అన్వేషించండి

Vande Bharat Metro: ఏపీలో వందే భారత్ మెట్రో రైలు - ఆ 2 నగరాల మధ్య పరుగులు!

Andhrapradesh News: త్వరలోనే వందే భారత్ మెట్రో రైళ్లను పట్టాలెక్కించనున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీలో తిరుపతి - చెన్నై నగరాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Vande Bharat Metro Train Runs In Ap: భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు అందుబాటులో ఉన్న అన్ని రూట్లలోనూ పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వందే భారత్ రైళ్లకు భారీగా జనాదరణ పెరిగింది. ప్రస్తుతం సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండు రైళ్లు నడుస్తుండగా.. విజయవాడ - చెన్నై, విశాఖ - భువనేశ్వర్, సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ - యశ్వంత్ పూర్ మధ్య రైళ్లను నడుపుతున్నారు. ఈ రూట్లలోనూ వంద శాతం ఆక్యుపెన్సీతో దూసుకుపోతున్నాయి. తాజాగా వందే భారత్ స్లీపర్ రైళ్లను సైతం రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఇంట్రా సిటీ రవాణా వ్యవస్థలో భాగంగా మార్పు దిశగా తొలిసారిగా వందే భారత్ మెట్రో రైళ్లను (Vande Bharat Metro Trains) సైతం త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జులై నుంచి వందే మెట్రో రైళ్లు పట్టాలెక్కనుండగా.. ఏపీలో కూడా ఒక రైలు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఆ రూట్ లోనే.!

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి (Tirupati) నుంచి చెన్నై (Chennai) నగరాల మధ్య వందే భారత్ మెట్రో ట్రయల్ రన్ (Trail Run) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జులైలో ట్రయల్ రన్ చేపట్టనుండగా.. 2 వారాల ట్రయల్స్ అనంతరం ఈ నగరాల మధ్య పూర్తి స్థాయిలో రైలు నడపనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఆగ్రా - మధుర, లక్నో - కాన్పూర్ మార్గాలను సైతం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవలే వందే భారత్ మెట్రో లుక్ బయటకు రాగా.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవీ ప్రత్యేకతలు

  • నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని వందే భారత్ మెట్రో రైళ్లను రూపొందిస్తున్నారు. ఈ రైళ్లు 100 నుంచి 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. 
  • ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ప్రయాణికులను అనువైన సీటింగ్ ఉంటుంది.
  • ఈ రైలులో నాలుగేసి బోగీలు ఓ యూనిట్ గా ఉండగా.. ఒక రైలులో కనీసం 12 బోగీలు ఉంటాయి. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బోగీలను 16కు పెంచే ఛాన్స్ ఉంది.
  • దేశవ్యాప్తంగా తొలి దశలో  50 మెట్రో రైళ్లు అందుబాటులోకి తీసుకు రానుండగా.. అనంతరం వీటిని 400 వరకూ పెంచాలని రైల్వే శాఖ భావిస్తోంది. వందే భారత్ రైళ్ల మాదిరిగానే ఈ సర్వీసులపైనా ప్రయాణికులు ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది.

Also Read: Election Commission: కూటమికి ఈసీ షాక్ - జనసేనకు గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేయలేమన్న ఎన్నికల సంఘం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget