By: ABP Desam | Updated at : 28 Jan 2022 01:58 PM (IST)
జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ట్రెజరీ సిబ్బంది - ఒకటో తేదీన జీతాలు రావడం కష్టమే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెలా జీతాలు ఆలస్యం అవుతున్నాయి. ఒకటో తేదీ జీతం పడటం అరుదుగా మారింది. అయితే రేపు ఒకటో తేదీనే జీతం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ మాకు జీతాలు వద్దని ఉద్యోగులు అంటున్నారు. అసలు జీతాలు వద్దని అనడం లేదు కానీ పాత జీతాలు ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలిస్తామంటోంది. జీతాలు ప్రాసెస్ చేయాల్సిన ఉద్యోగులు చేయడం లేదు. ప్రభుత్వం సర్క్యూలర్ల మీద సర్క్యులర్లు ఇస్తోంది కానీ పని కావడం లేదు. ఈ రోజు జీతాల బిల్లుల పని పూర్తి కాకపోతే ఒకటో తేదీన వారి అకౌంట్లలో జీతం పడటం కష్టమే. అందుకే జీతం వస్తుందా లేదా అన్న టెన్షన్ ఉద్యోగుల్లో ప్రారంభమయింది.
జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు !
జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం చాలా రోజులుగా ట్రెజరీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ సర్క్యులర్లు జారీ చేస్తోంది. అయితే ఇప్పటికి పోలీసులు, మున్సిపల్ ఉద్యోగుల జీతాల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయినట్లుగా తెలుస్తోంది. పాత జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం లెక్క చూసి ఇస్తామని ప్రభుత్వం తేల్చేసింది. అయితే ఇప్పుడు ప్రాసెస్ చేయాల్సింది కూడా ఉద్యోగులే కావడంతో సమస్య వస్తోంది. అయితే ప్రభుత్వం ముందు ఒక చాయిస్ ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ను అధీనంలోకి తీసుకుని అందరికీ జీతాలు వేయవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని పాటిస్తుందో లేదో స్పష్టత లేదు.
పాత జీతాలు కావాలంటున్న ఏపీ ఉద్యోగులు !
జనవరికి పాత జీతాలు వేస్తేనే చర్చలకు వస్తామనేది ఉద్యోగ నేతల డిమాండ్లలో ఒకటి. చర్చలకు రావాలని పిలిచిన ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి నేతలు ఇదే విషయం స్పష్టం చేస్తూ లేఖ ఇచ్చారు. కానీ ప్రాసెస్ ప్రారంభించకుంటే.. క్రమశిక్షణా చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులకు చర్యలు తప్పవని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిందది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే అంశంపై టైమ్ లైన్ నిర్దేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. శుక్రవారం సాయంత్రంలోగా అప్ లోడ్ చేసిన బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది.ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కార్యదర్శులకు, హెచ్ వోడీలకు, కలెక్టర్లకు ఆదేశాల్లో ఆర్ధిక శాఖ ఆదేశిచింది.
చర్యలు తీసుకున్నా సరే తగ్గేదే లేదంటున్న ఉద్యోగులు !
ముందు జనవరి నెల జీతాలు పాత పద్దతి ప్రకారమే చెల్లిస్తే సరే కానీ.. కొత్త పీఆర్సీ ప్రకారం ఇస్తే ఊరుకునేది లేదని అంటున్నారు. చర్యలు తీసుకున్నా సరే తగ్గేది లేదని..ఒక్కరిపై చర్య తీసుకున్నా తక్షణమే సమ్మె ప్రారంభిస్తామని అంటున్నారు. ప్రస్తుతం నెలకొన్ని సందిగ్ధ పరిస్థితుల్లో కొంత మందికి జీతాలు అందుతాయి కానీ మెజార్టీ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చారు. ముందుగా కొత్త జీతమా.. పాత జీతమా అనే సంగతి పక్కన పెడితే అసలు జీతం అందడం మాత్రం కష్టమన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఏర్పడుతోంది.
Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి
Breaking News Telugu Live Updates: హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
ఏపీ రాజకీయ వేదికపై ఇంత వరకు చూడని సీన్ ఇవాళ మీరు చూడబోతున్నారు!
Machilipatnam Crime News : మచిలీపట్నంలో దారుణం, పోలీసులమని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!
Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?