అన్వేషించండి

Tirumala News: తిరుమల వెళ్లేవారూ ఇది తెలుసుకోండి, నేటి నుంచే ఇక్కడ కొత్త టెక్నాలజీ అమలు

తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ నేటి‌ నుండి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. నేటి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

కోట్లాది మంది ఆరాధ్య దైవం కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి భక్తుల కోసం నేటి నుంచి టీటీడీ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సామాన్య భక్తులకు సులభతరంగా సేవలందించడంతో పాటుగా దళారులను నిర్మూలనకు చెక్ పెట్టే విధంగా తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ నేటి‌ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నూతన విధానంను టీటీడీ విజిలెన్స్ విభాగానికి, పోలీసు విభాగానికి అనుసంధానం చేయడం ద్వారా దళారుల అక్రమాలను అత్యంత సులభంగా గుర్తించే వెసులుబాటు ఉంటుందని టీటీడీ భావించినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా శ్రీవారి భక్తులకు సులభతరంగా ఈ విధానంను పూర్తి స్ధాయిలో అందించేందుకు టీటీడీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తొంది.

ప్రస్తుతం స్వామి వారి దర్శన టిక్కెట్ లకు సంబందించి ఆన్లైన్ విధానంలో కేటాయిస్తుండగా, శ్రీవారి మహాప్రసాదంను తయారీ చేసేందుకు నూతన యంత్రాలను లడ్డూ పోటులో వినియోగించి తక్కువ సమయంలో అధిక లడ్డూలను తయారు చేసి భక్తులకు కావాల్సిన లడ్డూలను అందించేందుకు టీటీడీ సిద్ధం అవుతుంది. అంతే కాకుండా శ్రీనివాసుడిపై ఎంతో‌ భక్తిభావంతో భక్తులు సమర్పించే నాణేలను లెక్కించేందుకు అధునాతనమైన యంత్రాలతో సులభతరంగా ఇక స్వామి వారికి భక్తులు సమర్పించే లెక్కింపు జరిగేందుకు ప్రణాళికలు చేస్తుంది.

ఫేస్ రికగ్నిషన్ విధానం
భక్తులు శ్రీవారిని సమర్పించిన కానుకల లెక్కింపును శ్రీవారి ఆలయంను నుంచి బయటకు తీసుకువచ్చి భక్తులంతా కానుకల లెక్కింపు వీక్షించే విధంగా నూతన పరకామణిని నిర్మించి అధునాతనమైన సౌకర్యాలతో పరకామణి సిబ్బందికి అన్ని సౌఖర్యాలు ఉండే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఏడుకొండలపై భక్తులను నిలువు దోపిడి చేసే దళారులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. అయితే మార్చి 1వ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులకు, లడ్డు కౌంటర్లు, గదులు కేటాయింపు, రిఫండ్ కౌంటర్ల వద్ద ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది టీటీడీ. ఇప్పటి వరకు సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేసే సమయంలో వారి ఆధార్ కార్డు నెంబర్ ను అనుసంధానం చేసి భక్తుల ఫోటో తీసుకుని టోకెన్లలను భక్తులకు జారీ చేస్తూ వస్తున్నారు. 

ఫోటో రికగ్నిషన్ విధానంతో భక్తులకు టోకెన్లు జారీ చేసే సమయంలోనే ఫోటో తీసుకుంటారు. తిరిగి వారు దర్శనానికి వెళ్ళే సమయంలో ఫోటో రికగ్నిషన్ అయిన వెంటనే దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఒక్కరి టోకెన్ పై మరొకరు దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుదరదు. అలా అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని టీటీడీ భావిస్తొంది. ఇక లడ్డు టోకెన్లకు సంబందించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించే సమయంలో ఫోటో రికగ్నిషన్ విధానంలో టోకెన్లు జారీ చేస్తారు టీటీడీ సిబ్బంది. అదే పద్దతిలో దర్శనం అనంతరం లడ్డు కౌంటర్ వద్ద లడ్డూలను అందజేస్తారు. ఈ విధానం ద్వారా అక్రమ పద్ధతిలో లడ్డూలు పోందే దళారీలను పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చునని టీటీడీ భావిస్తుంది.  

గదుల కేటాయింపులో కూడా ఫేస్ రికగ్నిషన్
సామాన్య భక్తులకు గదులు కేటాయింపు సమయంలోను ఫేస్ రికగ్నిషన్ విధానాని అమలు చేయనుంది టీటీడీ. ఇదే విధానాన్ని గదులు ఖాళి చేసిన సమయంలో డిపాజిట్ల చెల్లింపునకు వినియోగించనున్నారు. దీంతో గదుల ఖాళీలు వేగవంతంగా జరుగుతాయని, గదులను దళారులు రోటేషన్ చేసే పద్దతికి అడ్డుకట్ట వేయవచ్చునని, మరోవైపు గదులు ఖాళీ చేసిన 48 గంటల సమయంలోనే భక్తుల డిపాజిట్లు వారి ఖాతాలో జమ అవుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా భక్తులకు సులుభతరంగా సేవలందించడంతో పాటు అక్రమాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చునని టీటీడీ‌ నమ్ముతుంది. ఫేస్ రికగ్నిషన్ విధానాని విజిలెన్స్ విభాగానికి, పోలీసు విభాగానికి అనుసంధానం చేయడం ద్వారా నేర చరిత్ర కలిగిన, దళారులుగా పలుమార్లు పోలీసులకు పట్టుబడిన వారిని సులభతరంగా గుర్తించవచ్చునని భావిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Movie Ticket Rates : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
IAF Wing Commander commits suicide: చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Embed widget