అన్వేషించండి

YSRCP : జగన్ ప్రభుత్వంపై డీఎల్ విమర్శలు ! గుర్తించలేదనే అసంతృప్తే కారణమా ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేతల అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మైదుకూరు నేత డీఎల్ రవీంద్రారెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల అసంతృప్తి గళాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎంపీ  రఘురామకృష్ణరాజు వంటి వారు రెబల్‌గా మారగా మరికొంత మంది నేరుగా మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందన్నారు. అన్ని శాఖల్లో వేలు పెడుతున్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపైనా మండిపడ్డారు. 

Also Read : ఏపీలో బొగ్గు కొరతపై జగన్ రివ్యూ.. కరెంటు కోతలు ఉండొద్దని ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని... రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడని డీఎల్ మైదుకూరులోప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డికి వ్యవసాయ శాఖలో సలహాదారుడి పదవి ఇచ్చారని మండిపడ్డారు. తప్పు చేసిన వాడు తప్పకుండా జైలుకు పోతాడు. ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతక వద్దు. సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చారు. 

Also Read : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలాఖరుకు పీఆర్సీ !

రాష్ట్రంలో జరుగతున‌న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలని.. ప్రశ్నించుకుంటే అధోగతి పాలవుతుందని హెచ్చరించారు.   భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకుల పనిగా మారిందన్నారు. రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదున్నారు.  రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని, దారినపోయే వారంతా మీడియా సమావేశాలు పెడుతున్నారంటూ పరోక్షంగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు గుప్పించారు. 

Also Read : రాజకీయ విమర్శలపై ప్రతిపక్షాలు, మీడియాకు ఏపీ డీజీపీ పరువు నష్టం నోటీసులు ! దేశంలోనే మొదటి సారి !

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన డీఎల్ రవీంద్రారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరేందుకు  సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాశ్ రెడ్డి పలు హామీలు ఇచ్చారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో మైదుకూరు వైసీపీ అభ్యర్థి రాఘురామిరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గెలుపులో కీలకంగా మారారు. ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు.  అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. మైదుకూరు రాజకీయాల్లో కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో డీఎల్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని.. ప్రకటించారు.  

 

Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget