అన్వేషించండి

Somu Veerraju: పోలవరం విషయంలో ఆ కుట్ర జరుగుతోంది? వాళ్లకి ఏం పని?: సోము వీర్రాజు - కేశినేనిపైనా కీలక వ్యాఖ్యలు

విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు‌ గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, అసలు వాళ్లకి ప్రాజెక్టుతో ఏం పని అని ప్రశ్నించారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు‌ పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు‌ గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, అసలు వాళ్లకి ప్రాజెక్టుతో ఏం పని అని ప్రశ్నించారు. వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టును ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటు ను ప్రశ్నించినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంతో రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లేనని అభిప్రాయపడ్డారు. విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

‘‘రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలి. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారు. విభజన తరవాత భద్రాచలం టెంపుల్ ను‌, మరో రెండు మండలాలు‌ తెలంగాణ కు ఇచ్చారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు‌ నీరు ఇవ్వాలని‌ వైఎస్ పనులు చేపట్టారు. దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ.’’

పోలవరం వద్దని నాడు టీడీపీ వరంగల్ మహిళా నేత మాట్లాడారు. నేడు మా పార్టీ లో ఉన్న ఇద్దరు నాయకులు అప్పుడు టీడీపీలో ఉన్నారు. వారిద్దరూ నాడు ఆమె వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. ఆ తరువాత చంద్రబాబు ‘పోలవరం సోమవారం’ అని ఆర్భాటం చేశారు. పోలవరంను వ్యతిరేకిస్తే.. విభజన చట్టాన్ని ఒప్పుకోనట్లే. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట అనేది కరెక్ట్ కాదు. పోలవరం ముంపు ప్రాంతాలలలో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తాం అంటున్నారు. వారంతా భద్రాచలం మీద ఆధార పడటం‌ వల్ల అటు చూస్తున్నారు. విలీనం చేసిన మండలాల్లో‌ సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి? ఏం మాయ రోగం వచ్చింది.. టీఆర్ఎస్ తో లాలూచి పడి రోడ్డెక్కారా? వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా? 

పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బ తిన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ పర్యటన తరువాత 15 రోజులకొకసారి రివ్యూ చేస్తున్నారు. లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతుంది. చంద్రబాబు అనేక అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారు. మూడేళ్లలో వాటిని బయట పెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఏపీలో పరిణామాలను మా‌ జాతీయ నాయకత్వానికి వివరిస్తాం’’ అని సోము వీర్రాజు అన్నారు.

భవిష్యత్తులో జరగబోయే అంశాలను ఇప్పుడే చెప్పేస్తామా? అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై నిన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం రమేష్ మరో ఏక్ నాథ్ షిండే అని కేశినేని అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించాలని సోము వీర్రాజును విలేకరులు కోరారు. దీనిపై స్పందిస్తూ.. ‘‘ఎప్పుడో జరిగే అంశాలపై ఇప్పుడు మాట్లాడను. భవిష్యత్ లో జరిగే పరిణామాలను ఇప్పుడే ఎందుకు చెప్తాం.’’ అని అన్నారు.

పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా? - సోము వీర్రాజు
‘‘రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారు. పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదు. లక్షా నలభై వేల కార్డులు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారు. కేంద్రం గైడ్ లైన్స్ ను పరిగణలోకి తీసుకున్నారా? వీరిలో యాభై లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేదు. వీటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారు. కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సాగుతుంది. ఇతర దేశానికి ఇక్కడ నుంచే భారీగా వెళుతుందని చెప్పడం విశేషం. బియ్యం కుంభకోణంపై వాస్తవాలు ప్రజలకు‌ వివరిస్తాం. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా? వీటి వెనుక ఉన్న అందరి‌ బాగోతాలు బయట పెడతాం’’ అని సోము హెచ్చరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
PM Kisan: రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Peddi Pre Release Event: విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
Full Case Study: 22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
Tejaswini Nandamuri: బాలకృష్ణ కూతురు డ్యాన్స్ అదుర్స్... తేజస్విని స్టెప్స్, ఆ వీడియో చూశారా?
బాలకృష్ణ కూతురు డ్యాన్స్ అదుర్స్... తేజస్విని స్టెప్స్, ఆ వీడియో చూశారా?
Rishabh Pant Steps Down: LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
Upcoming Movies: జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'
జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'
Purnima 2026 May: మే నెలలో రెండు పౌర్ణమిలు , చివరి రోజున అరుదైన బ్లూ మూన్ చాలా ప్రత్యేకం దర్శనం!
మే నెలలో రెండు పౌర్ణమిలు , చివరి రోజున అరుదైన బ్లూ మూన్ చాలా ప్రత్యేకం దర్శనం!
Embed widget