అన్వేషించండి

Chittor Flys Issue: ‘ఈగ’ సినిమా చూపిస్తున్న ఈగలు! పడుకోనివ్వవు తిననివ్వవు - ఆ ఊరే ఎందుకు టార్గెట్ అంటే?

Baireddipalle Mandal: ఈగల కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో గ్రామస్తులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు.

Chittor Flys Issue: రాజమౌళి సినిమాలో ఒక ఈగ విలన్ ను ముప్పు తిప్పలు పెట్టింది. ఈగ సినిమాలో రాజమౌళి ఈగ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. నిజ జీవితంలో ఇలాంటివి జరగవు కానీ, ఈగలు మనుషులకు ముప్పు తెచ్చే రోగాలను ప్రబలేలా మాత్రం చేయగలవు. కానీ, ఓ పల్లెపై దాడి చేస్తే కలిగే ప్రభావం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈగ పేరు వింటేనే బైరెడ్డిపల్లి మండలం, నగరే పల్లి గ్రామం ప్రజలు పరుగులు పెడుతున్నారు. లక్షల కొద్ది ఈగలు ఈ గ్రామాన్ని చుట్టు ముట్టి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈగల కారణంగా గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు విసుగు తెప్పించాయి.  

అంతే కాకుండా గ్రామస్తులను ఓ వేడుక చేసుకోకుండా, కనీసం పూర్తిగా తిండి తినకుండా చేస్తున్నాయి. తలుపులు వేసుకుని నిద్రించాలన్నా ఈగల బెడదతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొలం పనులకు వెళ్ళినా, గ్రామంలో బయట తిరగలేక, ఇంటిలో‌ తలుపులు వేసుకుని ఉండలేక ప్రజలు అవస్ధలు పడుతున్నారు. ఇక వండుకున్న ఆహారంలో సైతం ఈగలు ముసరడంతో కడుపారా తిండి‌ తినలేక పోతున్నారు. దీంతో గ్రామంలో నివాసం ఉంటున్న 150 రైతులు, కూలి కుటుంబాలు ఈగల బెడదను తట్డుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. రేయింబవళ్ళు తేడా లేకుండా ఈగలు మూకుమ్మడిగా గ్రామస్తులపైకి దండయాత్ర చేయడంతో దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు గ్రామస్తులు.

Also Read: Somu Veerraju: పోలవరం విషయంలో ఆ కుట్ర జరుగుతోంది? వాళ్లకి ఏం పని?: సోము వీర్రాజు - కేశినేనిపైనా కీలక వ్యాఖ్యలు

కోళ్లఫారాల వల్లే..
గ్రామంలో సంచరిస్తున్న ఈగల కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో గ్రామస్తులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామం సమీపంలోని కోళ్ల ఫారాలే ఈగలకు కారణంమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోళ్ళ ఫారాల నుండి వచ్చే వ్యర్ధాల కారణంగానే ఈగల వ్యాప్తి అధికం అయ్యాయని, కోళ్లఫారాల యజమానులకు అనేక మార్లు తమ అవస్ధలు చెప్పుకున్న పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా జిల్లా అధికారులు తమ పరిస్ధితులను అర్ధం చేసుకుని ఈగల బెడద నుండి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. ఈగల బెడద కారణంగా తమ గ్రామం ప్రజలు అనారోగ్యం బారిన పడి ప్రాణాల పైకి తెచ్చుకోవాల్సిన పరిస్ధితి నెలకొంటుందని, ఇప్పటికే కొందరూ గ్రామం వదిలి వెళ్ళి పోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.

Also Read: Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget