అన్వేషించండి

Ysrcp Rebel Mlas: అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ను కలిసిన వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు

Andhra News: అనర్హత పిటిషన్లపై వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద విచారణకు హాజరయ్యారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్ కు విన్నవించినట్లు చెప్పారు.

Ysrcp Rebel Mlas Meet Speaker Seetharam: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సోమవారం స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కలిశారు. తాము ఇది వరకే లేఖలో రాసిన విధంగా 4 వారాల సమయం కోరినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్ కు విన్నవించినట్లు చెప్పారు. తాము పార్టీ నియమాలు ఉల్లంఘించినట్లు వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిందిగా సభాపతిని, అసెంబ్లీ కార్యదర్శిని కోరామని అన్నారు. సీఎం జగన్ ఒత్తిడి మేరకే స్పీకర్ పని చేస్తున్నారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినా రశీదు అడిగితే మాత్రం ఇవ్వలేదని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. స్పీకర్‌ తీరు చూస్తుంటే చట్టాలపై గౌరవం పోతోందని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కావాలనే తమపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలపై ఉన్న గౌరవంతోనే ఆయన్ను కలిసి సమయం కావాలని నేరుగా కోరామని, కానీ ఆయన దీనికి అంగీకరించకపోవడం వల్ల ఇప్పుడు కోర్టును ఆశ్రయించక తప్పదన్నారు. కోర్టులు, ప్రజా కోర్టుల్లోనే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వారిపైనా చర్యలు తీసుకుంటారా.?

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సభాపతి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. ఏపీలో స్పీకర్‌ రూల్ బుక్‌ను కూడా విభజించారని ఆయన మండిపడ్డారు. మరో రెండు, మూడు నెలల్లో సభాపతి కాలం ముగిసిపోబోతోందని, చివరి రోజుల్లో అయినా ఆయన చరిత్రలో నిలిచే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమకన్నా ఎక్కువ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. 16 నెలల ముందు తాము ఏం చెప్పామో ఇప్పుడు అందరూ అదే చెబుతున్నారన్నారు. వారిపైనా చర్యలు తీసుకుంటారా అని వారు ప్రశ్నించారు.

న్యాయ నిపుణుల సలహా

అంతకు ముందు సభాపతిని కలవడంపై రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులు సలహా తీసుకున్నారు. అనర్హత పిటిషన్‌పై సమయం కావాలని కోరినా స్పీకర్ అంగీకరించకపోవడంతో నేరుగా కలిసి సమయం కోరాలని నిర్ణయించారు. అనర్హతకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించేందుకు.. పేపర్స్, వీడియో క్లిప్పింగుల వాస్తవ నిర్ధారణకు సమయం కావాలని రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి తెలిపారు. తనకు ఆరోగ్యం బాగాలేదని వైద్యులు ఇచ్చిన నివేదికను ఇచ్చినా స్పీకర్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగే సీక్రెట్ ఓటింగ్‌లో విప్‌ ఉల్లంఘించారని ఎలా నిర్థారిస్తారన్నారు. వైసీపీలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు, చేయని ఎమ్మెల్యేలు కూడా జగన్‌ను విమర్శిస్తున్నారని.. వారిపై లేని చర్యలు తమపై ఎందుకని ఆయన మండిపడ్డారు. కరోనాతో చికిత్స తీసుకుంటున్నానని తెలిపినా, నేరుగా హాజరు కావాల్సిందేనని సభాపతి ఆదేశించారని మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. స్పీకర్‌ ఫార్మెట్‌లో గంటా శ్రీనివాసరావు రాజీనామా ఇచ్చి మూడున్నారేళ్లు అయినా పట్టించుకోని స్పీకర్‌.. తమకు మాత్రం నోటీసులు ఇచ్చి రెండు వారాల్లోనే సమాధానం ఇవ్వాలనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, టీడీపీని వీడిన ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేయాల్సిందిగా ఆ పార్టీ విప్ డోలా వీరాంజనేయస్వామి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా నలుగురు ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, కరణం బలరాం సైతం నేరుగా వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా సభాపతి తాఖీదులు జారీ చేశారు. తెలుగుదేశాన్ని వీడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై న్యాయ నిపుణులతో ఆ పార్టీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కీలకంగా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget