అన్వేషించండి

TTD Vaikuntha Dwara Darshan Tickets: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల జారీ ఆన్‌లైన్‌లోనే - ఈ డిప్ పద్దతిలోనే కేటాయింపు - టీటీడీ కీలక నిర్ణయం

TTD Tickets: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు నవంబర్ 27 నుంచి ఈ-డిప్ ప్రక్రియలో జారీ చేయనున్నారు. ఆఫ్‌లైన్ లో తొక్కిసలాట లాంటి ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

TTD Vaikuntha Dwara Darshan tickets:  తిరుమల తిరుపతి దేవస్థానం మండలి (టీటీడీ) వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు నవంబర్ 27, 2025 నుంచి ఎలక్ట్రానిక్ డ్రా ఆఫ్ లాట్స్ (ఈ-డిప్) ప్రక్రియ ద్వారా జారీ చేయనున్నారు. ఈ నిర్ణయం భక్తులకు సౌకర్యం కల్పించేందుకు, పారదర్శకంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది.
 
వైకుంఠ ద్వార దర్శనం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో  వైకుంఠ ఏకాదశి రోజున  జరిగే ప్రత్యేక దర్శనం. పది రోజుల పాటు భక్తులు మహా ద్వారం  ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు.  నవంబర్ 27, 2025 నుంచి ప్రారంభం. టీటీడీ అధికారులు ఈ-డిప్ (ఎలక్ట్రానిక్ డ్రా ఆఫ్ లాట్స్) వ్యవస్థ ద్వారా టోకెన్లు కేటాయించనున్నారు.  భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లేదా ttseva యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి రోజుకు ఒక్కోసారి మాత్రమే దరఖాస్తు చేసుకునే వ్యవస్థ ఉంటుంది. దరఖాస్తు ముగిసిన తర్వాత, లాటరీ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.  విజేతలు SMS మరియు ఈమెయిల్ ద్వారా తమ టోకెన్ సమాచారం పొందుతారు. టికెట్‌లో నిర్దేశించిన తేదీ మరియు సమయం మేరకు దర్శనం లభిస్తుంది.   

పది రోజులలో మొత్తం 182 గంటల దర్శన సమయంలో.. సామాన్య భక్తుల కోసం 164 గంటలు కేటాయిస్తున్నారు. మొదటి మూడు రోజుల పాటు అ్ని బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు. ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే అనుమితిస్తారు 300 రూపాయల టికెట్ దర్శనాలను రద్దు  చేశారు.   అలాగే శ్రీవాణి దర్శనాలు రద్దు చేశారు.  అలాగే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ.. 300 రూపాయల దర్శనం టికెట్లు, శ్రీవాణి టికెట్లను రెగ్యులర్ పద్ధతిలోనే  కేటాయిస్తారు. రూ.300 దర్శనం టికెట్లను రోజుకు 15 వేల టికెట్ల చొప్పున, శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వేయి చొప్పున కేటాయిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.  

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 2026 ఫిబ్రవరి నెల దర్శనం, సేవలు, గదుల కోటా బుకింగ్ ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది. టీటీడీ అధికారులు ఈ రోజు (నవంబర్ 18, 2025) ఉదయం 10 గంటలకు మొదటి దశగా అర్జిత సేవల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్‌లో తెరిచారు.  ఈ నెలాఖరులోపు ఫిబ్రవరి నెల మొత్తం రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు, కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, అంగప్రదక్షిణం, సీనియర్ సిటిజన్ దర్శనం, SRIVANI ట్రస్ట్ టికెట్లు, తిరుమల-తిరుపతి గదులు అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు.  ముఖ్యంగా రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు నవంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.  
ఒక్కో వ్యక్తి ఒకేసారి గరిష్ఠంగా ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు. పిల్లలకు (12 ఏళ్ల లోపు) టికెట్ అవసరం లేకపోయినా వారి ఆధార్ కార్డు నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. బుక్ చేసిన తర్వాత ఈ-టికెట్‌ను ప్రింట్ తీసుకుని, ఆధార్ కార్డు ఒరిజినల్‌తో కలిపి దర్శనానికి తీసుకురావాలి. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget