అన్వేషించండి

ఇప్పుడెవరిని చెప్పుతో కొట్టాలో! సిగ్గుగా అనిపించడం లేదా? బాబు-పవన్ భేటీపై వైసీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు

సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు వెళ్లారంటూ ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు.

ఏపీలో రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో భేటీ అవ్వడంపై అప్పుడే అధికార పార్టీ నేతలు కూడా సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయని.. అలా చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారని ట్వీట్ చేశారు. డుడు బసవన్నలా తల ఊపడానికి వెళ్లారని ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత, దత్తపుత్రుడు జనసేన పవన్‌ కల్యాణ్‌ మధ్య ఉన్న ముసుగు మరోసారి తొలగిపోయిందని మంత్రి అంబటి రాంబాబు ఓ టీవీ ఛానెల్‌తో స్పందించారు. జనసేనను టీడీపీలో కలిపేయాలని.. చంద్రబాబు, పవన్‌ కలిసినా తమకు నష్టం లేదని అన్నారు. చంద్రబాబు దగ్గర పవన్‌ ఊడిగం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. 

సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు వెళ్లారంటూ ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేస్తూ.. పవన్ కల్యాణ్‌ను, చంద్రబాబును ట్విటర్‌లో ట్యాగ్ చేశారు.

మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ వెళ్లారని ఎద్దేవా చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో జనం చనిపోతే పరామర్శించలేదని అన్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లడం పవన్‌ కల్యాణ్ కు సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరు కలిసినా వైఎస్‌ జగన్‌ను అంగుళం కూడా కదపలేరని అన్నారు.

ఎవరిని చెప్పుతో కొట్టాలో - ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయని అన్నారు. బాబు చెప్పినట్టు ఆడతాడు కాబట్టే పవన్‌ దత్తపుత్రుడు అయ్యాయని.. ఇప్పుడు చెప్పు తీసుకుని ఎవరిని కొట్టాలో పవన్‌ చెప్పాలని నిలదీశారు. ఈ భేటీతో వీరిద్దరి మధ్య ముసుగు తొలిగిపోయిందని అన్నారు. ఏపీని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్-1పై చర్చించడమేంటని ప్రశ్నించారు. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి పవన్‌ వెళ్లాడని.. వీళ్ల కలయిక వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదు అంటూ మాట్లాడారు.

13 మంది చనిపోతే పవన్ ఎందుకు పరామర్శించలేదు - ఎంపీ మార్గాని భరత్

టీడీపీ రోడ్ షోలలో రెండు వేర్వేరు ఘటనల్లో 13 మంది చనిపోతే పవన్ కల్యాణ్ పరామర్శించేందుకు వెళ్లలేదని, అలాంటిది రాజకీయాల కోసం పవన్ చంద్రబాబును కలిసేందుకు వెళ్లారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వారి మధ్య ఉన్న ఒప్పందాలు రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. పవన్ కల్యాణ్ కొన్ని రోజులు ఇంట్లో ఉండి అప్పుడప్పుడూ రాజకీయాల్లో కనిపిస్తుంటారని ఎద్దేవా చేశారు. అధికారం పోగానే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారని, ఖాళీ సమయాల్లో పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్ ‌లోనే ఉంటున్నారని భరత్ అన్నారు. వారిద్దరూ హైదరాబాద్ లో కలవడమే.. ఏపీ రాజకీయాల పట్ల వారికి శ్రద్ధ లేదని తెలుస్తోందని మాట్లాడారు.

కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‎లోని జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ ఆదివారం (జనవరి 8) మధ్యాహ్నం వెళ్లారు. వీరిద్దరు భవిష్యత్తులో రాజకీయంగా కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే కోణంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికల ఊహాగానాల వేళ రెండు పార్టీల పొత్తును ఇప్పుడే ప్రకటించాలా? లేదంటే కొంతకాలం వేచి ఉండాలా? అనేది మాట్లాడుతుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష సభలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు వంటి అంశాలపై మాట్లాడుకోనున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌-1పైన కూడా తాజా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ కాసేపట్లో ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Embed widget