అన్వేషించండి

Vivekananda Reddy Case: విచారణకు హాజరవుతా కానీ ఆ పని చేయండి- సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ!

Vivekananda Reddy Case: ఇవాళ జరగబోయే సీబీఐ విచారణకు తాను హాజరు అవుతానని చెప్పిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఓ షరతు పెట్టారు. దీనిపై లేఖ రాశారు.

Vivekananda Reddy Case: ఈనెల 28వ తేదీన జరిగే విచారణకు తాను హాజరవుతానని చెబుతూ సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. "వివేకానంద రెడ్డి కేసు ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పని గట్టుకొని ఓ వర్గం మీడియా తనపై లేని పోని కథనాలను ప్రచారం చేస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే తప్పు దోవబట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.  ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని కోరారు. తనతోపాటు ఒక న్యాయవాది వెంటే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. 

ఈరోజే సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి

వివేకా హత్య కేసులో నేడు సీబీఐ ముందుకు అవినాష్‌ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం ౩ గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రానున్నారు. అవినాశ్‌ రెడ్డిని అడిగే ప్రశ్నలు ఏంటి ఎంతటైం ప్రశ్నిస్తారు.. మళ్లీ రమ్మంటారా అనేది ఇప్పుడు సస్పెన్ష్‌గా మారింది. వైసీపీ నేతలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఎపిసోడ్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకు చాలా మందిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వాళ్లంతా చాలా సామాన్యులు, ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేనోళ్లు. ఇప్పుడు మాత్రం తొలిసారిగా ఓ ప్రజా ప్రతినిధిని సీబీఐ విచారిస్తోంది. అందుకే ఈ విచారణ తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తోంది. అందులోనూ అవినాష్‌ రెడ్డి సీఎం జగన్‌కు సోదరడి వరుస అవుతారు. ఈయనపై వివేకా కుమార్తె సునీత కూడా అనుమానం వ్యక్తం చేశారు. హత్య కేసులో ఈయనతోపాటు వాళ్ల నాన్న పాత్ర ఉందని మొదటి నుంచి నమ్ముతున్నారు. 

ఇన్నాళ్లు చాలా స్లోగా సాగిన సీబీఐ దర్యాప్తు తెలంగాణ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి స్పీడ్ అందుకుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎప్పటి నుంచో అవినాష్ రెడ్డిని పిలుస్తారు. విచారరిస్తారన్ని ప్రచారం జరుగుతున్నా ఇన్నాళ్లకు ఆయన్ని పిలిచి విచారిస్తున్నారు. కేసులో ఇకపైనా అయినా నిజాలు నిగ్గు తేలాలని కుటుంబ సభ్యులతోపాటు చాలామంది కోరుకుంటున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో దర్యాప్తు సాగినన్నాళ్లు... సీబీఐ అధికారులపై అధికార పక్షం వైసీపీ ఒత్తిడి తీసుకు వచ్చిదని అందుకే దర్యాప్తు చాలా ఆలస్యంగా జరిగిందని ప్రతిపక్షాలతోపాాటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. అందుకే సునీత కోర్టులో పిటిషన్ వేసి... ఏపీల నుంచి దర్యాప్తును వేరే రాష్ట్రానికి  మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తెలంగాణ నుంచి దర్యాప్తు కొనసాగాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణలో దర్యాప్తు ప్రారంభమైన తొలి విడతలోనే అవినాష్‌ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. మొదటి నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు తర్వాత రోజే విచారణకు రమ్మమన్నారు. అంటే జనవరి 24న నోటీసులు జారీ చేసిన అధికారులు జనవరి 25న విచారణ రావాలని పిలుపునిచ్చారు. అయితే తనకు ముందస్తుగా నిర్ణయించు షెడ్యూళ్లు ప్రకారం చాలా పనులు ఉన్నాయని చెప్పారు. ఐదు రోజల పాటు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు సమాధానం ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌

వీడియోలు

North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
The Raja Saab Bookings: రాజా సాబ్ ప్లానింగ్ అదుర్స్... అమెరికాలో నెల ముందు!
రాజా సాబ్ ప్లానింగ్ అదుర్స్... అమెరికాలో నెల ముందు!
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
CBSE Board Exam 2026: సిబిఎస్ఇ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! పరీక్ష రూల్స్‌లో భారీ మార్పులు!
సిబిఎస్ఇ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! పరీక్ష రూల్స్‌లో భారీ మార్పులు!
Embed widget