అన్వేషించండి

Scrub Typhus: శ్రీకాకుళం జిల్లాలో 8 మందికి స్క్రబ్ టైపస్ వ్యాధి నిర్దారణ, ఇద్దరు మృతి!

Scrub Typhus: శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలతో ఇప్పటికే ఇద్దరు చనిపోగా.. 8 మంది స్క్రబ్ టైపస్ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం వారు రిమ్స్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. 

Scrub Typhus: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని అప్పాపురం గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. గ్రామంలో స్క్రబ్ టైపస్ వ్యాధి ప్రబలడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆ వ్యాధి సోకిన కారణంగా గ్రామంలో విషజ్వరాలు వంటి వాచి బారిన పడి ఒకే కుటుంబానికి చెందిన ఎండ సూరమ్మ, ఎండ భవానీలు మృతి చెందడంతో వారు భయపడుతున్నారు. మరి కొంత మంది కూడా ఆ వ్యాధి లక్షణాలతో సతమతమవుతున్నారు. వారిని చికిత్స కోసం రిమ్స్ లోని ప్రత్యేక వార్డుకి తరలించారు. అక్కడ వేరేగా వారిని వార్డులో ఉంచి వైద్య సేవలను అందిస్తున్నారు. గ్రామంలో ప్రతీ ఇంట్లో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచే చర్యలను చేపట్టారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని కప్పించేందుకు అవసరమైన కసరత్తులను చేస్తున్నారు. 

Scrub Typhus: శ్రీకాకుళం జిల్లాలో 8 మందికి స్క్రబ్ టైపస్ వ్యాధి నిర్దారణ, ఇద్దరు మృతి!

గత వారం రోజులుగా గ్రామస్తులు ఈ వింత వ్యాధి కారణంగా భయపడుతున్నారు. విష జ్వరాలు గ్రామంలో ప్రబలుతున్న విషయం వెలుగులోకి రావడంతో జిల్లా అధికారులు తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి బొడ్డేపల్లి మీనాక్షి గ్రామంలో ప్రత్యేక వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. లావేరు పీహెచ్ సీ వైద్యాధికారులు డా.చంద్రమౌళి, డా.జోత్స్నల ఆద్వర్యంలో ఫీవర్ సర్వే కొనసాగిస్తున్నారు. స్క్రబ్ టైపస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తు న్నారు. అందులో భాగంగా 7 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా శుక్రవారం మద్యాహ్నం నాటికి మరొక వ్యక్తిలో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతోవారిని ప్రత్యేక చికిత్స కోసం రిమ్స్ కి తరలించారు. వారందరినీ అక్కడ ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య సేవలను అందజేసున్నారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్సి సైక్లిన్ మాత్రలను గ్రామస్థులకు పంపిణీ చేసి వాటిని వారు తీసుకునేలా చర్యలు చేపట్టారు. 

స్క్రబ్ టైపస్ వ్యాధి ఎలా సోకుతుంది..?

స్క్రబ్ టైపస్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆ బ్యాక్టీరియా కరవడం వల్ల ఒంటిపై గాయాలు అయినట్లుగా కనిపిస్తోంది. జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పి వంటి లక్షణాలు దాని బారిన పడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వ్యవసాయ పనులు చేసే సమయంలో గ్రామస్థులు దాని బారిన పడి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. వైద్య సిబ్బందికి మండల అధికారులకు కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిల ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది, మండల స్థాయి, గ్రామ స్థాయి సిబ్బంది అక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు. 

అప్పాపురం గ్రామం మొత్తం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బ్లీచింగ్ వేయించడం, స్ప్రేయింగ్ చేయించడం వంటి పనులు చేపట్టారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. వైద్యులు డా. చంద్రమౌలి, డా.జ్యోత్స్నలు అక్కడే ఉండి వైద్య సహాయాలను అందిస్తున్నారు. అదే విధంగా గ్రామస్థులకి అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఒంటిపై ఎలాంటి పురుగులు లేకుండా చూసుకోవాలని, బట్టలు వేసుకునేముందు కూడా దులుపుకొని వేసుకోవాలని సూచించారు. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. దెబ్బ తగిలిన ట్లుగా ఒంటిపై ఏవైనా గాయాలు ఉన్నట్లయితే అందుబాటులో ఉన్న వైద్యులను వెంటనే సంప్రదించాలని తెలిపారు. అలాగే గ్రామంలో ఉన్న వారందరికీ డాక్సి సైక్లిన్ ట్యాబ్ లెట్లు అందజేయడం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. మరో విడత కూడా అందించేందుకు సిద్దంగా ఉన్నామని వివరించారు. గ్రామానికి 25వేల మాత్రల ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మీనాక్షి పంపించారని తెలియజేశారు.

అయితే వ్యాధికి కారణం అయిన పురుగులు ఎక్కువగా వ్యవసాయ భూములలో పెరుగుతుంటాయని వాటి సోర్స్ ఎక్కడ ఉందో కూడా గుర్తించడం జరిగిందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. వైద్య శిబిరం గ్రామంలో కొనసాగుతుండడం, పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స కోసం రిమ్స్ లోని ప్రత్యేక వార్డుకి తరలించడం వంటి వాటిలో వారు హడలిపోతున్నారు. ప్రస్తుతానికి గ్రామంలో జ్వరాల తీవ్రత ఏమి లేదని, పరీక్షలను కొనసాగిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. మందులు అన్ని సిద్ధంగా ఉన్నాయని ప్రజలెవ్వరూ భయ పడద్దని పేర్కొంటున్నారు. చిన్న పాటి జ్వరాలు ఉన్న వెంటనే వైద్య శిబిరంలో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిని సంప్రదించి సేవలు పొందాలని వారు ప్రజలకి సూచిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget