అన్వేషించండి

YV Subba Reddy: 'వైసీపీ ఫైనల్ లిస్ట్ వచ్చేది అప్పుడే' - ఒంగోలు ఎంపీ స్థానంలో పోటీపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

Andhra News: వచ్చే ఎన్నికల్లో పోటీపై సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీపై క్లారిటీ ఇచ్చారు.

YV Subbar Reddy Comments on Ongole MP Seat: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభకు తాను పోటీ చేయనని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి (YV SubbaReddy) స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఒంగోలులో (Ongole) పోటీ చేయాలనుకుంటే.. 2019 ఎన్నికల్లోనే పోటీ చేసే వాడినని.. ఈ విషయాన్ని సీఎం జగన్ కు చాలాసార్లు చెప్పానని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నట్లు చెప్పిన ఆయన, ఎన్నికల పోటీ విషయంలో అంతిమంగా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీల మార్పు విషయంలో అధినేత జగన్ క్లారిటీతోనే ఉన్నారని తెలిపారు. గెలిచే అవకాశాలు లేని అభ్యర్థులకు సీట్లు ఉండవని సీఎం ముందు నుంచి చెబుతూ వస్తున్నారని.. అందుకు అనుగుణంగానే 3 జాబితాలను విడుదల చేశామని అన్నారు.

వ్యక్తిగత కారణాలతోనే

సిట్టింగ్స్ కొత్త అభ్యర్థులతో అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పడుతుందని.. సీనియర్లు వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ పండుగ తర్వాతే వస్తుందని స్పష్టం చేశారు. ఇక దేశంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎంగా జగన్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే ఓట్లెయ్యాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. ఇక, షర్మిల కాంగ్రెస్ చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని.. ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీ లేదని స్పష్టత ఇచ్చారు.

ఇప్పటికీ 3 జాబితాలు విడుదల

ఏపీలో రాబోయే ఎన్నికల్లో 'వై నాట్ 175' నినాదంతో దూసుకెళ్తున్న వైసీపీ అందుకు అనుగుణంగా పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చింది. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా పలువురు సిట్టింగులకు సైతం సీట్లు మార్పులు చేసింది. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారికి ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేలా ఆదేశాలిచ్చింది. పలువురు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు ఇంఛార్జీలను మార్చగా, రెండో జాబితాలో 27 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. మూడో జాబితాలో 21 మందికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో నాలుగో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఫస్ట్ లిస్ట్ - గుంటూరు పశ్చిమ - విడదల రజని, మంగళగిరి - గంజి చిరంజీవి, ప్రత్తిపాడు - బాలసాని కిషోర్ కుమార్, కొండెపి - ఆదిమూలపు సురేష్, వేమూరు - వరికూటి అశోక్ బాబు, తాడికొండ - మేకతోటి సుచరిత, సంతనూతలపాడు - మేరుగు నాగార్జున, చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు, అద్దంకి - పాణెం హనిమిరెడ్డి, రేపల్లె - ఈవూరు గణేష్, గాజువాక - వరికూటి రామచంద్రరావు.

రెండు జాబితా - అనంతపురం ఎంపీ - మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ - జోలదరాశి శాంత, అరకు ఎంపీ (ఎస్టీ) - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, రాజాం (ఎస్సీ) - డాక్టర్ తాలె రాజేష్, అనకాపల్లి - మలసాల భరత్ కుమార్, పాయకరావు పేట (ఎస్సీ) - కంబాల జోగులు, రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాష్, పి.గన్నవరం (ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం - వంగ గీత, జగ్గంపేట - తోట నరసింహం, ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ - మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ, పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు - మాచాని వెంకటేష్, తిరుపతి - భూమన అభినయ రెడ్డి, గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నం - పేర్ని క్రిష్ణమూర్తి (కిట్టూ), చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండ - కేవీ ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గం - తలారి రంగయ్య, అరకు (ఎస్టీ) - గొడ్డేటి మాధవి, పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజు, విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావు, విజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్ 

మూడో జాబితా

ఎమ్మెల్యే అభ్యర్థులు 

  • ఇచ్ఛాపురం - పిరియా విజయ
  • టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
  • చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
  • రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి
  • దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
  • పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
  • చిత్తూరు - విజయానంద రెడ్డి
  • మదనపల్లె - నిస్సార్ అహ్మద్
  • రాజంపేట - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
  • ఆలూరు - బూసినే విరూపాక్షి
  • కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్
  • గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
  • సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
  • పెనమలూరు - జోగి రమేశ్
  • పెడన - ఉప్పాల రాము

ఎంపీ అభ్యర్థులు వీరే

  • విశాఖపట్నం ఎంపీ - బొత్స ఝాన్సీ
  • విజయవాడ - కేశినేని నాని
  • శ్రీకాకుళం - పేరాడ తిలక్
  • కర్నూల్‌ ఎంపీ - గుమ్మనూరి జయరాం
  • తిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలం
  • ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్

Also Read: Congress Target: షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ టార్గెట్ - కింగ్ మేకర్ అయ్యేనా?

టాప్ హెడ్ లైన్స్

Fake Currency Printing Racket: డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Breaking News: సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Embed widget