అన్వేషించండి

TDP News: మరో 3 నెలల్లో అధికారంలోకి టీడీపీ, ప్రజా రాజధాని నిర్మిస్తాం: పరిటాల సునీత

AP Capital Amaravati: రాజధాని ఏది అంటే రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొరని, మరో 3 నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చి, ప్రజా రాజధానిని నిర్మించి తీరుతుందని పరిటాల సునీత స్పష్టం చేశారు. 

TDP leader Paritala Sunitha: అనంతపురం: ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) పాలనలో అన్ని వర్గాలవారు ఇబ్బంది పడినప్పటికీ ఎక్కువగా నష్టపోయింది రైతులేనని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈ నాలుగేళ్ల 9 నెలల పాటు వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కనీసం ఏ ప్రాంతంలో కూడా మంచి పంటలు తీసుకున్న పరిస్థితి కనిపించలేదన్నారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ఏది అంటే రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొరని, రాజధాని అమరావతి (AP Capital Amaravati)ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చి, ప్రజా రాజధానిని నిర్మించి తీరుతుందని ఆమె స్పష్టం చేశారు. 

వైసీపీ నిర్వహిస్తున్న సర్వేల్లో కూడా వారికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని ఇప్పటికే ఎమ్మెల్యేలంతా పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని 2024లో వైసీపీ కనుమరుగు అవడం ఖాయమన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇచ్చే 15వేల రూపాయలతోనే మొత్తం అంతా ఏదో ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
వర్షాలు కురిసినా సాగుకు నీళ్లందించలేదు..
అతివృష్టి, అనావృష్టితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ రైతులు పంటలు నష్టపోయారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో పాటు వ్యవసాయానికి, సాగుకు సంబంధించి సరైన నిధులు కేటాయించకుండా ద్రోహం చేశారన్నారు. ఫలితంగా నాలుగేళ్ల పాటు వర్షాలు కురిసినా.. నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా చెల్లించలేదని సీఎం జగన్ పై పరిటాల సునీత విమర్శలు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు ప్రాజెక్టుకు వర్షాల వల్ల నీళ్లు వస్తే దానిని పంటలకు ఇవ్వలేకపోయిన చేతగాని సర్కార్ వైసీపీ ప్రభుత్వం అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అనంతపురం జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు
కనీసం చెప్పుకోదగ్గ విధంగా అనంతపురం జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. మరోవైపు నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాప్తాడు విషయానికొస్తే వచ్చిన జాకీ పరిశ్రమను కూడా వెళ్లగొట్టారని పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు కారణంగా కియా పరిశ్రమ కూడా ఒకానొక దశలో వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్ని, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు ఇలా అన్ని వర్గాల వారిని రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. 
నవరత్నాల సాకుతో అన్ని రకాలుగా దోపిడీ
విద్యుత్ ఛార్జీలు, పన్నులు పేరుతో ప్రజల రక్తాన్ని జగన్ పీల్చివేశారంటూ మండిపడ్డారు. కేవలం నవరత్నాలు అన్న సాకు చూపి ప్రజలను ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో చేసింది ఏమీ లేకపోయినా ప్రజల భూముల్లో జగన్ బొమ్మలు వేయడం.. టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడం మాత్రమే చేశారని ప్రజలు గుర్తించినట్లు చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget