అన్వేషించండి

Students in Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులకు ఊరట, మే 23 నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు

కిర్గిస్థాన్‌లో పరిస్థితి సాధారణంగానే ఉందని మే 23 నుంచి ప్రతిరోజూ బిష్కెక్ నుంచి న్యూఢిల్లీకి రెండు విమాన సర్వీసులు నడుస్తాయని APNRTS విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి చరణ్‌జీత్ సింగ్ తెలిపారు.

Students Stranded in Kyrgyzstan | కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు (Kyrgyzstan Attacks) జరగడం తెలిసిందే. రాష్ట్ర విద్యార్థులు సైతం అక్కడ ఉంటడంతో పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) పర్యవేక్షిస్తోంది. తెలుగు విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది.

విద్యార్థుల కోసం ఏపీఎన్ఆర్టీఎస్ ప్రయత్నాలు 
ఏపీఎన్ఆర్టీఎస్ తమకు తెలిసిన, సేకరించిన సమాచారాన్ని.. విదేశాంగ శాఖ (MEA) ఇస్తున్న సలహాలను అక్కడి విద్యార్థులకు చేరవేస్తోంది. తమ ప్రయత్నాలకు కొనసాగింపుగా కిర్గిస్థాన్‌లో ఏపీ విద్యార్థుల భద్రత, శ్రేయస్సును గురించి, ప్రస్తుత పరిస్థితి, విద్యార్థుల సమస్యల గురించి కేంద్రానికి వివరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యురేషియా అదనపు కార్యదర్శి చరణ్‌జీత్ సింగ్ కార్యాలయంతో చర్చలు జరుపుతోంది. కిర్గిస్థాన్‌లోని ఏపీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన/వస్తున్న అభ్యర్థనలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వివరించి, విద్యార్థులను స్వదేశానికి రప్పించే అవకాశాలపై ఏపీఎన్ఆర్టీఎస్ ఆరా తీసింది.

బిష్కెక్‌లో ప్రస్తుత పరిస్థితి సాధారణం 
యురేషియా అదనపు కార్యదర్శి కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిర్గిస్థాన్ లో విద్యార్థుల పరిస్థితిపై స్పందించారు. కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ (APNRTS)కు తెలిపింది. భారత వైద్య విద్యార్థులు దేశానికి తిరిగి రావడానికి ముందు, నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. విద్యార్థులు భారతదేశానికి తిరిగి రావాలి అనుకుంటే మే 23 (గురువారం) నుంచి బిష్కెక్ నుండి న్యూఢిల్లీకి నేరుగా ప్రతిరోజూ 2 విమానాలు నడుస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఏదైనా అత్యవసర సహాయం కోసం, భారతీయ/తెలుగు విద్యార్థులు బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయంను 0555710041 హెల్ప్‌లైన్ నంబర్లో సంప్రదించాలని తెలిపారు.

కిర్గిస్థాన్‌లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడవద్దని సూచించారు. అయితే అప్రమత్తంగా ఉండాలని, ఎంబసీ సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని ఏపీఎన్ఆర్టిఎస్ విజ్ఞప్తి చేసింది. కిర్గిస్థాన్‌లోని ఏపీ విద్యార్థులు సహాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్‌లైన్ నంబర్లు  +91 863 2340678; +91 85000 27678 (వాట్సాప్) 24 గంటలు అందుబాటులో ఉంటాయని, లేదా ఇమెయిల్ info@apnrts.com; helpline@apnrts.com ను సంప్రదించాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget