస్లా ఒకటి. కానీ టెస్లా ఇంకా తన కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేయలేదు. ప్రపంచంలోని వాహనాల విక్రయాలను పరిశీలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశం మూడో అతిపెద్ద మార్కెట్. ఇప్పుడు ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాలను ఈ మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నాడు.
Looking forward to meeting with Prime Minister @NarendraModi in India!
— Elon Musk (@elonmusk) April 10, 2024
భారతీయ డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని బెర్లిన్లో రైట్ హ్యాండ్ డ్రైవర్ల కోసం టెస్లా కార్ల ఉత్పత్తిని ప్రారంభించిందని ఇటీవల వార్తలు వచ్చాయి. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం టెస్లా బృందం ఏప్రిల్ మూడో వారంలో భారతదేశాన్ని సందర్శించవచ్చు. ఇది భారతదేశంలో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని నిర్ణయించనున్నారు.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
ప్రభుత్వ కొత్త ఈవీ విధానం ఇదే...
ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం గత నెలలోనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ కొత్త విధానం ద్వారా స్పష్టమైంది. ఈ విధానం ప్రకారం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలనుకునే ఆటోమొబైల్ కంపెనీలు కనీసం రూ.4150 కోట్లు అంటే 500 మిలియన్ డాలర్లను భారత్లో పెట్టుబడిగా పెట్టాలి. అలాగే ఈ కంపెనీలు మూడేళ్లలోపు భారత్లో తయారీ ప్రారంభించాల్సి ఉంటుంది. కార్లలో ఉపయోగించే భాగాలలో 25 శాతం భారతదేశం నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విధానంతో దేశంలోకి గరిష్ట పెట్టుబడులను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
Great meeting you today @elonmusk! We had multifaceted conversations on issues ranging from energy to spirituality. https://t.co/r0mzwNbTyN pic.twitter.com/IVwOy5SlMV
— Narendra Modi (@narendramodi) June 21, 2023
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)