అన్వేషించండి

సౌదీలో టార్చర్ అనుభవిస్తున్న సిక్కోలు వాసులు- క్షేమంగా రప్పించాలని కేంద్రానికి ఎంపీ అభ్యర్థన!

శ్రీకాకుళం జిల్లా నుంచి వందల మంది సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడి యజమానుల వేధింపులు తాళలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఎంపీ రామ్మోహన్నాయుడు విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

శ్రీకాకుళం జిల్లాలో సరైన ఉపాధి లేక వందల కుటుంబాలు వలస వెళ్తుంటాయి. మరింత మెరుగైన జీవనోపాధి కోసం ఖండాంతరాలు దాటి వెళ్తుంటారు. ఇలా వందల మంది కుటుంబ పోషణ నిమిత్తం పెద్ద ఎత్తున సౌదీ అరేబియాలో పని చేసేందుకు తరలి వెళ్తున్నారు. అక్కడ పెట్రోల్ పైపులైన్లు, బంకులు, మాల్స్, వివిధ పరిశ్రమలతోపాటు భవన, రోడ్డు నిర్మాణ పనుల్లో ఎక్కువ మంది పని చేస్తున్నారు. రెండేళ్ల పాటు సౌదీ అరేబియాలో పని చేసి తిరిగి జిల్లాకు వస్తుంటారు. కొందరు అరబ్ షేక్‌ల ఇళ్లల్లో కూడా పనిచేస్తుంటారు.

వజ్రపుకొత్తూరు మండలంలోని అమలుపాడు, సైనూరు, ఉద్దాన రామకృష్ణాపురం, కంబాల రాయుడుపేట, కొత్తపేట, కొమరాలపేట, మందస మండలంలోని లోహరిబందతోపాటు జిల్లాలోని ఉద్దాన, మైదాన ప్రాంతాలకు చెందిన యువత ఆరు నెలల నుంచి రెండేళ్ల పాటు సౌదీ అరేబియాకు వివిధ పనుల నిమిత్తం తరలిపోతుంటారు. 

వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నాలు

సౌదీ అరేబియాలో పని చేసే వాళ్లకు నెలకు రూ.50 వేల నుంచి రెండు మూడు లక్షల వరకూ వేతనం వస్తుంది. అందుకే అక్కడకు వెళ్లి పని చేయాలనే ఆసక్తి చాలా మందిలో కనిపిస్తుంటుంది. వీరంతా కంపెనీలు, దళారుల ద్వారా వెళుతుంటారు. అలా వెళ్లిన వాళ్లు చాలా మంది అక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోతుంటారు. వెళ్లిన కొద్ది నెలలకే వచ్చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఆ సందర్భంలోనే వాళ్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు.  

ఎడారి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతకు తాళలేక కొందరు, యజమానుల వేధింపులకు తట్టుకోలేక మరికొందరు తిరిగి స్వదేశానికి వస్తుంటారు. రావడానికి సిద్ధపడే టైంలో యజమానులు అడ్డు చెప్పడంతో అసలు సమస్య మొదలవుతుంది. వాళ్ల అనుమతి లేకుండా వచ్చేందుకు ట్రై చేస్తే మాత్రం యజమానులు నరకం చూపిస్తుంటారు. యజమానులకు ఎదురు తిరిగారని తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపించడం, పాస్ పోర్టులు, వీసాలు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. వారు పెడుతున్న బాధలు పడలేక చాలామంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, మరి కొందరు స్వదేశానికి వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. 

సౌదీలో గాయపడి.. ఇంటికి రాలేక..

అలా సౌదీ వెళ్లి ఇబ్బందులు పడ్డవారిలో వజ్రపుకొత్తూరు మండలం కొల్లిపాడు గ్రామానికి చెందిన పుచ్చా కూర్మారావు ఒకరు. సౌదీ అరేబియాలో పనులు చేస్తూ... నిత్యం కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడేవాడు. ఏమైందో తెలియదు గానీ గత కొద్ది నెలల నుంచి ఇంటికి ఫోన్ చేయడం లేదు. వారు చేసినా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కూర్మారావు ఏమయ్యాడో తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

ఉద్దానం గోపినాథపురం గ్రామానికి చెందిన సాయిని జనార్ధనరావు కూడా సౌదీ అరేబియాలో పని చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. కుటుంబీకులు అతడిని స్వదేశానికి పంపించాలని సంబంధిత యజమానులను సంప్రదించినా పట్టించుకోలేదు. మందస మండలంలో హరిబంద గ్రామానికి చెందిన నక్కా శేషగిరి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. యజమాని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తిరిగి ఇంటికి వచ్చేస్తానని కుటుంబీకుల వద్ద శేషగిరి మొర పెట్టుకున్నాడు. దీంతో కుటుంబీకులు ఈ విషయాన్నిశ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. సౌదీలో పనిచేస్తున్న తమ వారిని తిరిగి రప్పించేలా చూడాలని కోరుతున్నారు.

సౌదీ నుంచి సిక్కోలు వాసులను రప్పించాలని.. 

విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ విపుల్ దృష్టికి తీసుకు వెళ్లారు. విపుల్‌ను కలిసి సిక్కోలు జిల్లా వాసులు పడుతున్న కష్టాలను వివరించారు. సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తూ గల్లంతైన వజ్రపుకొత్తూరు మండలం కొల్లిపాడు గ్రామానికి చెందిన పుచ్చా కూర్మారావు ఆచూకీ గురించి విచారించి క్షేమంగా భారత దేశానికి తీసుకురావాలని కోరారు. 

పని చేస్తూ గాయపడ్డ సాయిని జనార్ధనరావుకు నష్ట పరిహారం ఇప్పించడంతోపాటు తిరిగి క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలన్నారు.  మందస మండలంలో హరిబంద గ్రామానికి చెందిన నక్కా శేషగిరిని కూడా యజమాని టార్చర్‌ నుంచి కాపాడి ఇండియాకు తీసుకురావాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు అభ్యర్థించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్

వీడియోలు

WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
Shubman Gill, Jadeja in Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఆడనున్న గిల్, జడేజా
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Embed widget