By: ABP Desam | Updated at : 21 Jun 2022 11:08 AM (IST)
చెప్పుతో కొట్టుకుంటున్న వలంటీర్
సత్యసాయి జిల్లా కదిరిలో ఓ వాలంటీర్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. గ్రామ సచివాలయంలో వ్యవసాయ అధికారుల ముందు వాలంటీర్ తనను తానే చెప్పుతో కొట్టుకున్నాడు. నగేష్ నాయక్ అనే వాలంటీర్ రాందాస్ తాండ గ్రామంలో వాలంటీర్ గా పని చేస్తున్నాడు. పంట నష్టపరిహారం చెల్లింపులో ఎర్ర దొడ్డి పంచాయతీ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వ తీరుకు నిరసనగా నగేష్ నాయక్ రాందాస్ తాండ గ్రామ వాలంటీర్ గా రాజీనామా చేశాడు.
కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి పంచాయతీ రైతులకు పంట నష్టపరిహారం అందించే విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని సిబ్బందిని లోపలే ఉంచి సచివాలయానికి తాళం వేసి రైతులు నిరసన తెలిపారు. తన క్లస్టర్ పరిధిలో 50 మంది రైతులకు ఈ క్రాప్ బుకింగ్ చేసినా అనర్హులైన ఒక కుటుంబానికి తప్ప 49 మంది రైతులకు పంటల బీమా నష్టపరిహారం అందలేదని గ్రామ వలంటీర్ నగేష్ నాయక్ ఆరోపించారు.
గత మూడు సంవత్సరాలుగా తమ కుటుంబానికి సైతం పంటల బీమా రాలేదని ఎర్రదొడ్డి పంచాయతీలో రైతులు ఆవేదన చెందారు. పంచాయతీ పరిధిలోని 1200 మంది రైతులు E-crop బుకింగ్ చేసుకున్నా, కేవలం 44 మంది రైతులకు మాత్రమే పంటల బీమా వర్తించిందని విమర్శించారు. అందులో ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
టీడీపీకి మరో సన్స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్మెంట్, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష
Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్ పరీక్ష, హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి!
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్పై మంగళవారం విచారణ
Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్
Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్లోనే, 3 దశాబ్దాల తరవాత సర్ప్రైజ్