అన్వేషించండి

Chittore: తాగుబోతు మొగుణ్ని భరించలేక పుట్టింటికెళ్లిన భార్య.. అత్తపై కేసు పెట్టాలని సెల్‌టవర్‌ ఎక్కిన భర్త

భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య. బతిమిలాడి భార్యను కాపురానికి తెచ్చుకోవడానికి అత్తారింటికి వెళ్లాడా భర్త. సీన్ కట్ చేస్తే భార్యభర్త ఇద్దరూ కలిసి అత్తపైనే కేసు పెట్టారు.

పెళ్లి అనేది చాలా మంది జీవితాలకు ఓ టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత మాత్రం ఫోకస్‌తో జీవించాల్సి ఉంటుంది. భార్యభర్త ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. అప్పటి వరకు ఎలాంటి సిత్రాలు చేసినా చూసీ చూడనట్టు వ్యవహరించే పెద్దలు... వివాహం తర్వాత మాత్రం ప్రతి కదలికను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. దారి తప్పుతున్నారంటే సరైన దారిలో పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి కట్టడితోనే ఓ భర్త చిక్కుల్లో పడ్డాడు. 

చిత్తూరు జిల్లా చెందిన ఓ వ్యక్తి తాగుడుకు బానిసై భార్యబిడ్డలను పట్టించుకోవడం లేదు. దీన్ని గమనించిన అత్తింటి వారు కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితి నచ్చని అతను అత్తపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించాడు. 

Also Read: Cheating Relationship : చాలా ఏళ్ల శారీరక సంబంధం తర్వాత పెళ్లికి నిరాకరించడం నేరం కాదు.. బాంబే హైకోర్టు తీర్పు !

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని రాజీవ్ నగర్‌లో కాంత్రి, ప్రమీలకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. ఓ కుమార్తె కూడా ఉంది. పెయింటర్‌గా పని చేస్తున్న క్రాంతి మద్యానికి బానిసయ్యాడు. వచ్చిన సంపాదనంతా తాగుడికే ఖర్చు పెట్టేసేవాడు.  రోజూ ఇంటికి వచ్చి భార్యను కొట్టే వాడు. వివిధ రకాలుగా వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేని ప్రమీల... జరిగిన సంగతి తల్లికి చెప్పింది. ప్లేస్‌ మారితే క్రాంతి ప్రవర్తనలో మార్పు వస్తుందని భావించిన ఆ అత్త... ఇద్దర్నీ తన ఇంటికి రమ్మని చెప్పింది. 

అత్తారింటికి వచ్చిన క్రాంతి... తన తాగుడు మాత్రం మానలేదు. అతనితో మద్యం మాన్పించేందుకు భార్య, అత్త, బావమర్దులు ఎంతగానే ప్రయత్నించారు. చివరకు అందరి నుంచి ఒత్తిడి పెరిగే సరికి వెనక్కి తగ్గిన క్రాంతి... తాగుడు మానేస్తున్నట్టు చెప్పాడు. కొన్ని రోజులు మద్యానికి దూరంగా కూడా ఉన్నాడు. పరిస్థితి చక్కబడిందని భావించిన అత్తంటి వారు క్రాంతిని, ప్రమిలను వాళ్ల ఇంటికి పంపించేశారు.  

కొన్ని రోజులు మద్యానికి దూరంగా ఉంటూ భార్య బిడ్డను ప్రేమగా చూసుకున్నాడు. ఉన్నట్టుండి మళ్లీ క్రాంతిలో మార్పు వచ్చింది. రోజూ మళ్లీ తాగి వచ్చి భార్యను కొట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో ప్రమీల అతన్ని నిలదీసింది. మళ్లీ ఎందుకు తాగుతున్నావని మండిపడింది. తననే ప్రశ్నిస్తావా అంటూ దాడి చేశాడు క్రాంతి. రోజూ ఈ వేధింపుతు తాను భరించలేనంటూ కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది భార్య ప్రమీల. 

పుట్టింటికి వెళ్లిపోయిన ప్రమీల కోపం తగ్గిన తర్వాత తిరిగి వస్తుందని ఎదురు చూశాడు క్రాంతి. ఎన్ని రోజులైనా తిరిగి రాకపోయేసరికి అతనే తన అత్తారింటికి వెళ్లి ప్రమీలను పంపించాలని వేడుకున్నాడు. తాగుడు మానేంతవరకు ప్రమీలను పంపించేది లేదని అత్త తేల్చి చెప్పేసింది. అక్కడే కోపంతో ఊగిపోయిన క్రాంతి అత్త, బావమర్దితో గొడవ పడ్డాడు. అక్కడి నుంచి తన ఇంటికి తిరికి వచ్చేశాడు. ఇరుగు పొరుగు వారితో  ఫోన్‌లు చేయించాడు. ప్రమీల వచ్చేలా చూడాలని వేడుకున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఆమె పంపించేది లేదన్నారు అత్త. 

వేడుకుంటే పని కాదని గ్రహించిన క్రాంతి... బెదిరింపులకు తెగబడ్డాడు. మదనపల్లె- పుంగనూరు రోడ్డులోని డీఎస్పీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు క్రాంతిని సెల్ టవర్ పై నుంచి దించే ప్రయత్నం చేశారు. తమ కష్టం సబ్ కలెక్టర్‌కే చెప్పుకుంటానంటూ టవర్ దిగేది లేదని చెప్పేశాడు. భార్య ప్రమీలను కూడా తీసుకొచ్చి ఫోన్‌లో మాట్లాడించారు. అయినా క్రాంతి కిందికి దిగిరాలేదు. మరో డిమాండ్‌ తెరపైకి తీసుకొచ్చాడు. అత్తను అరెస్టు చేస్తే కానీ తాను కిందికి దిగి రానని భీష్మించి కూర్చున్నాడు. అత్త, బామర్ధి కారణంగానే భార్య కాపురానికి రాలేదని, వారిపై కేసు నమోదు చేస్తేనే సెల్ టవర్ దిగ్గుతానని బెదించాడు.

ఘటన స్ధలానికి అత్తారింటి వాళ్లను రప్పించిన పోలీసులు అత్తపై కేసు నమోదు చేసి భార్యను కాపురానికి పంపిస్తామని హమీ ఇవ్వడంతో శాంతించాడు క్రాంతి. సెల్ టవర్ దిగ్గి క్రిందకు వచ్చాడు.

Also Read:  పెద్దల్ని ఎదిరించిన పెళ్లి చేసుకున్న లవర్స్.. ఉప్పెన సినిమా చూపించిన పేరెంట్స్‌..

Also Read: Prakasam: భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం

Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Embed widget