అన్వేషించండి

Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్

YSRCP Chief Jagan: ఏపీలో సోషల్ మీడియా వార్ నడుస్తోంది. నేతలను వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. దీనిని వైసీపీ అధినేత జగన్ ఖండించారు.

AP Police Registered Case YSRCP Supporters Against Social Media obscene posts: సోషల్ మీడియాలో పోస్టులు శ్రుతి మించిపోతున్నాయని పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. వివిధ వర్గాల నుంచి అందుతున్న ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్కరోజే భారీగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీనిపై వైసీపీ మండిపడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోంది మంచిది కాదంటూ ప్రభుత్వానికి జగన్ వార్నింగ్ ఇచ్చారు. 

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైసీపీ మద్దతు దారులు పెట్టిన పోస్టులు వివాదాస్పదమవుతున్నాయి. ఇవి ప్రత్యర్థులను కించపరిచేలా ఉంటున్నాయని విమర్శలు చేస్తే సమాధానం చెబుతామని అంటున్నారు కూటమి మద్దతుదారులు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదులు అందుకుంటున్న పోలీసులు ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. 

సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు, మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో లోపాలు ఎత్తి చూపుతూ కొన్ని పోస్టులు ఉంటున్నాయి. వాటికి అటు నుంచి అదే స్థాయిలో సమాధానం వస్తోంది. అయితే మరికొందరు మాత్రం కూటమి నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ఎఫ్‌ రెడ్డి, ఏకే ఫ్యాన్‌ ఎట్‌ జగన్‌మామ92, దర్శన్‌ ఎట్‌ దూరదర్శన్‌ 619 వంటి ఎక్స్‌ హ్యాండిల్స్‌ నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తున్నాయి. వీటిని సాక్ష్యంగా చూపిస్తూ వివిధ పోలీస్ స్టేషన్లలో జనసేన, టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. వీటి ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక్క విజయవాడ పరిధిలోనే 40కిపైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ హ్యాండిల్స్‌ నుంచి వచ్చిన పోస్టులు వివిధ వర్గాలను, రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పోలీసులు ఎఫ్‌ఐర్‌లు రిజిస్టర్ చేశారు. 

గతంలో కూడా వైసీపీ నేతలు కొందరు టీడీపీ, జనసేన నేతలపై అసభ్యపదజాలంతో తిడుతూ పోస్టులు పెట్టారని వాటిపై కూడా కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని కూడా పోలీసులు పరిశీలించారు. ఇప్పటికీ ఆ పోస్టులు సోషల్ మీడియాలో ఉన్నందున వాటిని పోస్టు చేసిన వారిపై కూడా కేసులు రిజిస్టర్ చేశారు. 

జగన్ వార్నింగ్

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెట్టడాన్ని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. కూటమి నేతల ఒత్తిడితోనే వైసీపీ మద్దతుదారులు, నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటివి ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జగన్ హెచ్చరించారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ కేసులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 

గతాన్ని గుర్తు చేస్తున్న టీడీపీ మద్దతుదారులు

జగన్ వార్నింగ్‌పై టీడీపీ మద్దతుదారులు ఫైర్ అవుతున్నారు. గతాన్ని మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే అర్థరాత్రి వచ్చి అరెస్టు చేసిన ఘటనలు మర్చిపోయారా అంటూ గుర్తు చేస్తున్నారు. ఇళ్లపైకి సీఐడీ అధికారులను పంపించిన సంగతి గుర్తు తెచ్చుకోవాలని ఆయన్ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. నాడు టీడీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు వాటిపైనే కేసులు రిజిస్టర్ అవుతున్నాయని వివరిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget