అన్వేషించండి

YS Sharmila: జగన్ చేసిన నీచపు పని కి వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తుంది - షర్మిల ఘాటు వ్యాఖ్యలు

YS Sharmila questions Jagan: జగన్ బీజేపీకి జై కొట్టడం వింత అని, జగన్ చేసిన ఈ నీచపు పని కి వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తుందని షర్మిల ప్రకటించారు. బిల్లులను సమర్థించడంపై షర్మిల ఘాటుగా స్పందించారు.

YS Sharmila  questions Jagan over supporting BJP: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లు , డీలిమిటేషన్ బిల్లుల చుట్టూ సాగుతున్న రాజకీయ రగడ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సోషల్ మీడియాలో ఘాటు ట్వీట్ పోస్టు చేశారు. 
 
పార్లమెంటులో కీలకమైన బిల్లులపై ఓటింగ్ సందర్భంగా వైసీపీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. విపక్షం ముసుగులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, అసలు సిసలు ఆర్ఎస్ఎస్ పక్షపాతి అని ఈ ఓటింగ్ ద్వారా తేటతెల్లమైందని విమర్శించింది. టీడీపీ, జనసేనల కంటే ఎక్కువగా మోదీని మోయాల్సిన అవసరం జగన్‌కు ఏముందని ప్రశ్నించిన కాంగ్రెస్, రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే వైసీపీకి ముఖ్యమైపోయిందని ఆరోపించింది. అక్రమ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు పలికినందుకు జగన్ సిగ్గుపడాలని, తన ఐదేళ్ల పాలనలోని అవినీతి కేసుల నుంచి రక్షణ కోసమే ఆయన బీజేపీకి బానిసగా మారారని ఎద్దేవా చేసింది.
 
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతాలను జగన్ మంటగలిపారని, ఆయన వారసత్వం గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయారని కాంగ్రెస్ చీఫ్ మండిపడ్డారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించే బిల్లులను విపక్షాలన్నీ ఏకమై అడ్డుకుంటే.. జగన్ మాత్రం గొర్రెలా గుడ్డిగా తలాడించడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాలను, ప్రయోజనాలను అర్థం చేసుకోకుండా, సొంత రాష్ట్ర ప్రజల గుండెలను గాయపరుస్తూ బీజేపీకి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడా లేని వింత అని, జగన్ చేసిన ఈ  నీచపు పని కి వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తుందని షర్మిల  ఆవేదన వ్యక్తం చేసింది.
 
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనమని  షర్మిల అన్నారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అసలు ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని గుర్తు చేశారు.  కేవలం మోదీ రాజకీయ లబ్ధి కోసం అక్రమంగా తెచ్చిన డీలిమిటేషన్ అంశాన్ని మాత్రమే విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, అది కూడా తెలియకుండా జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని.. 2026 జనాభా లెక్కలు రాకుండా, కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య తేలకుండా సీట్లు పెంచడం దేశాన్ని మోసం చేయడమేనని స్పష్టం చేశారు.   

 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ అని.. ఈ ముగ్గురూ మోదీ మెప్పు కోసం పాకులాడే వారేనని షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ప్రజల పక్షాన నిలబడి పోరాడేది తామేనన్నారు.  వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్నా, చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలన్నా కాంగ్రెస్ స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని, కానీ జగన్ తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని అన్నారు.  షర్మిల ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget