![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Students in Kyrgyzstan: కిర్గిస్థాన్లో చిక్కుకున్న భారత విద్యార్థులకు ఊరట, మే 23 నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు
కిర్గిస్థాన్లో పరిస్థితి సాధారణంగానే ఉందని మే 23 నుంచి ప్రతిరోజూ బిష్కెక్ నుంచి న్యూఢిల్లీకి రెండు విమాన సర్వీసులు నడుస్తాయని APNRTS విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి చరణ్జీత్ సింగ్ తెలిపారు.
![Students in Kyrgyzstan: కిర్గిస్థాన్లో చిక్కుకున్న భారత విద్యార్థులకు ఊరట, మే 23 నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు Students Stranded in Kyrgyzstan were safe APNRTS Shares Helpline for Students Stranded there Students in Kyrgyzstan: కిర్గిస్థాన్లో చిక్కుకున్న భారత విద్యార్థులకు ఊరట, మే 23 నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/e81e602ac3332153ac139bd99f6594c81716396868888233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Students Stranded in Kyrgyzstan | కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు (Kyrgyzstan Attacks) జరగడం తెలిసిందే. రాష్ట్ర విద్యార్థులు సైతం అక్కడ ఉంటడంతో పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) పర్యవేక్షిస్తోంది. తెలుగు విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది.
విద్యార్థుల కోసం ఏపీఎన్ఆర్టీఎస్ ప్రయత్నాలు
ఏపీఎన్ఆర్టీఎస్ తమకు తెలిసిన, సేకరించిన సమాచారాన్ని.. విదేశాంగ శాఖ (MEA) ఇస్తున్న సలహాలను అక్కడి విద్యార్థులకు చేరవేస్తోంది. తమ ప్రయత్నాలకు కొనసాగింపుగా కిర్గిస్థాన్లో ఏపీ విద్యార్థుల భద్రత, శ్రేయస్సును గురించి, ప్రస్తుత పరిస్థితి, విద్యార్థుల సమస్యల గురించి కేంద్రానికి వివరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యురేషియా అదనపు కార్యదర్శి చరణ్జీత్ సింగ్ కార్యాలయంతో చర్చలు జరుపుతోంది. కిర్గిస్థాన్లోని ఏపీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన/వస్తున్న అభ్యర్థనలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వివరించి, విద్యార్థులను స్వదేశానికి రప్పించే అవకాశాలపై ఏపీఎన్ఆర్టీఎస్ ఆరా తీసింది.
బిష్కెక్లో ప్రస్తుత పరిస్థితి సాధారణం
యురేషియా అదనపు కార్యదర్శి కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిర్గిస్థాన్ లో విద్యార్థుల పరిస్థితిపై స్పందించారు. కిర్గిస్థాన్లోని బిష్కెక్లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ (APNRTS)కు తెలిపింది. భారత వైద్య విద్యార్థులు దేశానికి తిరిగి రావడానికి ముందు, నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. విద్యార్థులు భారతదేశానికి తిరిగి రావాలి అనుకుంటే మే 23 (గురువారం) నుంచి బిష్కెక్ నుండి న్యూఢిల్లీకి నేరుగా ప్రతిరోజూ 2 విమానాలు నడుస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఏదైనా అత్యవసర సహాయం కోసం, భారతీయ/తెలుగు విద్యార్థులు బిష్కెక్లోని భారత రాయబార కార్యాలయంను 0555710041 హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
కిర్గిస్థాన్లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడవద్దని సూచించారు. అయితే అప్రమత్తంగా ఉండాలని, ఎంబసీ సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని ఏపీఎన్ఆర్టిఎస్ విజ్ఞప్తి చేసింది. కిర్గిస్థాన్లోని ఏపీ విద్యార్థులు సహాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్లైన్ నంబర్లు +91 863 2340678; +91 85000 27678 (వాట్సాప్) 24 గంటలు అందుబాటులో ఉంటాయని, లేదా ఇమెయిల్ info@apnrts.com; helpline@apnrts.com ను సంప్రదించాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)