అన్వేషించండి

Surya Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 3 రాశులవారికి రాజయోగం!

Sun Transit In Leo (17th Aug 2023): కర్కాటక రాశిలో సంచరిస్తున్న సూర్యుడు ఆగష్టు 17న సింహరాశిలోకి మారనున్నాడు. సెప్టెంబరు 17 వరకూ అదే రాశిలో ఉంటాడు. ఈ ప్రభావంతో మూడు రాశులవారికి రాజయోగం సిద్ధిస్తుంది

Surya Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. ఎవరి జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటాడో ఇతర గ్రహాల ప్రతికూల ఫలితం అంతగా హాని కలిగించని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. కర్కాటక రాశిలో సంచరిస్తున్న సూర్యుడు  ఆగష్టు 17న తన సొంత రాశి అయిన సింహంలో సంచరిస్తాడు. మళ్లీ సెప్టెంబరు 17 వరకూ అదే రాశిలో ఉంటాడు. ఆదిత్యుడు తన సొంత రాశిలోకి వెళ్లడం వల్ల ఇంకొంత శక్తివంతుడు అవుతాడు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూల ప్రభావం, మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.ముఖ్యంగా ఈ మూడు రాశులవారికి మాత్రం సింహరాశిలో సూర్యసంచారం వల్ల రాజయోగమే అనిచెప్పాలి. ఆ మూడు రాశులేంటో చూద్దాం..

Also Read: వివాహానికి అనుకూలమైన రాశులివే!

మేష రాశి

సింహ రాశిలో సూర్య సంచారం అంటే మీ రాశి నుంచి ఐదో స్థానంలో అని అర్థం. ఈ ఫలితంగా ఇల్లు, విద్య, ప్రేమ, పిల్లలు, తెలివితేటలు, ఉద్యోగం ఇలా అన్నివిషయాల్లో మీకు అనుకూల ఫలితాలున్నాయి. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు, నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అద్భుతమైన ఫలితాలున్నాయి. స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ కి సంబంధించిన నిర్ణయాల్లో లాభం పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. మీ వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకుంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి సూర్యుడు 10వ స్థానంలో సంచరించినప్పుడు మీ కెరీర్ ఊహించని మలుపు తిరుగుతుంది. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే అనువైన సమయం. వ్యాపారులు కూడా లాభపడతారు. టెండర్లకు సంబంధించి ప్రయత్నాలు చేసేవారు సక్సెస్ అవుతారు. రాజకీయ నాయకులకు, పరిపాలనా అధికారులు మంచి ఫలితాలు పొందుతారు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. 

ALso Read: ఈ ఏడాది శ్రావణం అధికమాసం, ఇంతకీ అధికమాసం - క్షయమాసం అంటే ఏంటి!

మీన రాశి

సింహ రాశిలో సూర్య సంచారం అంటే మీన రాశి నుంచి ఆరో ఇంట్లో. ఈ సమయంలో ఈ రాశివారికి రాజయోగమే అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ సమయంలో ఉద్యోగులు ఊహించని ప్రయోజనం పొందుతారు. వేరొకరు వెళ్లిపోవడం మీ అదృష్టానికి నాంది పలుకుతుంది. సూర్యుడిని మిత్రుడు అని పిలుస్తారు..శత్రువులను నాశనం చేసి స్నేహితులను పెంచుతాడు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 17 వరకూ సింహ రాశిలో సూర్య సంచారం ఉన్నన్ని రోజులు శత్రువులపై మీదే పైచేయి, తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు  సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. దీర్ఘకాలిన అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. 

సూర్యుడు గౌరవం, ఆత్మగౌరవం, వృత్తి, రాజకీయాలు, ఉన్నత పదవి, ఉద్యోగానికి కారకుడు. జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటే మీరు ఈ రంగాల్లో విజయం సాధిస్తారు. ఇంకా సాత్విక భావాలు, నిజాయితీ, నాయకత్వ సామర్థ్యానికి కూడా సూర్యుడు కారకుడు.

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget