అన్వేషించండి

Tirumala Laddu Controversy: లడ్డూ వివాదంలో మరో కీలక పరిణామం-టీటీడీ ఈవోకు సీఎంవో నుంచి పిలుపు

Tirumala Laddu Issue: లడ్డూ వివాదంలో చర్యలు దిశగా ప్రభుత్వం కదులుతోంది. ఏం జరిగిందో రిపోర్ట్ రెడీ చేయమని టీటీడీని ఆదేశించిన చంద్రబాబు... ఈవోను రాజధానికి పిలిచారు

Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ కల్తీ వివాదం మరింత పెద్దది అవుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దీనిపై ఆందోళనలు జరుగుతున్నాయి. బిజీపే నేతలు కూడా నెయ్యిలో కల్తీ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల భక్తుల మనోభావాలకు చెందిన విషయంగా చెబుతున్నారు. నిజంగా లడ్డూ తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫాట్ కలిసిందా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బయటపెట్టిన చంద్రబాబు

గత వైసీపీ హయాంలో జరిగిన దారుణల్లో ఇది అత్యంత హేయమైనది అని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి లాంటి వాళ్ళు తెరపైకి వచ్చి ఈ ఆరోపణలను ఖండించారు. అయితే టీడీపీ నేతలు నెయ్యిని టెస్ట్ చేసిన రిపోర్ట్స్ బయట పెట్టారు. దానితో ప్రజల్లో ఆందోళన మొదలైంది. 

బీజేపీపై జగన్ విమర్శలు

అంతవరకూ దీనిని రాజకీయ ఆరోపణగానే భావించిన వారు సైతం ఆ రిపోర్ట్ బయటకు రావడంతో షాక్ తిన్నారు. వివాదం మరింత ముదరడంతో మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదంతా ఫేక్ ప్రచారం అని కొట్టి పారేశారు. కేంద్రంలో బీజేపీ నాయకులు కూడా హాఫ్ నాలెడ్జ్‌తో అనవసర ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అనేక టెస్టుల తర్వాతే నెయ్యిని తిరుమలకు అనుమతిస్తారని దానిలో కల్తీ జరిగే ప్రశక్తే లేదని కూడా జగన్ తెలిపారు.

సమగ్ర విచారణ చేస్తున్నామని ఈవో వివరణ 
ఈ వ్యవహారంపై ఇప్పటికే మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామల రావు గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యి లో కల్తీ జరిగిన మాట నిజమే అని అన్నారు. వెంటనే ఆ పాత డీలర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని చెప్పారు. ఈ వివాదంపై ఇంటర్నల్‌గా టీటీడీలో విచారణ చేస్తున్నామని అని కూడా చెప్పారు. ఆవు నెయ్యిని అంత తక్కువ ధరకు ఎలా సప్లయ్ చేస్తున్నారనే అనుమానంతో విచారణ ప్రారంభిస్తే అది కల్తీ నెయ్యి అనే విషయం బయటపడింది అని చెప్పు కొచ్చారు.

Also Read: లడ్డూ వివాదంతో చంద్రబాబు కీలక నిర్ణయం- పోటు నుంచి నెయ్యి ఉంచే ప్రదేశాల వరకు సంప్రోక్షణ

టీటీడీ ఈవో కు CMO పిలువు 

మరోవైవు ఏపీ ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి టీటీడీ ఈవోకు పిలువు వచ్చింది. ఇప్పటికే తమవద్ద ఉన్న రిపోర్ట్స్‌కు తోడు ఈవో దగ్గర ఉన్న ఆధారాలు కూడా పరిశీలించి ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ వివాదం పై సిబిఐ దర్యాప్తు కూడా అవసరం అని మిగిలిన రాజకీయ పక్షాలు, సెలబ్రిటీల నుంచి డిమాండ్ వస్తోంది. టీటీడీలో ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ఉన్నారు సామాన్య భక్తులు. మరి ఈ వివాదం మరెన్ని మలువులు తిరుగుతుందో చూడాలి.

Also Read: తిరుమలకు నెయ్యి సరఫరా చేసే సంస్థలు ఎన్ని?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget