అన్వేషించండి

TTD High Court : 50 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు

టీటీడీ పాలక మండలికి నియమించిన ప్రత్యేక ఆహ్వానితులందరూ పదవులు కోల్పోయారు. ఆ నియామక జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.


ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ఏకంగా 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. ఇటీవల పాలక మండలిని నియమించిన ప్రభుత్వం 25మంది సభ్యులను అధికారికంగా నియమించింది. అయితే ప్రత్యేక ఆహ్వానితులంటూ మరో 52 మందిని నియమించింది. దీని కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరు ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ఈ నియామకాలు చట్ట విరుద్ధమని.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

Also Read : అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు... ఈ ఏడాది ఏకాంతంగానే సేవలు.. ఆ జిల్లాల భక్తులకు గుడ్ న్యూస్

తిరుపతి బీజేపీ నేత  భాను ప్రకాష్ రెడ్డితో పాటు జనశక్తి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్‌కుమార్‌, టీడీపీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఎపి ఎండోమెంట్ యాక్ట్ 1987కు విరుద్దంగా బోర్డు నియామకం జరిగిందని పిల్ లో వీరు పేర్కొన్నారు. వీరు తమ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని కోరారు. అత్యవసరంగా విచారించకపోతే నియమితులైన వారు ప్రమాణస్వీకారం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం ఉదయం విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read : మద్యం దుకాణాల్లో "గౌడ్‌"లకే 15 శాతం ! తెలంగాణ సర్కార్ నిర్ణయానికి కారణం ఏమిటి ?

టీటీడీ బోర్డును ప్రకటించినప్పటి నుండి తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాజకీయ అవసరాల కోసం, లాబీయింగ్ చేసే వారిని, వివిధ కేసుల్లో ఉన్న వారిని పవిత్రమైన ఆలయంలో పాలక మండలి సభ్యులుగా చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రస్ట్ బోర్డును రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం గవర్నర్ ను కలిసి ఇదే అంశం పైన ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి రాసిన ఓ లేఖ కూడా సంచలనాత్మకం అయింది. తాను సిఫార్సు చేసినందుకు వరప్రసాద్ అనే వ్యక్తిని ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించారని ప్రచారం జరుగుతోందని కానీ తాను ఎవర్నీ సిఫార్సు చేయలేదన్నారు. దీని పైన పరిశీలన చేయాలని కోరారు.

Also Read: Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ ఛైర్మన్‌

హైకోర్టును జీవోను సస్పెండ్ చేయడంతో పూర్తి స్థాయి పాలక మండలి సభ్యులుగా నియమితులైన 25 మందికి మాత్రమే పదవులు ఉంటాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 50 మందికి పదవులు రద్దవుతాయి.  ప్రభుత్వం మళ్లీ డివిజనల్ బెంచ్‌కో లేకపోతే.. మరో విధంగానో  చట్ట ప్రకారమే చేశామని కోర్టు నుంచి ఆమోదం పొందితేనే వారికి పదవులు ఉంటాయి. లేకపోతే లేనట్లే. 

Also Read : అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో నో మైక్ ! స్పీకర్‌కు ప్రివిలేజ్ కమిటీ కీలక సిఫార్సు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
Embed widget