అన్వేషించండి

సౌదీలో టార్చర్ అనుభవిస్తున్న సిక్కోలు వాసులు- క్షేమంగా రప్పించాలని కేంద్రానికి ఎంపీ అభ్యర్థన!

శ్రీకాకుళం జిల్లా నుంచి వందల మంది సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడి యజమానుల వేధింపులు తాళలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఎంపీ రామ్మోహన్నాయుడు విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

శ్రీకాకుళం జిల్లాలో సరైన ఉపాధి లేక వందల కుటుంబాలు వలస వెళ్తుంటాయి. మరింత మెరుగైన జీవనోపాధి కోసం ఖండాంతరాలు దాటి వెళ్తుంటారు. ఇలా వందల మంది కుటుంబ పోషణ నిమిత్తం పెద్ద ఎత్తున సౌదీ అరేబియాలో పని చేసేందుకు తరలి వెళ్తున్నారు. అక్కడ పెట్రోల్ పైపులైన్లు, బంకులు, మాల్స్, వివిధ పరిశ్రమలతోపాటు భవన, రోడ్డు నిర్మాణ పనుల్లో ఎక్కువ మంది పని చేస్తున్నారు. రెండేళ్ల పాటు సౌదీ అరేబియాలో పని చేసి తిరిగి జిల్లాకు వస్తుంటారు. కొందరు అరబ్ షేక్‌ల ఇళ్లల్లో కూడా పనిచేస్తుంటారు.

వజ్రపుకొత్తూరు మండలంలోని అమలుపాడు, సైనూరు, ఉద్దాన రామకృష్ణాపురం, కంబాల రాయుడుపేట, కొత్తపేట, కొమరాలపేట, మందస మండలంలోని లోహరిబందతోపాటు జిల్లాలోని ఉద్దాన, మైదాన ప్రాంతాలకు చెందిన యువత ఆరు నెలల నుంచి రెండేళ్ల పాటు సౌదీ అరేబియాకు వివిధ పనుల నిమిత్తం తరలిపోతుంటారు. 

వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నాలు

సౌదీ అరేబియాలో పని చేసే వాళ్లకు నెలకు రూ.50 వేల నుంచి రెండు మూడు లక్షల వరకూ వేతనం వస్తుంది. అందుకే అక్కడకు వెళ్లి పని చేయాలనే ఆసక్తి చాలా మందిలో కనిపిస్తుంటుంది. వీరంతా కంపెనీలు, దళారుల ద్వారా వెళుతుంటారు. అలా వెళ్లిన వాళ్లు చాలా మంది అక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోతుంటారు. వెళ్లిన కొద్ది నెలలకే వచ్చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఆ సందర్భంలోనే వాళ్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు.  

ఎడారి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతకు తాళలేక కొందరు, యజమానుల వేధింపులకు తట్టుకోలేక మరికొందరు తిరిగి స్వదేశానికి వస్తుంటారు. రావడానికి సిద్ధపడే టైంలో యజమానులు అడ్డు చెప్పడంతో అసలు సమస్య మొదలవుతుంది. వాళ్ల అనుమతి లేకుండా వచ్చేందుకు ట్రై చేస్తే మాత్రం యజమానులు నరకం చూపిస్తుంటారు. యజమానులకు ఎదురు తిరిగారని తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపించడం, పాస్ పోర్టులు, వీసాలు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. వారు పెడుతున్న బాధలు పడలేక చాలామంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, మరి కొందరు స్వదేశానికి వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. 

సౌదీలో గాయపడి.. ఇంటికి రాలేక..

అలా సౌదీ వెళ్లి ఇబ్బందులు పడ్డవారిలో వజ్రపుకొత్తూరు మండలం కొల్లిపాడు గ్రామానికి చెందిన పుచ్చా కూర్మారావు ఒకరు. సౌదీ అరేబియాలో పనులు చేస్తూ... నిత్యం కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడేవాడు. ఏమైందో తెలియదు గానీ గత కొద్ది నెలల నుంచి ఇంటికి ఫోన్ చేయడం లేదు. వారు చేసినా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కూర్మారావు ఏమయ్యాడో తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

ఉద్దానం గోపినాథపురం గ్రామానికి చెందిన సాయిని జనార్ధనరావు కూడా సౌదీ అరేబియాలో పని చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. కుటుంబీకులు అతడిని స్వదేశానికి పంపించాలని సంబంధిత యజమానులను సంప్రదించినా పట్టించుకోలేదు. మందస మండలంలో హరిబంద గ్రామానికి చెందిన నక్కా శేషగిరి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. యజమాని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తిరిగి ఇంటికి వచ్చేస్తానని కుటుంబీకుల వద్ద శేషగిరి మొర పెట్టుకున్నాడు. దీంతో కుటుంబీకులు ఈ విషయాన్నిశ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. సౌదీలో పనిచేస్తున్న తమ వారిని తిరిగి రప్పించేలా చూడాలని కోరుతున్నారు.

సౌదీ నుంచి సిక్కోలు వాసులను రప్పించాలని.. 

విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ విపుల్ దృష్టికి తీసుకు వెళ్లారు. విపుల్‌ను కలిసి సిక్కోలు జిల్లా వాసులు పడుతున్న కష్టాలను వివరించారు. సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తూ గల్లంతైన వజ్రపుకొత్తూరు మండలం కొల్లిపాడు గ్రామానికి చెందిన పుచ్చా కూర్మారావు ఆచూకీ గురించి విచారించి క్షేమంగా భారత దేశానికి తీసుకురావాలని కోరారు. 

పని చేస్తూ గాయపడ్డ సాయిని జనార్ధనరావుకు నష్ట పరిహారం ఇప్పించడంతోపాటు తిరిగి క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలన్నారు.  మందస మండలంలో హరిబంద గ్రామానికి చెందిన నక్కా శేషగిరిని కూడా యజమాని టార్చర్‌ నుంచి కాపాడి ఇండియాకు తీసుకురావాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు అభ్యర్థించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget