అన్వేషించండి

Andhra Pradesh Quantum Computing Policy: ఏపీకి దేశాన్నినడిపించే సామర్థ్యం -ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ విడుదల చేసిన లోకేష్

CII Summit: ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీని నారా లోకేష్ విడుదల చేశారు. క్వాంటం మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించిన రాష్ట్రాలలో ఏపీ ఒకటన్నారు.

Andhra Pradesh Quantum Computing Policy released:  క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్   అంశంపై సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగంణలో జరిగిన సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  క్వాంటం కంప్యూటింగ్ అంశంపై కీలక ప్రసంగం ఇవ్వడానికి నేను సరైన వ్యక్తిని కాదనిపిస్తోంది. ఈ రంగంపై నాకు చాలా పరిమితమైన అవగాహన మాత్రమే ఉంది. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. ఇంత గొప్ప ప్యానల్ సమక్షంలో ఉండటం నాకు గర్వకారణంగా ఉందన్నారు. 

కలలు కనడం కాదు..సాకారాం చేస్తాం ! 

ఏదైనా అమలు చేయాలంటే ముందు ఒక కల ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో మనం కేవలం కలలు మాత్రమే కాదు.. వాటిని సాకారం కూడా చేస్తాం. అందుకే భారతదేశ విజన్ ను సాకారం చేసేలా క్వాంటం మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించిన తొలి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచామన్నారు.  అమరావతిలో మొత్తం క్యాంటం వ్యాలీకి నాలుగు ముఖ్యమైన పునాదులు రూపొందించడం జరిగింది. మొదటిది అసలైన క్వాంటమ్ కంప్యూటర్ ను ఏర్పాటుచేయడం, దానికి సంబంధించిన వినియోగ సందర్భాలు, పరిశోధనలను అభివృద్ధి చేయడం.. రెండోది దానికి సంబంధించిన సాప్ట్ వేర్ అభివృద్ధి, మూడోది ప్రతిభావంతమైన ఎకోసిస్టమ్ ను నిర్మించడం, నాలుగోది అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ అని తెలిపారు. 

దేశాన్ని ముందుకు నడిపించే  సామర్థ్యం

క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉంది. సీఎం చంద్రబాబు క్వాంటమ్ మిషన్ గురించి, క్వాంటం కంప్యూటర్ తీసుకురావాలని చెప్పినరోజు నేను చాట్ జీపీటీకి వెళ్లి క్వాంటమ్ మిషన్, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏమిటని వెతికాను. ఇప్పుడు పూర్తిస్థాయి మిషన్ ను నిర్మించే స్థాయికి వచ్చామని చెప్పారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ(2025-30)ని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. నారా లోకేష్ సమక్షంలో క్వాంటం టెక్నాలజీ రంగంలో 23 సంస్థలతో ఈ సందర్భంగా ఎంవోయూలు కుదుర్చుకున్నారు.  

వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండి జెరేమి జుర్గెన్స్ తో మంత్రి లోకేష్ భేటీ  

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరక్టర్ జెరెమీ జుర్గెన్స్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సైబర్ రక్షణ అంశంపై చర్చించారు.    ప్రపంచం పరస్పరం అనుసంధానమైన నేపథ్యంలో సైబర్‌సెక్యూరిటీ జాతీయ భద్రతలో కీలకం. అక్టోబర్ 2023 నుండి సెప్టంబర్ 2024 వరకు, భారతదేశంలో 369 మిలియన్లకి పైగా సైబర్‌సెక్యూరిటీ ఘటనలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 2033 నాటికి సైబర్‌దాడులు సుమారు $1 ట్రిలియన్ నష్టాలను కలిగించనుందని అంచనా. ఇవి చాలా ఆందోళనకరమైన అంశం. ఇవి కీలకమైన మౌలిక సదుపాయాలకు అడ్డంకులు సృష్టించి, ఆర్థిక అభివృద్ధి ప్రతిబంధకంగా మారతాయి. ఆంధ్రప్రదేశ్ ఐటి హబ్ గా అభివృద్ధి చెందుతోంది. మా రాష్ట్రంలో పరిశ్రమలు, రవాణా, విద్యుత్ రంగాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. ఈ ప్రయాణం సజావుగా సాగాలంటే బలమైన సైబర్ సెక్యూరిటీ అవసరమన్నారు.  ప్రభుత్వం పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రపంచ నిపుణులతో అనుసంధానించి సరికొత్త ఆవిష్కరణలకు ఇది దోహదం చేస్తుందని లోకేష్ తెలిపారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget