![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weather Updates: నేడు ఏపీలో అక్కడ ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
నేడు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు.
![Weather Updates: నేడు ఏపీలో అక్కడ ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు Weather In Andhra Pradesh Telangana Hyderabad on 2nd January 2022: Daily weather report for AP Weather Updates: నేడు ఏపీలో అక్కడ ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/23/d80f1a8631c9471bdec8d928d2fea076_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి ఏపీ వైపు గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు.
ఏపీ వెదర్ అప్డేట్స్..
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఆగ్నేయ, తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. మరోవైపు విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పుంజుకున్నాయి. దక్షిణ కోస్తాంధ్రంలో నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో చలి తీవ్రత తగ్గుతోంది.
View this post on Instagram
ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి నేడు వర్ష సూచన ఉంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కడప, చిత్తూరు జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అత్యల్పంగా కోస్తాంధ్రలో కళింగపట్నంలో 16.7 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 18 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీలు, నందిగామలో 18.1 డిగ్రీలు, నంద్యాలలో 19.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View this post on Instagram
తెలంగాణ వెదర్ అప్డేట్..
తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాష్ట్రానికి ఎలాంటి సూచన లేదు. మరోవైపు ఒడిశా, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై ఉండనుంది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Also Read: Sankranti Special Trains: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)