అన్వేషించండి

YV Subba Reddy: 'వైసీపీ ఫైనల్ లిస్ట్ వచ్చేది అప్పుడే' - ఒంగోలు ఎంపీ స్థానంలో పోటీపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

Andhra News: వచ్చే ఎన్నికల్లో పోటీపై సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీపై క్లారిటీ ఇచ్చారు.

YV Subbar Reddy Comments on Ongole MP Seat: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభకు తాను పోటీ చేయనని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి (YV SubbaReddy) స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఒంగోలులో (Ongole) పోటీ చేయాలనుకుంటే.. 2019 ఎన్నికల్లోనే పోటీ చేసే వాడినని.. ఈ విషయాన్ని సీఎం జగన్ కు చాలాసార్లు చెప్పానని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నట్లు చెప్పిన ఆయన, ఎన్నికల పోటీ విషయంలో అంతిమంగా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీల మార్పు విషయంలో అధినేత జగన్ క్లారిటీతోనే ఉన్నారని తెలిపారు. గెలిచే అవకాశాలు లేని అభ్యర్థులకు సీట్లు ఉండవని సీఎం ముందు నుంచి చెబుతూ వస్తున్నారని.. అందుకు అనుగుణంగానే 3 జాబితాలను విడుదల చేశామని అన్నారు.

వ్యక్తిగత కారణాలతోనే

సిట్టింగ్స్ కొత్త అభ్యర్థులతో అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పడుతుందని.. సీనియర్లు వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ పండుగ తర్వాతే వస్తుందని స్పష్టం చేశారు. ఇక దేశంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎంగా జగన్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే ఓట్లెయ్యాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. ఇక, షర్మిల కాంగ్రెస్ చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని.. ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీ లేదని స్పష్టత ఇచ్చారు.

ఇప్పటికీ 3 జాబితాలు విడుదల

ఏపీలో రాబోయే ఎన్నికల్లో 'వై నాట్ 175' నినాదంతో దూసుకెళ్తున్న వైసీపీ అందుకు అనుగుణంగా పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చింది. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా పలువురు సిట్టింగులకు సైతం సీట్లు మార్పులు చేసింది. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారికి ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేలా ఆదేశాలిచ్చింది. పలువురు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు ఇంఛార్జీలను మార్చగా, రెండో జాబితాలో 27 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. మూడో జాబితాలో 21 మందికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో నాలుగో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఫస్ట్ లిస్ట్ - గుంటూరు పశ్చిమ - విడదల రజని, మంగళగిరి - గంజి చిరంజీవి, ప్రత్తిపాడు - బాలసాని కిషోర్ కుమార్, కొండెపి - ఆదిమూలపు సురేష్, వేమూరు - వరికూటి అశోక్ బాబు, తాడికొండ - మేకతోటి సుచరిత, సంతనూతలపాడు - మేరుగు నాగార్జున, చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు, అద్దంకి - పాణెం హనిమిరెడ్డి, రేపల్లె - ఈవూరు గణేష్, గాజువాక - వరికూటి రామచంద్రరావు.

రెండు జాబితా - అనంతపురం ఎంపీ - మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ - జోలదరాశి శాంత, అరకు ఎంపీ (ఎస్టీ) - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, రాజాం (ఎస్సీ) - డాక్టర్ తాలె రాజేష్, అనకాపల్లి - మలసాల భరత్ కుమార్, పాయకరావు పేట (ఎస్సీ) - కంబాల జోగులు, రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాష్, పి.గన్నవరం (ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం - వంగ గీత, జగ్గంపేట - తోట నరసింహం, ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ - మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ, పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు - మాచాని వెంకటేష్, తిరుపతి - భూమన అభినయ రెడ్డి, గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నం - పేర్ని క్రిష్ణమూర్తి (కిట్టూ), చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండ - కేవీ ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గం - తలారి రంగయ్య, అరకు (ఎస్టీ) - గొడ్డేటి మాధవి, పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజు, విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావు, విజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్ 

మూడో జాబితా

ఎమ్మెల్యే అభ్యర్థులు 

  • ఇచ్ఛాపురం - పిరియా విజయ
  • టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
  • చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
  • రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి
  • దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
  • పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
  • చిత్తూరు - విజయానంద రెడ్డి
  • మదనపల్లె - నిస్సార్ అహ్మద్
  • రాజంపేట - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
  • ఆలూరు - బూసినే విరూపాక్షి
  • కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్
  • గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
  • సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
  • పెనమలూరు - జోగి రమేశ్
  • పెడన - ఉప్పాల రాము

ఎంపీ అభ్యర్థులు వీరే

  • విశాఖపట్నం ఎంపీ - బొత్స ఝాన్సీ
  • విజయవాడ - కేశినేని నాని
  • శ్రీకాకుళం - పేరాడ తిలక్
  • కర్నూల్‌ ఎంపీ - గుమ్మనూరి జయరాం
  • తిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలం
  • ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్

Also Read: Congress Target: షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ టార్గెట్ - కింగ్ మేకర్ అయ్యేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
CBSE Practical Examinations :సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
Embed widget