అన్వేషించండి

Supreme Court : ఎన్జీటీ తీర్పు యాథాతథంగా అమలు చేయాల్సిందే - అక్రమ ఇసుక తవ్వకాలపై ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

Andhra News : ఇసుక తవ్వకాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్ిట షాక్ తగిలింది. ఎన్జీటీ ఆదేశాలను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

Andhra Sand Issue :  అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని అనుమతులు ఉన్న చోట కేవలం మాన్యువల్ గా మాత్రమే ఇసుకను తీయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.  అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్జీటిని  సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని  కాంట్రాక్ట్ సంస్థ జేపీ వెంచర్స్‌కు కూడా ఆదేశాలు జారీచేసింది. 

ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్న పిటిషనర్ 

పిటీషనర్ నాగేంద్ర కుమార్ అక్రమ ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించింది. పిటీషనర్ ఫిర్యాదులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినా చర్యలు తీసుకోవాలని  ఆదేసించింది.  తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలుకు సమయం ఎక్కువ కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. కానీ సుప్రీంకోర్టు తిరస్కరించింది.  ఎన్నికల కన్నా పర్యావరణ అంశాలే ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఎన్జీటీ విచారణలో తేలింది ఏమిటంటే ? 

రాష్ట్రంలో కేవలం 40 రీచ్‌లలో మాత్రమే మాన్యువల్‌ మైనింగ్‌ కు అనుమతి ఉంది. అయినా, 500పైగా రీచ్‌లలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన మేం పర్యటించిన సమయంలో గోదావరి నది వద్ద అక్రమ ఇసుక మైనింగ్‌ జరుగుతోందని ఎన్జీటీ విచారణలో తేలింది.  అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో జేసీబీలతో తవ్వకాలు సాగిస్తుండటాన్ని గుర్తించాం.గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక మైనింగ్‌ జరుగుతోంది. ఈ ఏడాది జనవరి 17, 19 తేదీల మధ్య మేం పరిశీలించినప్పుడు... జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ దాదాపు 2.2 టన్నుల కెపాసిటీ బకెట్‌ సైజ్‌లు కలిగిన జేసీబీ, హిటాచీ యంత్రాలతో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతోంది. రోజంతా ఎడతెరిపి లేకుండా ఈ తవ్వకాలు సాగుతున్నాయి. తవ్వకాలు జరుగుతున్న రీచ్‌లలో ఏ ఒక్కదానికీ పర్యావరణ అనుమతులు లేవు. రీచ్‌ల ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులూ తీసుకోలేదు. గనుల శాఖ నుంచి సంబంధిత రీచ్‌లను లీజుకు తీసుకున్నట్లు కూడా లేదని గుర్తించింది. 

ఇవీ ఎన్జీటీ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్  గత ఏడాది తీర్పు ఇచ్చింది. మొత్తం 110 ఇసుక రీచ్‌లలో వెంటనే తవ్వకాలు నిలిపేయాలని ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై నాగేంద్రకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఎన్జీటీ తన తీర్పులో పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం అరణియార్ నదిలోని పద్దెనిమిది ఇసుక రీచ్‌లకే పరిమితం కాదని వెల్లడించింది.  తమ అదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ట్రైబ్యునల్ తీర్పుకు వక్రభాష్యం చెప్పిందని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఉత్తర్వులను అమలు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది.

 ఇసుక అంశం ఏపీలో ఎప్పుడూ సంచలనంగా మారుతోంది. తాజాగా ఉత్తర్వులతో ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget