అన్వేషించండి

తిరుమలలో ఐదో చిరుతను బంధించిన అధికారులు- వచ్చి చూసిన టీటీడీ ఛైర్మన్‌ భూమన

తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఐదో చిరుతను ట్రాప్ చేసి అధికారులు బంధించారు. నరసింహస్వామి ఆలయం వద్ద బోనులో వన్యమృగాన్ని టీటీడీ ఛైర్మన్‌ భూమన వచ్చి పరిశీలించారు.

తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న టీటీడీ అటవీశాఖ అధికారులు ఇప్పుడు ఐదో చిరుతను బంధించారు. నరసింహస్వామి ఏడో మైలు రాయి వద్ద నాలుగు రోజుల క్రితం ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలను గుర్తించిన అధికారులు అక్కడ ఎరను పెట్టి బోనును ఏర్పాటు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అందులో చిరుత పడినట్లు గుర్తించారు. దీన్ని కూడా  మగ చిరుతగానే గుర్తించిన అధికారులు జూకు తరలించి శాంపుల్స్ తీసి తిరుపతి ఐసర్ కు పంపించనున్నారు.

చిరుతను బంధించిన విషయాన్ని తెలుసుకున్న టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి ఏడో మైలు రాయి వద్దకు చేరుకున్నారు. బోనులో బంధీగా పడి ఉన్న చిరుతను చూశారు. అక్కడే అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

గత మూడు నెలల నుంచి తిరుమల నడకమార్గంలో వన్యమృగాల సంచారం ఎక్కువైంది. చిరుతలు, ఎలుగుబంట్లు కాలిబాటలోకి రావడంతో భక్తుల్లో కూడా ఆందోళన పెరిగింది. దీనిపై టీటీడీ ఎన్ని విధాలుగా భక్తుల్లో ధైర్యం కల్పిస్తున్నా భయం ఎక్కడో చోట ఉండనే ఉంది. 
భయాన్ని రెట్టింపు చేస్తూ జులైలో ఓ బాలుడిని లాక్కెళ్లే ప్రయత్నం చేసింది చిరుత. ఆగస్టులో ఓ చిన్నారిని లాక్కెళ్లి ప్రాణాలు సైతం తీసేసింది. ఈ రెండు ఘటనలు టీటీడీ చరిత్రలో మాయనిమచ్చలా మిగిలిపోనున్నాయి. అందుకే ఆపరేషన్ చిరుతను చేపట్టారు. 

ఆపరేషన్ చిరుత చేపట్టిన తర్వాత ఒకట్రెండు చిరుతలు తిరుగుతున్నాయని వాటిని పట్టుకుంటే సమస్యకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావించారు. జూన్‌ 24 మొదటి చిరుతను పట్టుకున్నారు. ఇక అంతా ప్రశాంతమే అనుకున్నారు. ఆగష్టులో మరో చిరుత భక్తులకు కనిపించింది. దీంతో మరోసారి ట్రాప్ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేశారు. ఇంతలో చిన్నారిని ఈ వన్యప్రాణి బలితీసుకోవడంతో చర్యలు వేగవంతం చేశారు. 

చిన్నారి తినేసిన చిరుత వచ్చే మార్గాలను అన్వేషించారు అధికారులు. అది తిరిగే మార్గాల్లో ప్రత్యేక ట్రాప్‌లు ఏర్పాటు చేశారు కెమెరాలు ఫిట్ చేశారు. ఇలా అష్టదిగ్బంధం చేసిన తర్వాత మరో చిరుత బోనులో పడింది. ఆగష్టు 14 రెండో చిరుత అధికారుల ట్రాప్‌కు చిక్కింది. అక్కడకు మూడు రోజుల తర్వాత మూడో చిరుతను ఆగష్టు 17న పట్టుకున్నారు. 

ఇక చిరుతలు లేవేమో అనుకున్నారు కానీ భక్తుల్లో ఎక్కడో చోట భయం కలిగింది. కొందరు సీనియర్ అధికారులు మాత్రం ఇంకా చిరుతలు ఉండనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. వారి అనుమానమే నిజమైంది. మరోసారి చిరుత జాడను పసిగట్టారు అధికారులు. 

దీంతో మరోసారి ట్రాప్‌ ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే ఎర కోసం వచ్చిన చిరుత ఆగష్టు 28న బోనులో చిక్కింది. అంతా ఊపిరి పీల్చుకున్న టైంలో వారం రోజుల తర్వాత ఇవాళ సెప్టెంబర్‌ 6వ మరో చిరుత చిక్కింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Divvala Madhuri : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget