అన్వేషించండి

Trains Cancellation: 'దయచేసి వినండి' - గోదావరి ఎక్ర్ ప్రెస్ రద్దు, విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యం, మరిన్ని రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే

SCR: భారీ వర్షాలతో విశాఖ - హైదరాబాద్ - విశాఖ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు మరో 19 రైళ్లను రద్దు చేసినట్లు ద.మ రైల్వే ప్రకటించింది. అటు, విశాఖ ఎక్ర్ ప్రెస్‌ను రీషెడ్యూల్ చేశారు.

SCR Cancelled Trains Due To Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్ష బీభత్సంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ఆది, సోమ వారాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కొన్ని సర్వీసులను దారి మళ్లించింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా, గోదావరి ఎక్స్ ప్రెస్ (Godavari Express) సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం బయలుదేరాల్సిన విశాఖ - హైదరాబాద్ - విశాఖ (12727/12728) గోదావరి రైలుతో పాటు మరో 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. వానలకు కొన్ని చోట్ల పట్టాలపైకి నీరు చేరిన క్రమంలో పలు రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్ - భువనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) (Visakha Express) రైలును రీ షెడ్యూల్ చేశారు. ఈ రైలు ఆదివారం సాయంత్రం 4:50 గంటలకు బదులుగా సాయంత్రం 06:50 గంటలకు షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. మరోవైపు, ద.మ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తాజా పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేశారు. రైలు సర్వీసుల పునరుద్ధరణ, భద్రతాపరమైన చర్యలకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సమీక్షించారు. భారీ వర్షాల క్రమంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

రద్దైన రైళ్ల వివరాలు
Trains Cancellation: 'దయచేసి వినండి' - గోదావరి ఎక్ర్ ప్రెస్ రద్దు, విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యం, మరిన్ని రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే
Trains Cancellation: 'దయచేసి వినండి' - గోదావరి ఎక్ర్ ప్రెస్ రద్దు, విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యం, మరిన్ని రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే


Trains Cancellation: 'దయచేసి వినండి' - గోదావరి ఎక్ర్ ప్రెస్ రద్దు, విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యం, మరిన్ని రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే

ఈ రైళ్లు సైతం

మరోవైపు, విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆది, సోమవారాల్లో దాదాపు 30 రైళ్లు రద్దు కాగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సింహాద్రి, మచిలీపట్నం, గంగా - కావేరి, సంఘమిత్ర, గౌతమి, చార్మినార్, యశ్వంత్‌పూర్ రైళ్లను నిలిపేశారు. అటు సికింద్రాబాద్ - గుంటూరు (17202), విశాఖ - సికింద్రాబాద్ (20708) రైళ్లు రద్దు చేసినట్లు చెప్పారు. విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ (12713/12714), గుంటూరు - సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సికింద్రాబాద్ - గుంటూరు  - సికింద్రాబాద్ (12705/12706) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు, తిరుపతి - కరీంనగర్ (12761), విశాఖ - న్యూఢిల్లీ (20805) రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 

రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు

వర్షాలతో పలు రైళ్లు రద్దు చేయగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడతో పాటు రాయనపాడు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్‌లో రద్దీ నెలకొంది. వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. రైల్వే అధికారులు స్టేషన్‌లోనే ప్రయాణికులకు భోజన ఏర్పాట్లు చేశారు. వర్షాలతో ట్రాక్స్ దెబ్బతిన్న చోట్ల సిబ్బంది పునరుద్ధరణ పనులు  చేపట్టారు. వర్షాల తీవ్రతను బట్టి రైళ్ల రద్దును మరో రెండు మూడు రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Also Read: Land Slide: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు, శ్రీశైలం వెళ్లే వారికి అలర్ట్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget