అన్వేషించండి

TTD Adulterated Ghee Case: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?

TTD Adulterated Ghee Case: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం తిరుగుతోంది. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏను అదుపులోకి తీసుకోవడంతో నెక్ట్స్ స్టెప్ ఏమై ఉంటుందనే చర్చ నడుస్తోంది.

TTD Adulterated Ghee Case: తిరుమల శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదంలో వాడేందుకు కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందనే కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం జరిగిన అరెస్టుతో ఇందులో కీలక వ్యక్తులను కూడా విచారిస్తారనే ప్రచారం జోరందుకుంది. అరెస్టు అయిన వ్యక్తి టీటీడీ మాజీ ఛైర్మన్‌కు మాజీ పీఏ అరెస్టు కావడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.  

తొలిసారి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి అరెస్టు

వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కంపెనీలకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించింది. ఇన్ని రోజులు సైలెంట్‌గా విచారణ సాగుతున్న కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు రాజకీయాలకు నేరుగా సంబంధం లేని వ్యక్తులను మాత్రమే అరెస్టు చేసి విచారించారు. ఇప్పుడు తొలిసారిగా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

ఇది అపన్న నేపథ్యం

టీటీడీ మాజీ ఛైర్మన్‌, రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా పని చేసిన అప్పన్ననను సిటి బృందం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. విజయనగరానికి చెందిన అప్పన్న వైవీ సుబ్బారెడ్డి వద్ద 2014 నుంచి 2024 వరకు పీఏగా పని చేశారు. ఆయనే ఢిల్లీలో ఏపీ భవన్‌లో ప్రోటోకాల్ ఓఎస్డీగా కూడా విధులు నిర్వర్తించారు. వైసీపీ వ్యవహారాలు చక్కబెట్టిన వ్యక్తిని ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అప్పన్నను ఇప్పటికే సిట్ అధికారులు రెండుసార్లు విచారించారు. ఆ విచారణలో ఆయన సమాధానాలు సరిగా చెప్పలేదని అధికారులు చెబుతున్నారు. మరోసారి విచారణకు పిలుస్తారనే క్రమంలో అప్పన్న హైకోర్టును ఆశ్రయించి సిట్ విచారణపై స్టే తెచ్చుకున్నారు. అయితే దీనిపై సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ సాగేలా వాదనలు వినిపించారు. కోర్టు సిట్‌కు అనుకూలంగా నిర్ణయం వెల్లడించింది. దీంతో విచారణ తిరిగి ప్రారంభించిన అధికారులు రెండు రోజుల నుంచి అప్పన్నను తిరుపతిలో ప్రశ్నిస్తున్నారు. ఆయన సరిగా సమాధానం చెప్పడం లేదని రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 

నెక్ట్స్‌ టార్గెట్ సుబ్బారెడ్డియేనా?

సుబ్బారెడ్డితో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో తర్వాత ఏం జరగబోతోందనే ఆసక్తి నెలకొంది. సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే తిరుమలకు మూడు కంపెనీల నుంచి కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని సిట్ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయా కంపెనీల ప్రతినిధులను విచారించారు. ఇప్పుడు అప్పన్నను కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తారు. దీంతో ఆయన చెప్పే విషయాలు ఆధారంగా సుబ్బారెడ్డిని కూడా విచారిస్తారా అనే అనుమానం అందరిలో ఉంది. ముందు అప్పన్నను కస్టడీలోకి తీసుకున్న తర్వాత కీలక పరిణాలు జరుగుతాయని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
India vs New Zealand ODI : ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
Embed widget