అన్వేషించండి

TDP News: మరో 3 నెలల్లో అధికారంలోకి టీడీపీ, ప్రజా రాజధాని నిర్మిస్తాం: పరిటాల సునీత

AP Capital Amaravati: రాజధాని ఏది అంటే రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొరని, మరో 3 నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చి, ప్రజా రాజధానిని నిర్మించి తీరుతుందని పరిటాల సునీత స్పష్టం చేశారు. 

TDP leader Paritala Sunitha: అనంతపురం: ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) పాలనలో అన్ని వర్గాలవారు ఇబ్బంది పడినప్పటికీ ఎక్కువగా నష్టపోయింది రైతులేనని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈ నాలుగేళ్ల 9 నెలల పాటు వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కనీసం ఏ ప్రాంతంలో కూడా మంచి పంటలు తీసుకున్న పరిస్థితి కనిపించలేదన్నారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ఏది అంటే రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొరని, రాజధాని అమరావతి (AP Capital Amaravati)ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చి, ప్రజా రాజధానిని నిర్మించి తీరుతుందని ఆమె స్పష్టం చేశారు. 

వైసీపీ నిర్వహిస్తున్న సర్వేల్లో కూడా వారికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని ఇప్పటికే ఎమ్మెల్యేలంతా పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని 2024లో వైసీపీ కనుమరుగు అవడం ఖాయమన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇచ్చే 15వేల రూపాయలతోనే మొత్తం అంతా ఏదో ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
వర్షాలు కురిసినా సాగుకు నీళ్లందించలేదు..
అతివృష్టి, అనావృష్టితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ రైతులు పంటలు నష్టపోయారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో పాటు వ్యవసాయానికి, సాగుకు సంబంధించి సరైన నిధులు కేటాయించకుండా ద్రోహం చేశారన్నారు. ఫలితంగా నాలుగేళ్ల పాటు వర్షాలు కురిసినా.. నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా చెల్లించలేదని సీఎం జగన్ పై పరిటాల సునీత విమర్శలు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు ప్రాజెక్టుకు వర్షాల వల్ల నీళ్లు వస్తే దానిని పంటలకు ఇవ్వలేకపోయిన చేతగాని సర్కార్ వైసీపీ ప్రభుత్వం అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అనంతపురం జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు
కనీసం చెప్పుకోదగ్గ విధంగా అనంతపురం జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. మరోవైపు నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాప్తాడు విషయానికొస్తే వచ్చిన జాకీ పరిశ్రమను కూడా వెళ్లగొట్టారని పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు కారణంగా కియా పరిశ్రమ కూడా ఒకానొక దశలో వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్ని, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు ఇలా అన్ని వర్గాల వారిని రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. 
నవరత్నాల సాకుతో అన్ని రకాలుగా దోపిడీ
విద్యుత్ ఛార్జీలు, పన్నులు పేరుతో ప్రజల రక్తాన్ని జగన్ పీల్చివేశారంటూ మండిపడ్డారు. కేవలం నవరత్నాలు అన్న సాకు చూపి ప్రజలను ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో చేసింది ఏమీ లేకపోయినా ప్రజల భూముల్లో జగన్ బొమ్మలు వేయడం.. టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడం మాత్రమే చేశారని ప్రజలు గుర్తించినట్లు చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Kadiri BJP RDO Office Protest: కదిరిలో గర్జించిన కమలదళం - భవన నిర్మాణ కార్మికుల స్థలాల కబ్జాపై బీజేపీ భారీ నిరసన.. ఆర్డీవో కార్యాలయం ముట్టడి!
కదిరిలో గర్జించిన కమలదళం - భవన నిర్మాణ కార్మికుల స్థలాల కబ్జాపై బీజేపీ భారీ నిరసన.. ఆర్డీవో కార్యాలయం ముట్టడి!
DK Shivakumar: కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget