అన్వేషించండి

Tungabhadra : మళ్లీ నిండిన తుంగభద్ర - గేట్లు ఎత్తే అవకాశం - రైతులకు ఊరటే

Andhra Pradesh: తుంగభద్ర డ్యాం మళ్లీ నిండింది. మరికొంత వరద వస్తే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇటీవల గేటు విరిగిన కారణంగా 45 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి.

Tungabhadra Dam:  రాయలసీమ ప్రజల నీటి అవసరాలను తీర్చే తుంగభద్ర కరుణించింది. తుంగభద్ర ప్రాజెక్టు  19వ ఫస్ట్ గేట్ కొట్టుకపోవడంతో డ్యామ్ లో సుమారుగా 45 టీఎంసీల నీరు వృధా అయింది. 19వ ట్రస్ట్ గేట్ బిగించడంతో నీటి వృధాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. గేటు బిగించిన నాటి నుంచి తుంగభద్ర జలాశయంలోకి యావరేజ్ ఇన్ ఫ్లో  రావడంతో రోజురోజు జలాశయంలోని నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 100 టీఎంసీల నీరు తుంగభద్ర జలాశయం కి చేరడంతో అధికారులతో పాటు రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 101 టిఎంసి నీరు కొనసాగుతూ ఉంది. 

తుంగభద్ర క్యాచ్ మెంట్ ఏరియాలో వర్షాలు

తుంగభద్ర జలాశయం ఎగువ భాగాన ఉన్న తుంగ, భద్ర జలాశయాలు పూర్తిస్థాయిలో నిండడంతో ఆ రెండు జలాశయాల నీటిని దిగువకు వదులుతూ ఉండడంతో తుంగభద్ర జలాశయానికి నీటి ఇన్ ఫ్లో పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన తుంగభద్ర డ్యాం అధికారులు   దిగున ఉన్న నది పరివాహక ప్రాంతాల గ్రామాలను ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ సమయంలోనైనా తుంగభద్ర జలాశయం నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని నది పరివాహక ప్రాంత ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. 

హీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?

రైతులకు ఈ ఏడాది చింతలు లేనట్లే 

తుంగభద్ర జలాశయం నిండటంతో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. వంద టీఎంసీలకుపైగా నీటి నిల్వలతో జలాశయం కళకళ లాడుతోంది. జలాశయం ఎగువ భాగాన ఉన్న తుంగ, భద్ర, వరద నదుల నుంచి ఇనఫ్లో పెరుగుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలుగా.. ప్రస్తుతం జలాశయంలో 101 టీఎంసీలు నీరు చేరాయి.  గతం లో ఎగువ కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు హోస్పేటలోని తుంగభద్ర జలాశయంలోకి అనుకున్న స్థాయి కంటే ముందుగానే నీటి ప్రవాహం వేగంగా కొనసాగింది. దీంతో ఒక్కసారిగా ఖాళీగా ఉన్న జలాశయంలోకి నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది.

తుంగభద్ర జలాశయం నీటి కెపాసిటీ 105 టీఎంసీలు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు 105 టీఎంసీల వరద నీరు కేవలం తక్కువ రోజుల్లోనే జలాశయంలోకి చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విడతల వారీగా డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీరు వదిలారు. తుంగభద్ర జలాశయం కి పూర్తిస్థాయిలో నీరు రావడంతో తుంగభద్ర జలాశయం కింద ఉన్న ఆయకట్టు రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతలోనే తుంగభద్ర కు 19వ గేట్ కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ లీడర్లకు షాక్ ఇచ్చిన హైకోర్టు

ఆదుకున్న కన్నయ్య నాయుడు  
 
డ్యామ్ లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడంతో ఈసారి తమ వ్యవసాయ అవసరాలకు నీరు పుష్కలంగా లభిస్తుంది అనుకున్న తరుణంలో డ్యాం గేటు కొట్టకపోవడంతో ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. 105 టీఎంసీల పూర్తి కెపాసిటీతో ఉన్న డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో సుమారు 50 టీఎంసీల నీరు వృధాగా నదిలోకి పోయింది. 19వ గేటును బిగించాలి అంటే డ్యామ్ లో సుమారుగా 40 శాతం నీరు దిగువకు వెళ్లాల్సి ఉంటుందని మొదట అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చొరవతో జలాశయాల డ్యామ్ గేట్ల ప్రత్యేక నిపుణుడు కన్నయ్య నాయుడు రంగంలోకి దిగారు. పూర్తిగా డ్యాముని పరిశీలించి డ్యామ్ అధికారులు.. కన్నయ్య నాయుడు నీటి ప్రవాహం కొనసాగుతూ ఉన్న సమయంలోనే డ్యాం గేట్లను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని నీటి ప్రవాహంలోనే అమర్చే విధంగా పనులను కొనసాగించారు. ఆ పనులు వేగవంతంగా పూర్తి కావడం 19వ ట్రస్ట్ గేటును నాలుగు భాగాలను గేటుగా అమర్చడంతో నీటి వృధాను ఆపడంలో కన్నయ్య నాయుడు సక్సెస్ అయ్యారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
Embed widget