అన్వేషించండి

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : వరుస సెలవులు, పెళ్లి ముహూర్తాలు కారణంగా తిరుమలలో భక్తులు రద్దీ అన్యూహంగా పెరిగింది. దీంతో ఆగస్టు 21 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

Tirumala Heavy Rush : తిరుమలలో అన్యూహంగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు అన్ని‌ భక్తులతో‌ నిండి పోయి, గోగర్భం డ్యాం వరకు భక్తులు క్యూ లైనులో వేచి ఉన్నారు. ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. వారాంతంలో వరుస సెలవుల రావడంతో తిరుమలలో అనూహ్యమైన రద్దీ నెలకొందన్నారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 21వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు.       శనివారం ఆక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు భక్తుల క్యూలైన్ చేరుకుంది. శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. రాత్రి 8 గంటల వరకు 56,546 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు. వరుస సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగిన కారణంగా తమ యాత్రను వాయిదా వేయాలని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది.

భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్ లు 

ఆపద మొక్కులవాడు కొలువైయున్న దివ్య ధామం తిరుమల పుణ్యక్షేత్రం. ఏడుకొండల్లో‌ నెలవైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించనిదే తిరిగి వెళ్ళరు. స్వామి వారిపై భక్తితో తలనీలాలు సమర్పించి స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే కోవిడ్ తరువాత గత కొంత కాలంగా తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల కళకళ‌లాడుతుంది. ఎటు చూసిన భక్తుల గోవింద నామ స్మరణలతో ఏడు కొండలు మారుమోగుతున్నాయి. వరుస సెలవులు, వారంతరం కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల‌ నుండి విచ్చేసిన భక్తులతో వైకుంఠం‌ క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని కంపార్ట్మెంట్లు అన్ని భక్తులతో నిండి‌ నారాయణగిరి‌ ఉద్యానవనంలోని షెడ్లు భక్తుల‌ నిండి‌ పోవడంతో ఆళ్వార్ ట్యాంక్ మీదుగా లేపాక్షి సర్కిల్ నుంచి నందకం అతిధి గృహం వరకూ భక్తులు క్యూలైన్స్ లో వేచిఉన్నారు.  

సిఫార్సు లేఖలు రద్దు 

తిరుమల కొండ భక్తజనంతో నిండి పోయింది. దీంతో టీటీడీ యాత్ర సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, ఇతర యాత్రా ప్రదేశాలు వంటి ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాది సంఖ్యలో‌ భక్తులు వివిధ మార్గాల ద్వారా ఒక్కసారిగా కొండకు చేరుకోవడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలను టీటీటీ మరమ్మతులు చర్యలు చేపట్టడంతో ఉన్న గదులనే భక్తులకు కేటాయిస్తున్నారు అధికారులు. దీంతో రూములు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు బయటనే నిద్రిస్తున్నారు.  భక్తుల ఇబ్బందులను టీటీడీ దృష్టిలో ఉంచుకొని భక్తులు అధికంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి అల్పాహారంతో పాటు పాలు, మజ్జిగ అందిస్తుంది‌. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో‌ సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ నిర్ణయం‌ తీసుకుంది. కేవలం ప్రోటోకాల్ భక్తులకే పరిమితం చేసింది. ఇక ఆన్లైన్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు మూడు గంటల సమయంలోనే స్వామి వారి దర్శనం లభించగా, సామాన్య భక్తులకు "26 గంటల సమయం" పడుతుంది. స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు‌ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో పాలు, అల్పాహారం వితరణ కార్యక్రమాన్ని టీటీడీ చేపడుతుంది. శని, ఆదివారాలు కావడంతో‌ స్వామి వారి దర్శనం అధికంగా చేరుకునే అవకాశం ఉంది. సప్తగిరులు భక్తులతో కిటకిట‌ లాడడంతో పాటుగా భక్తుల షాపింగ్ లతో దుకాణాలు కూడా రద్దీగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
LPG Cylinder Booking Rules: మళ్లీ మారిన సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్.. ఎవరు ఎప్పుడు బుక్ చేయాలో తెలుసా
LPG సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్ మారాయా.. ఎవరు ఎప్పుడు బుక్ చేయాలో పూర్తి వివరాలివే
PM Modi Posts Vijayawada Singer Song: ప్రధాని మోదీ మెచ్చిన విజయవాడ సింగర్ గురించి ఈ విషయాలు తెలుసా!
ప్రధాని మోదీ మెచ్చిన విజయవాడ సింగర్ గురించి ఈ విషయాలు తెలుసా!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Kichcha Sudeep : కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
Shane Warne: షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Harish Rana Biopic: హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
ధురంధర్ 2 మూవీ కార్ల మేళా – యాక్షన్ సీన్లలో అదరగొట్టిన వాహనాలు ఇవే!
ధురంధర్ 2 మూవీ కార్ల మేళా – యాక్షన్ సీన్లలో అదరగొట్టిన వాహనాలు ఇవే!
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Embed widget