అన్వేషించండి

Tirumala Laddu Controversy: లడ్డూ వివాదంలో మరో కీలక పరిణామం-టీటీడీ ఈవోకు సీఎంవో నుంచి పిలుపు

Tirumala Laddu Issue: లడ్డూ వివాదంలో చర్యలు దిశగా ప్రభుత్వం కదులుతోంది. ఏం జరిగిందో రిపోర్ట్ రెడీ చేయమని టీటీడీని ఆదేశించిన చంద్రబాబు... ఈవోను రాజధానికి పిలిచారు

Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ కల్తీ వివాదం మరింత పెద్దది అవుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దీనిపై ఆందోళనలు జరుగుతున్నాయి. బిజీపే నేతలు కూడా నెయ్యిలో కల్తీ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల భక్తుల మనోభావాలకు చెందిన విషయంగా చెబుతున్నారు. నిజంగా లడ్డూ తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫాట్ కలిసిందా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బయటపెట్టిన చంద్రబాబు

గత వైసీపీ హయాంలో జరిగిన దారుణల్లో ఇది అత్యంత హేయమైనది అని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి లాంటి వాళ్ళు తెరపైకి వచ్చి ఈ ఆరోపణలను ఖండించారు. అయితే టీడీపీ నేతలు నెయ్యిని టెస్ట్ చేసిన రిపోర్ట్స్ బయట పెట్టారు. దానితో ప్రజల్లో ఆందోళన మొదలైంది. 

బీజేపీపై జగన్ విమర్శలు

అంతవరకూ దీనిని రాజకీయ ఆరోపణగానే భావించిన వారు సైతం ఆ రిపోర్ట్ బయటకు రావడంతో షాక్ తిన్నారు. వివాదం మరింత ముదరడంతో మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదంతా ఫేక్ ప్రచారం అని కొట్టి పారేశారు. కేంద్రంలో బీజేపీ నాయకులు కూడా హాఫ్ నాలెడ్జ్‌తో అనవసర ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అనేక టెస్టుల తర్వాతే నెయ్యిని తిరుమలకు అనుమతిస్తారని దానిలో కల్తీ జరిగే ప్రశక్తే లేదని కూడా జగన్ తెలిపారు.

సమగ్ర విచారణ చేస్తున్నామని ఈవో వివరణ 
ఈ వ్యవహారంపై ఇప్పటికే మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామల రావు గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యి లో కల్తీ జరిగిన మాట నిజమే అని అన్నారు. వెంటనే ఆ పాత డీలర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని చెప్పారు. ఈ వివాదంపై ఇంటర్నల్‌గా టీటీడీలో విచారణ చేస్తున్నామని అని కూడా చెప్పారు. ఆవు నెయ్యిని అంత తక్కువ ధరకు ఎలా సప్లయ్ చేస్తున్నారనే అనుమానంతో విచారణ ప్రారంభిస్తే అది కల్తీ నెయ్యి అనే విషయం బయటపడింది అని చెప్పు కొచ్చారు.

Also Read: లడ్డూ వివాదంతో చంద్రబాబు కీలక నిర్ణయం- పోటు నుంచి నెయ్యి ఉంచే ప్రదేశాల వరకు సంప్రోక్షణ

టీటీడీ ఈవో కు CMO పిలువు 

మరోవైవు ఏపీ ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి టీటీడీ ఈవోకు పిలువు వచ్చింది. ఇప్పటికే తమవద్ద ఉన్న రిపోర్ట్స్‌కు తోడు ఈవో దగ్గర ఉన్న ఆధారాలు కూడా పరిశీలించి ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ వివాదం పై సిబిఐ దర్యాప్తు కూడా అవసరం అని మిగిలిన రాజకీయ పక్షాలు, సెలబ్రిటీల నుంచి డిమాండ్ వస్తోంది. టీటీడీలో ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ఉన్నారు సామాన్య భక్తులు. మరి ఈ వివాదం మరెన్ని మలువులు తిరుగుతుందో చూడాలి.

Also Read: తిరుమలకు నెయ్యి సరఫరా చేసే సంస్థలు ఎన్ని?

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Embed widget