అన్వేషించండి

Arasavalli Rathasapthami: ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుని రథసప్తమి వేడుకలు - ఆ గ్రామస్థులకు ప్రత్యేక దర్శనం

Srikakulam News: అరసవల్లిలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికులకు ప్రత్యేక పాసులతో స్వామి దర్శనం కల్పించనున్నారు.

Suryanarayana Swamy Special Darshan For Locals In Arasavalli: రథసప్తమి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యుని దర్శించుకోవడం పరిపాటిగా వస్తోంది. దాతలు, వీవీఐపీలు, వీఐపీలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామిని దర్శించుకుంటారు. ఈసారి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అరసవల్లిలో నివాసముంటున్న స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పూర్వం నుంచి అరసవల్లిలో నివాసముంటూ స్వామి సేవలో, ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న స్థానికులకు సూర్యజయంతి రోజున స్పెషల్ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గతంలో ఎన్నడూ లేని విధంగా రథసప్తమి రోజున స్థానికులకు ఆదిత్యుని దర్శనభాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అరసవల్లిలోని బ్రాహ్మణ వీధి, బొంపాడ వీధి, వెలమ వీధి, కాపు వీధి, శెగిడి వీధి, హరిజన వీధి వాసులకు ప్రత్యేకంగా పాసులు జారీ చేయనున్నారు. సచివాలయాల సిబ్బందితో ఇప్పటికే ఎమ్మెల్యే శంకర్ మాట్లాడి స్థానికంగా నివాసముంటున్న కుటుంబాల జాబితాను సిద్ధం చేశారు. ఆయా కుటుంబాల వారికి పాసులు జారీ చేసి రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామిని వారు దర్శించుకునేలా చర్యలు చేపడుతున్నారు.

ప్రత్యేక పాసులతో పాటు ఆధార్ కార్డులను తీసుకుని వారు దర్శనానికి రావాల్సి ఉంటుంది. ఇది వరకు స్థానికులు సైతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మాదిరిగానే స్వామి వారిని దర్శనం చేసుకునేవారు. వారికి ఎటువంటి ప్రాధాన్యత కూడా దర్శనాల విషయంలో లభించేది కాదు. ఈసారి రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న తరుణంలో స్థానికులను గుర్తించి ప్రత్యేకంగా పాసులు జారీ చేసి దర్శనభాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ చొరవను వారంతా కొనియాడుతున్నారు.

అటు, 3 రోజుల పాటు నిర్వహించబోయే రథసప్తమి ఉత్సవాలు విజయవంతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గొండు శంకర్ కృషి చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన ఉత్సవ ఏర్పాట్లు, ఆ సందర్భంగా జరుగుతున్న పనులు పర్యవేక్షించడంలో బిజీబిజీ అయిపోయారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి సూచనలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులతో మాట్లాడుతూ ఏర్పాట్లలో భాగస్వామ్యం అవుతున్నారు. ఉత్సవాలు జరిగే వరకు కూడా ఆయన అరసవల్లిపైనే దృష్టి సారించేలా ముందుకు సాగుతున్నారు.

గత అనుభవాల దృష్ట్యా..

రథసప్తమిని ఈసారి మూడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఉండడంతో అరసవల్లి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకైతే మాత్రం దర్శనం భాగ్యం దొరకట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరసవల్లిలో మొత్తం కలిపి 34 వేల మంది ఉన్నారు. వీళ్లందరికీ కూడా ఒకే సమయం ఇచ్చి ఆ సమయంలో లోపలికి వెళ్లాలని దర్శనానికి ఏర్పాట్లు చేయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిసారీ రథసప్తమి వస్తుందంటే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హడావుడి అంతాఇంత కాదు. కానీ ఈసారి ఎలా జరుగుతుందో మనం కూడా వేచి చూడాలి.

Arasavalli Rathasapthami: ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుని రథసప్తమి వేడుకలు - ఆ గ్రామస్థులకు ప్రత్యేక దర్శనం
Arasavalli Rathasapthami: ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుని రథసప్తమి వేడుకలు - ఆ గ్రామస్థులకు ప్రత్యేక దర్శనం

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget