అన్వేషించండి

Justice For Viveka : పార్టీలతో సబంధం లేదు - న్యాయం కోసమే పోరాటం - వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు

Andhra News : న్యాయం కోసమే పోరాటం చేస్తున్నానని పార్టీలతో సంబంధం లేదని వైఎస్ సునీత తెలిపారు. జస్టిస్ ఫర్ వివేకా పేరుతో ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు సిద్ధమయ్యారు.

YS Sunitha said she is fighting for justice :  మాజీ మంత్రి వైఎస్ వివేకా హంతకులకు శిక్ష పడే వరకూ జస్టిస్ ఫర్ వివేకా పేరుతో  ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంటానని వైఎస్ సునీత తెలిపారు. ప్రజల ఓటు తాను వేయలేనని... జాగృతం చేయాల్సిన బాధ్యత మాత్రం తనపై ఉందన్నారు.  వివేకాపై వచ్చిన ఆరోపణలను సీబీఐ విచారించి హత్యకు అవి కారణాలు కావని తేల్చిందని గుర్తు చేశారు.  వివేకాపై ఆరోపణలు ఇప్పుడు అసందర్భమని..  అవినాశ్‌ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోంది..  జగన్‌ అసెంబ్లీలో అవినాశ్‌ రెడ్డికి క్లీన్‌ చిట్‌ ఇవ్వడం మీరు చూశారని గుర్తు చేశారు.  కర్నూలులో అవినాశ్‌ని సీబీఐ అరెస్టు చేయకుండా 2 రోజులు జరిగిన డ్రామా ప్రజలందరూ చూశారన్నారు.  

పార్టీ గెలుపు కోసం వివేకా కృషి 

2009లో వైఎస్‌ మరణం తర్వాత పరిణామాలను వివరించారు. కడప స్థానాన్ని అవినాష్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారన్నారు. వెన్నుపోటుతో వివేకాను ఓడించారన్నారు. ఆ తరువాత కూడా జిల్లా అంతా వివేకా చూసుకున్నారన్నారు. పులివెందులను మాత్రం ఎంపీ అవినాష్‌ కుటుంబానికి అప్పగించారన్నారు. పులివెందులలో అవినాష్‌ కుటుంబం వెన్నుపోటుతో వివేకా ఓడిపోయారన్నారు. ఓటమి తర్వాత తేరుకుని.. 2019 ఎన్నికలకు వివేకా సిద్ధమయ్యారని సునీతా రెడ్డి వెల్లడించారు. 
2019 లో పార్టీ గెలుపు కోసం వైఎస్ వివేక విపరీతంగా కృషి చేశారన్నారు. 

వివేకా వ్యతిరేకులే ఓటును తీసి వేయించారు!  

పార్టీ కోసం పనిచేసిన కుటుంబ సభ్యులు షర్మిల, వివేకాకు జగన్ అన్యాయం చేశారన్నారు. జగన్‌ పాదయాత్రలో వివేకా అప్పుడప్పుడు కలిసేవారని సునీత అన్నారు. పార్టీ నిర్మాణానికి నిరంతరం సలహాలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారన్నారు. ఇదే సమయంలో షర్మిల పేరు మళ్లీ కడప సీటు కోసం చర్చకు వచ్చిందన్నారు. కడప ఆత్మీయ సమావేశాన్ని హైదరాబాద్‌లో షర్మిల నిర్వహించారన్నారు. కొన్ని రోజుల తర్వాత వివేకా కార్యకర్తల సమావేశం నిర్వహించారని సునీత వెల్లడించారు. ఆ తర్వాత పులివెందులలో వివేకా ఓటు జాబితాలోనే లేకుండా పోయిందని తెలిపారు. ప్రతిపక్షాలే ఓటు లేకుండా చేశాయని మేమంతా భావించామని సునీత తెలిపారు. వివేకాను వ్యతిరేకించేవారే ఓటు తొలగించారని అర్థమైందన్నారు. ఓటు తొలగింపుపై వివేకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. 

రాజకీయ పార్టీతో సంబంధం లేదు .. న్యాయం కోసమే పోరాటం ! 

షర్మిలను కడప నుంచి పోటీ చేయాలని వివేకా ఒత్తిడి చేశారని సునీత వెల్లడించారు. తనకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదని.. తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని సునీత పేర్కొన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలు, బ్యూరో క్రాట్స్ కలిశానని.. ఇక మీదట కలుస్తానని వెల్లడించారు. ఎవరి పని వాళ్ళ చేస్తే తనకెలాంటి అభ్యంతరం లేదని.. తనకు ఫేవర్ చేయాలని కూడా కోరుకోవడం లేన్నారు. వివేకా కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని సునీత తెలిపారు.                              

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget