అన్వేషించండి

Vote From Home: ఇంటి నుంచి ఓటు ఎవరి కోసం? ఎలా ఉపయోగించుకోవచ్చంటే

AP Latest News: పోలింగ్ బూత్ కు రాలేని ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్దులకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చింది. నడవలేని స్థితిలో తీసుకెళ్లలేని వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించింది.

Vote from Home Guidelines Here: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కల్పించింది.

ఎవరు అర్హులు
ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కొందరికే అవకాశం కల్పించింది. పోలింగ్ బూత్ కు రాలేని ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్దులకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చింది. పోలింగ్ బూత్ కు వచ్చే వారికి ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశం లేదు. నడవలేని స్థితిలో తీసుకెళ్లలేని వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక ప్రతిభావంతులకు కావాల్సిన ర్యాంప్ లు, వీల్ చైర్స్ అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తు చేయాలి
ఇంటి నుంచి ఓటు వేసే వారిని ఇప్పటికే ఆయా ఆర్వోల పరిధిలో గుర్తించారు. సంబంధిత ఎన్నికల అధికారులు వారి ఇంటికి వెళ్లి ఫారం 12డి ని అందజేస్తారు. ఈ ఫారం నింపి తమ బీఎల్వో లకు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులైతే తప్పకుండా పోస్టల్ బ్యాలెట్ ను వారికి అందజేస్తారు.  దరఖాస్తు సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేస్తామని చెబితే అలాంటి వారికి ఫారం 12డి ఇవ్వరు.

ఓటింగ్ సరళి ఎలా 
ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం పొందిన అర్హులు నుంచి రహస్య పద్దతిలో ఓటింగ్ నిర్వహించేందుకు నోడల్ అధికారులను ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నియమించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం లో ఓటర్ నివాసానికి పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు. ఈ సిబ్బందిలో ఇద్దరు పోలింగ్ అధికారులు, ఒక పోలీస్ శాఖ సిబ్బంది, ఒక వీడియో గ్రాఫర్ ఉంటారు. ముద్రించిన పోస్టల్ బ్యాలెట్ ను వారికి అందించి రహస్యంగా ఓటు వేయిస్తారు. దానిని ఓటర్ బ్యాలెట్ బాక్స్ లో వేసేంత వరకు అంత రహస్యంగా ఉంటుంది. ఓటింగ్ ముందస్తుగా  జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం మీ పరిధిలోని బీఎల్వోను సంప్రదించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Tirumala Anjaneya Swamy Idol Stolen: తిరుమలలో కలకలం - మొదటి ఘాట్ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!
తిరుమలలో కలకలం - మొదటి ఘాట్ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget