అన్వేషించండి

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

ఆధిపత్యం కోసం గ్రామాలలో హత్యలు చేయించిన ఘనత జేసీ సోదరులదేనని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

తాడిపత్రి నియోజకవర్గంలో తమ ఆధిపత్యం కోసం గ్రామాలలో హత్యలు చేయించిన ఘనత జేసీ సోదరులదేనని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గం లో 4వ రోజు ప్రజా సంక్షేమ పాదయాత్ర పెద్దవడుగూరు మండలం బందార్లపల్లి, అప్పేచెర్ల, కదరగుట్టపల్లె, కిష్టిపాడు గ్రామాలలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పాదయాత్ర చేశారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపి హిందూపురానికిచెందిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. 

అప్పేచెర్ల గ్రామంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద వడుగురు మండలం క్రిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు అప్పేచెర్ల విజయ భాస్కర్ రెడ్డిని హత్య చేయించింది జేసీ సోదరులే అని ఆరోపించారు. గ్రామాలలో జెసి సోదరులు తమ ఆధిపత్యం కోసం హత్యలు చేయించింది వాస్తవం కాదా ప్రశ్నించారు. తాడిపత్రి పోలీసులను జెసి ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తుందని, పోలీసు అధికారుల సంఘం జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 

తాడిపత్రిలో పోలీసులు చక్కగా విధులు నిర్వహిస్తూ ఉంటే ఉన్నతాధికారులు ప్రతిరోజు ఎందుకు వేధిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి పతనం జెసి సొంత మండలం పెద్దపప్పూరు మండలం నుంచి మొదలైందన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. తాడిపత్రి నియోజకవర్గంలోని ఏ మండలంలోనైనా జెసి ప్రభాకర్ రెడ్డికి మెజార్టీ వస్తే ఆయనకు జీవితాంతం దాసోహం చేస్తానని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తాడిపత్రి లో దాడికి గురైన ఐ టీడీపీ గండికోట కార్తీక్ ఎవరో కూడా తనకు తెలియదని, అతనిపై దాడి చేయాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పైన గెలిస్తేనే నేను గెలిచినట్లు అని ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తేనే మజా ఉంటుందని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు.

జేసీ అనుచరుడిపై దాడి 
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గండికోట కార్తీక్‌పై హత్యాయత్నం చేశారు కొందరు దుండగులు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొంతమంది యువకులు ఆయనపై దాడి చేశారు.  దీంతో కార్తీక్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. తాను వెళ్తున్న మార్గంలో కాపు కాసి కత్తులు, కర్రలతో దాడి చేశారని బాధితుడు కార్తీక్ తెలిపారు. తాడిపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే నెపంతో వైసీపీకి చెందిన వాల్లే ఈ దాడికి పాల్పడ్డారని కార్తీక్ ఆరోపించారు. 

"మేము పోలీసులకు ఫిర్యాదు చెయ్యం, ఈ దాడిపై సుమోటో కేసుగా కట్టుకొని విచారణ చేయాలి. పోలీసులతో న్యాయం జరగదు. కంప్లైంట్ ఇవ్వడానికి పేపరు పెన్ను వేస్ట్. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పంచి ఇప్పించి కొడతాం. పోలీసులు ఉన్నారని ఉరుకున్నాం. మేము కేసులు పెడితే మడిచి వెనుక పెట్టుకుంటున్నారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయింది. లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసులు టీడీపీ వాళ్లపై పెట్టిన కేసులు మడిచి జేబులో పెట్టుకుంటాం. మేం ఎవరికీ తలవంచం. వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెట్టరు. టీడీపీ వాళ్లు ఏమైనా మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు. ప్రజలు మాతోనే ఉన్నారు. డీఎస్పీ చైతన్య తీరు అభ్యంతకరం."- జేసీ ప్రభాకర్ రెడ్డి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi : డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
Montha Cyclone Damage: తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుత అవకాశం- ఈ పని చేస్తే పారిశ్రామికవేత్తలుగా మారొచ్చు!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుత అవకాశం- ఈ పని చేస్తే పారిశ్రామికవేత్తలుగా మారొచ్చు!
Bihar Assembly Election 2025 : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల! లఖపతి నుంచి 4 నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వరకు కీలకాంశాలు ఇవే!
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల! లఖపతి నుంచి 4 నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వరకు కీలకాంశాలు ఇవే!
Advertisement

వీడియోలు

Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chiranjeevi : డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
Montha Cyclone Damage: తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుత అవకాశం- ఈ పని చేస్తే పారిశ్రామికవేత్తలుగా మారొచ్చు!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుత అవకాశం- ఈ పని చేస్తే పారిశ్రామికవేత్తలుగా మారొచ్చు!
Bihar Assembly Election 2025 : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల! లఖపతి నుంచి 4 నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వరకు కీలకాంశాలు ఇవే!
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల! లఖపతి నుంచి 4 నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వరకు కీలకాంశాలు ఇవే!
Khammam Crime News: ఖమ్మంలో దారుణం - సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు  
ఖమ్మంలో దారుణం - సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు  
Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
Mohammad Azharuddin: మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
Sai Durgha Tej : ఫోకస్ ఓన్లీ ఆన్ 'సంబరాల ఏటిగట్టు' - ఆ రూమర్స్‌కు చెక్ పెట్టేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్
ఫోకస్ ఓన్లీ ఆన్ 'సంబరాల ఏటిగట్టు' - ఆ రూమర్స్‌కు చెక్ పెట్టేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్
Embed widget