అన్వేషించండి

Tirumala News: గత ఐదేళ్లలో టీటీడీలో అక్రమాలపై ఆరు మందిపై కేసులు, కూటమి ప్రభుత్వం చర్యలు!

Tirumala news: టిటిడి పాలకమండలి గత ఐదు ఏళ్ళలో చేసిన పనుల్లో జరిగిన అవినీతిపై స్టేట్ విజిలెన్సు ఆరు మందిపై కేసు నమోదు చేసింది. వివరణ ఇవ్వాలని వారికి నోటిసులు జారీ చేసింది.

Tirumala news: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో గత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. ఐదేళ్ల కాలంలో టీటీడీకి ఈవో లేడు. తొలుత టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి వ్యవహరించారు. ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా బదిలీ చేసారు. ఆ తరువాత ఐఆర్ఎస్ అధికారి అయిన ఏవి ధర్మారెడ్డి టీటీడీ తిరుమల జేఈవోగా నియమించారు. ఈవో లేని కారణంగా తిరుమల జేఈవోకు అదనపు ఈవో బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత కొన్ని రోజులకు టీటీడీ ఈవో గా మరో అదనపు ఈవోగా కేటాయించారు.

తిరుమలకు సంబంధించి అప్పటి వరకు ఉన్న తిరుమల జేఈవో, అదనపు ఈవో రెండు పోస్టులతో పాటు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి ఇచ్చారు. ఇక టీటీడీ తిరుపతి పరిపాలన కు సంబంధించి అప్పటి వరకు ఒక జేఈవో పదవి మాత్రమే ఉండేది.. అది రెండు గా మార్చారు. ఇందులో విద్య, వైద్యం కింద ఓ జేఈవో పోస్టును కేటాయించి మిగిలిన పరిపాలన మొత్తం మరొక్క జేఈవోకు ఇచ్చారు. అప్పట్లో ఈ పోస్టులకు సంబంధించి కొందరు వ్యతిరేకించారు. మరికొందరు నాయకులు భాజపా కి చెందిన భాను ప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి సైతం ఐఆర్ఎస్ కు టీటీడీ ఈవో పోస్టు ఇవ్వడం పై కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం పలు అంశాలను ఉపయోగించి ఈవో కాదు అదనపు ఈవో అని చూపిస్తూ ధర్మారెడ్డిని ఐదేళ్ల పాటు టీటీడీలో కొనసాగించారు.

టీటీడీ పాలకమండలి ఏర్పాటు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడుసార్లు టీటీడీ బోర్డులు చేశారు. ఇందులో రెండు పర్యాయాలు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు గా జగన్ కు బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. అప్పట్లో ప్రత్యేక ఆహ్వానితులు అంటూ ఓ 100 మంది పేర్లు పెట్టి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే రెండో పాలకమండలిలో ఈ విషయం పై కోర్టు ను భానుప్రకాష్ రెడ్డి కోర్టులో మెట్టు ఎక్కారు. దీనిపై జెంబో బోర్డు ను కోర్టు రద్దు చేసింది. అయితే అందులోని పలువురు ప్రముఖులకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న టీటీడీ స్థానిక మండలి అధ్యక్షులుగా ఎంపిక చేసారు. ఆ తరువాత మూడో పాలకమండలికి టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కి కేటాయించారు. ఆ బోర్డు సమయం ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలో మరో టీటీడీ బోర్డు వేయకపోగా టీటీడీ చైర్మన్ పదవిని, ఎక్స్ అఫీసిషియో సభ్యులను మాత్రం కొనసాగారు.

కూటమి ప్రభుత్వం చర్యలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ అని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ కు రూ.10వేలు చెల్లిస్తే ఒక వ్యక్తి కి బ్రేక్ దర్శనం కేటాయించేలా, ఆ నిధులను పురాతన ఆలయాల పునర్నిర్మాణం, నూతన ఆలయాల నిర్మాణం, దూప దీప నైవేద్యాలు సమర్పించేలా తీర్మానం చేశారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ట్రస్ట్ ప్రారంభించిన నాలుగేళ్ల లో సుమారు 100 కోట్ల మార్క్ దాటింది. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులు ప్రభుత్వ ఖజానాకు మార్చారని, ట్రస్ట్ పేరుతో అవసరం లేని ప్రాంతాల్లో, బాగున్న ప్రాంతాల్లో నిర్మాణాలు చేసి టీటీడీ నిధులను అక్రమంగా వైసీపీ తినేస్తుందని, నిర్మాణ కాంట్రాక్టులు వైసీపీ నాయకులు వారి అనుచరులకు అప్పగించారని దీని ద్వారా భారీ మొత్తంలో కమీషన్లు చేతులు మారాయని కూటమి ప్రభుత్వం విమర్శలు చేసింది.

టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ పాలకమండలి సమావేశాలు నిర్వహించి టీటీడీలో ఎప్పుడు జరగని విధంగా కాంట్రాక్టు పనులకు ఆమోదం తెలపడంతో పాటు రివర్స్ టెండరింగ్ విధంగా ద్వారా ఈ సుమారు 1500 కోట్ల వర్కులకు ఆమోదం తెలపడంతో కూటమి వాటిపై ఆరోపణలు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు వచ్చి ప్రక్షాళన  ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని ప్రకటించడం ఆ మరుసటి రోజే టీటీడీ ఈవో నియామకం.. ఆ తర్వాత అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించి వెంకయ్య చౌదరికి బాధ్యతలను అప్పగించడం వెంట వెంట వెంటనే జరిగిపోయాయి.

ఇంజినీరింగ్ విభాగంపై ఫోకస్

టీటీడీ లో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించింది. ఈ విచారణ సంబంధించి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగిందని 55 మంది ఇంజనీరింగ్ ఉద్యోగులకు షోకాజ్ నోటులు సైతం జారీ చేసి వారి పనితీరు.. ఎవరు చేశారు.. ఎప్పుడు చేశారు.. ఎక్కడ చేశారనే అంశాలపై వివరాలు సైతం నమోదు చేశారు. షోకాస్ నోటీసులు రావడంతో టీటీడీ ఇంజనీరింగ్ ఉద్యోగులు తమకేం సంబంధం లేదు.. టిటిడి బోర్డు నిర్ణయం మేరకు  టిటిడి ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్ చెప్పడంతోనే తమ పనులు చేసామని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో ఆరు మందిని నాటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఛైర్మెన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సీఈ నాగేశ్వరరావు, ఎఫ్ అండ్ సీఈవో ఓ.బాలాజీ ను  ప్రధానంగా కేసులో ఉచ్చు బిగిస్తున్నారు.

శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు ఎలా ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. తిరుపతి లోని రెండు గోవింద రాజ స్వామి వారి సూత్రాలు కూల్చి అక్కడ 300 కోట్లతో అచ్చుతం, 300 కోట్లతో శ్రీపాదం కి నిధులు మంజూరు చేయడం ఇలా పలు అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర విజిలెన్స్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirumala Vasanthotsavam 2026: శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
ITR Forms:ఐటీఆర్‌ ఫైల్ చేసే వారికి బిగ్ అలర్ట్! రెండు ఇళ్లు ఉన్న వారికి గుడ్ న్యూస్!
ఐటీఆర్‌ ఫైల్ చేసే వారికి బిగ్ అలర్ట్! రెండు ఇళ్లు ఉన్న వారికి గుడ్ న్యూస్!
Donald Trump: దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
Arshdeep Singh News: అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
Embed widget