అన్వేషించండి

TTD Adulterated Ghee Issue: కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలకు సిద్ధం - త్రిసభ్య కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం

TTD Adulterated Ghee Issue: టీటీడీ కల్తీ నెయ్యి ఘటనలో ఏకసభ్య కమిటీ నివేదికపై చర్యలు తీసుకునేందుకు మరో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. వారంలో కమిటీ నివేదిక ఇవ్వనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీటీడీ లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు.
  • ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.
  • లడ్డూ నెయ్యి నాణ్యత, టెండర్ల ప్రక్రియపై నివేదిక పరిశీలన.
  • దోషులపై కఠిన చర్యలు, వ్యవస్థలో ప్రక్షాళన లక్ష్యం.

Three Member Committee on TTD Adulterated Ghee Case:  శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఈ వివాదంపై ఇప్పటికే విచారణ జరిపిన వన్ మెన్ కమిటీ సమర్పించిన నివేదికను లోతుగా విశ్లేషించేందుకు, తదుపరి చర్యల కోసం ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన హై లెవెల్ కమిటీ ని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసి, దోషులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

 ముగ్గురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ 

ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన ఈ హై లెవెల్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి  ఉంటారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యత, టెండర్ల ప్రక్రియలో జరిగిన ఉల్లంఘనలపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్  ఇచ్చిన నివేదికలోని ముఖ్యాంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.

 వారంలోగా తుది నివేదికకు ఆదేశం 

ఈ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, విచారణను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం  వారంలోకా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది. వన్ మెన్ కమిటీ నివేదిక ఆధారంగా ఎవరెవరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి? ఏయే విభాగాల్లో లోపాలు జరిగాయి? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి నిబంధనలు తీసుకురావాలి? అనే అంశాలపై ఈ ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులు చేయనుంది.

 దోషులపై ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం 

లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. లడ్డూ తయారీకి వాడే నెయ్యి సరఫరాలో రాజకీయ జోక్యం, అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి అంశాలపై ఈ కమిటీ ఇచ్చే నివేదిక అత్యంత కీలకం కానుంది. నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం బాధ్యులైన అధికారులపై, గత పాలకమండలి సభ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 విశ్వాసాన్ని పునరుద్ధరించే ప్రయత్నం 

కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని అత్యంత సున్నితంగా , పారదర్శకంగా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. హై లెవెల్ కమిటీ ఇచ్చే నివేదిక ద్వారా శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి గల కారణాలను బహిర్గతం చేసి, టీటీడీ వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో నివేదిక రానుండటంతో, తదుపరి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.                                                              

 

Frequently Asked Questions

టీటీడీ అక్రమ నెయ్యి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వన్ మెన్ కమిటీ నివేదికను విశ్లేషించి, తదుపరి చర్యలపై సిఫార్సులు చేస్తుంది.

హై లెవెల్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు?

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

హై లెవెల్ కమిటీ నివేదికను ఎప్పటిలోగా సమర్పించాలి?

ఈ కమిటీ వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది.

ఈ హై లెవెల్ కమిటీ విచారణలో ఏ అంశాలపై దృష్టి సారిస్తుంది?

లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యత, టెండర్ల ప్రక్రియలో జరిగిన ఉల్లంఘనలు, మరియు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన నిబంధనలపై కమిటీ దృష్టి సారిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget