అన్వేషించండి

Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!

Andhrapradesh News: ఏపీ ప్రభుత్వం సోమవారం నుంచి ఉచితంగా ఇసుకను అందించనుంది. చిన్న నదుల్లో ఇసుకను సామాన్యులు ఎండ్ల బండ్ల ద్వారా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

AP Government Free Sand Scheme: ఏపీ ప్రభుత్వం  ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8 (సోమవారం) నుంచి ఉచితంగా ఇసుకను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయగా.. అందుకు అనుగుణంగా జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా అన్ని చోట్లా స్టాక్ ఉన్న కేంద్రాల్లో ఇసుక డంప్‌ల నుంచి ఉచితంగా ఇసుకను అందిస్తుంది. ఇందుకోసం రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. అయితే, నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు రూ.20, సీనరేజ్ కింద టన్నుకు రూ.88 వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీ చేస్తారు. అదే వాగులు, వంకలు, చిన్న చిన్న నదుల్లోని ఇసుకను ఎండ్ల బండ్ల ద్వారా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎండ్ల బండ్ల ద్వారా మాన్యువల్‌గా ఇసుకను తరలించుకోవచ్చు. ఇప్పటివరకూ కాంట్రాక్టర్లు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించేవారు. అయితే, నూతన ప్రభుత్వ నిర్ణయంతో ఉచితంగానే ప్రజలకు ఇసుక అందనుంది. 

అక్రమ రవాణాపై నిఘా

ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది. కమర్షియల్ అవసరాల కోసం ఎవరైనా లారీల్లో ఇసుకను భారీగా తరలించేందుకు యత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. అక్రమ రవాణా జరగకుండా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఆయా జిల్లాల్లో ఇసుక నిల్వలన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు అంచనా వేశారు. సెప్టెంబర్ వరకూ 88 లక్షల టన్నుల అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. సోమవారం నుంచి ఆయా జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉంటుందో కలెక్టర్లు ప్రకటించనున్నారు. దీన్ని ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో కలెక్టర్లు, స్థానిక ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేస్తారు.

రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు, కి.మీకు రూ.4.90 పైసలు.. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు రూ.20 తీసుకోనున్నారు. వీటన్నింటికీ కలిపి 18 శాతం జీఎస్టీ వేస్తారు. స్టాక్ పాయింట్లలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అక్కడ ఇసుక ఎంతనేది కలెక్టర్లు నిర్ణయిస్తారు. కాగా, ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక టన్నుకు రూ.225 చొప్పున తీసుకోనున్నారు.

అధికారిక పోర్టల్

అయితే, ఉచిత ఇసుకకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. అధికారిక పోర్టల్ మాత్రం సిద్ధంగా ఉంది. https://www.mines.ap.gov.in/miningportal/ సైట్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఇందులోనే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. ఉచిత ఇసుకకు సంబంధించిన పూర్తి వివరాలు సైతం ఇందులో ఉంటాయని తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు కావడంపై భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గుతుందని.. తమకు ఉపాధి లభిస్తుందని కార్మికులు చెబుతున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget