అన్వేషించండి

TDP News: మరో 3 నెలల్లో అధికారంలోకి టీడీపీ, ప్రజా రాజధాని నిర్మిస్తాం: పరిటాల సునీత

AP Capital Amaravati: రాజధాని ఏది అంటే రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొరని, మరో 3 నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చి, ప్రజా రాజధానిని నిర్మించి తీరుతుందని పరిటాల సునీత స్పష్టం చేశారు. 

TDP leader Paritala Sunitha: అనంతపురం: ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) పాలనలో అన్ని వర్గాలవారు ఇబ్బంది పడినప్పటికీ ఎక్కువగా నష్టపోయింది రైతులేనని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈ నాలుగేళ్ల 9 నెలల పాటు వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కనీసం ఏ ప్రాంతంలో కూడా మంచి పంటలు తీసుకున్న పరిస్థితి కనిపించలేదన్నారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ఏది అంటే రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొరని, రాజధాని అమరావతి (AP Capital Amaravati)ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చి, ప్రజా రాజధానిని నిర్మించి తీరుతుందని ఆమె స్పష్టం చేశారు. 

వైసీపీ నిర్వహిస్తున్న సర్వేల్లో కూడా వారికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని ఇప్పటికే ఎమ్మెల్యేలంతా పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని 2024లో వైసీపీ కనుమరుగు అవడం ఖాయమన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇచ్చే 15వేల రూపాయలతోనే మొత్తం అంతా ఏదో ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
వర్షాలు కురిసినా సాగుకు నీళ్లందించలేదు..
అతివృష్టి, అనావృష్టితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ రైతులు పంటలు నష్టపోయారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో పాటు వ్యవసాయానికి, సాగుకు సంబంధించి సరైన నిధులు కేటాయించకుండా ద్రోహం చేశారన్నారు. ఫలితంగా నాలుగేళ్ల పాటు వర్షాలు కురిసినా.. నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా చెల్లించలేదని సీఎం జగన్ పై పరిటాల సునీత విమర్శలు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు ప్రాజెక్టుకు వర్షాల వల్ల నీళ్లు వస్తే దానిని పంటలకు ఇవ్వలేకపోయిన చేతగాని సర్కార్ వైసీపీ ప్రభుత్వం అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అనంతపురం జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు
కనీసం చెప్పుకోదగ్గ విధంగా అనంతపురం జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. మరోవైపు నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాప్తాడు విషయానికొస్తే వచ్చిన జాకీ పరిశ్రమను కూడా వెళ్లగొట్టారని పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు కారణంగా కియా పరిశ్రమ కూడా ఒకానొక దశలో వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్ని, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు ఇలా అన్ని వర్గాల వారిని రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. 
నవరత్నాల సాకుతో అన్ని రకాలుగా దోపిడీ
విద్యుత్ ఛార్జీలు, పన్నులు పేరుతో ప్రజల రక్తాన్ని జగన్ పీల్చివేశారంటూ మండిపడ్డారు. కేవలం నవరత్నాలు అన్న సాకు చూపి ప్రజలను ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో చేసింది ఏమీ లేకపోయినా ప్రజల భూముల్లో జగన్ బొమ్మలు వేయడం.. టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడం మాత్రమే చేశారని ప్రజలు గుర్తించినట్లు చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget