అన్వేషించండి

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి ఎప్పటి నుంచంటే?

Tirumala: కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ 1 నుంచి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లకు భక్తులను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Tirumala: తిరుమలకు ప్రతి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్ధం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు వివిధ రూపాల్లో టీటీడీ స్వామి వారి దర్శనం కల్పిస్తుంది. అయితే సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఆర్జిత సేవల ద్వారా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. కరోనా‌ మహమ్మారి విజృంభించ ముందు వరకూ ఈ విధంగా సాగింది. కోవిడ్ తరువాత ఇందుకు భిన్నంగా తిరుమలలో పరిస్థితులు మారిపోయాయి. ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ దర్శనం చేసుకునేవారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. పరిమిత సంఖ్యలో ఆన్లైన్ లో టికెట్లు విడుదల చేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిపార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు, వర్చువల్ ఆర్జిత సేవ టికెట్లు కలిగిన భక్తులను తిరుమలకు అనుమతిస్తోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో గత నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తూ, భక్తుల‌ సంఖ్యను క్రమేపి పెంచుతూ వస్తోంది టీటీడీ. 

వర్చువల్ విధానంలో దర్శనం 

కోవిడ్ మహమ్మారి విజృంభణ క్రమంలో 2020 మార్చి 20 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని నిలిపివేసింది టీటీడీ.‌ దాదాపు టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులను అనుమతిని రద్దు చేశారు. కరోనా మొదటి దశ తర్వాత క్రమేపి భక్తులను భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అనంతరం రెండో దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో కొండపై మరింత కఠినతరం చేస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించింది టీటీడీ. స్వామి వారి ఆర్జిత సేవలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేక పోవడంతో భక్తుల కోరిక మేరకు 2020 ఆగస్టు 7 తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను వర్చువల్ విధానంలో దర్శన భాగ్యం కల్పించింది. ఇలా ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, కళ్యాణోత్సవం వంటి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులకు అందించింది. ఆన్లైన్ లో ఆర్జిత సేవ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఆర్జిత సేవల్లో నేరుగా పాల్గోనే అవకాశం లేకపోవడంతో భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేది టీటీడీ. 

ఏప్రిల్ 1వ తేదీ ఆర్జిత సేవల్లో భక్తులకు అనుమతి 

అయితే కోవిడ్ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో గత పాలక మండలి సమావేశంలో ఆర్జిత సేవల పునఃప్రారంభించేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలపడంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లకు భక్తులను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, అష్టద‌ళ‌పాద‌ ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లను శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. అయితే కోవిడ్‌ పరిస్ధితుల విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగించనుంది టీటీడీ. అదేవిధంగా క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్ర దీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా యథావిధిగా‌ కొన‌సాగించనుంది.  అయితే వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదని స్పష్టం చేసింది. వర్చువల్ ఆర్జిత సేవల బుక్ చేసుకున్న భక్తుల ద‌ర్శనం క‌ల్పించ‌డంతో పాటు ప్రసాదాలు మాత్రమే అందించనుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్తమాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమతిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా మారిన హవాలా నోటు ముక్క.. నేడు ఈడీ విచారణకు మాజీ మంత్రి కారుమూరి
లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా మారిన హవాలా నోటు ముక్క.. నేడు ఈడీ విచారణకు మాజీ మంత్రి కారుమూరి
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Attacks Pawan Kalyan: పవన్ కల్యాణే టార్గెట్‌గా కల్వకుంట్ల కవిత రాజకీయం! తెలంగాణలో ప్రభావం లేని జనసేనానిపై యుద్ధం వెనుక అసలు వ్యూహం ఇదేనా?
పవన్ కల్యాణే టార్గెట్‌గా కల్వకుంట్ల కవిత రాజకీయం! తెలంగాణలో ప్రభావం లేని జనసేనానిపై యుద్ధం వెనుక అసలు వ్యూహం ఇదేనా?
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
Qatar Gas Fire Accident: ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
Chennai Super Kings News: ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
AP Weather Update Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Embed widget