Sharmila On Temples: చంద్రబాబు మిగతా మతాలకు అభద్రతాభావం కల్పించకూడదు - ఆలయాల నిర్మాణంపై షర్మిల వ్యాఖ్యలు
Temples in Dalit villages: దళిత వాడల్లో ఆలయాల నిర్మాణంపై మరోసారి షర్మిల స్పందించారు. TTD నిధులతో TTD నే స్వయంగా గుడులు కడితే అభ్యంతరం ఎవరికి ఉండదన్నారు.

Andhra Temples in Dalit villages Issue: దళిత వాడల్లో ఆలయాలు నిర్మించవద్దని షర్మిల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీనిపై షర్మిల మరోసారి స్పందించారు. 2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు, దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్ రూమ్ ఉందని పేర్కొందని.. దానిపై దృష్టి పెట్టండని మేము అడగడం తప్పా అని ప్రశ్నించారు. కనీసం రోడ్లు ,డ్రైనేజీ కూడా SC,ST కాలనీలలో లేవని ప్రశ్నించడం మేము చేసిన నేరమా ? ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా .. బడుల మీద, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పు కాదన్నారు.
TTD నిధులతో TTD నే స్వయంగా గుడులు కడితే అభ్యంతరం ఎవరికి ఉండదు. మేము లేవనెత్తిన సమస్యల్లా TTD నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి ప్రమోషన్ చేసుకోవడం ఏంటనేదేనని స్పష్టం చేశారు. ఒక మతానికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి మాట్లాడకూడదు... తాను ప్రకటించే నిర్ణయాలు అన్ని మతాలకు సమానంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వంలో, బీజేపీతో కలిసున్న సీఎం మిగతా మతాలకు అభద్రతాభావం కలిగించకూడదుని మేమేదో హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకులమని చూపించే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై, వ్యక్తిగతంగా నాపై BJP, RSS మత ఛాందస వాదులు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హిందువులను కావాలని రెచ్చగొడుతున్నారు. పీఠాధిపతులతో తిట్టిస్తున్నారని.. నా వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ఉద్దేశ్యాన్ని మత పిచ్చి RSS, BJP వాదులు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. మత రాజకీయాలు చేసి లబ్ది పొందేందుకు BJP, RSS చేస్తున్నవి నీచ రాజకీయాలని.. హిందూ ధర్మానికి, మతానికి, నేను గానీ కాంగ్రెస్ పార్టీ గానీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు.
2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు, దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్ రూమ్ ఉందని పేర్కొంది. దానిపై దృష్టి పెట్టండని మేము అడగడం తప్పా ? కనీసం రోడ్లు ,డ్రైనేజీ కూడా SC,ST కాలనీలలో లేవని ప్రశ్నించడం మేము చేసిన నేరమా ? ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు…
— YS Sharmila (@realyssharmila) October 1, 2025
కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం. ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం ఇది కాదు కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇది ఘోర అపచారం అని, వెంటనే CBI దర్యాప్తుకు ఆదేశించాలని మొదట డిమాండ్ చేసింది తానేనని గుర్తు చేశారు. ప్రజల పక్షాన మా డిమాండ్ లో మంచిని వెతకకుండా, దానికి చంద్రబాబు సమాధానం చెప్పకుండా , కుహనా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటన్నారు.
ప్రజల కోసం మేము మాట్లాడితే, మతం కోసం RSS, బీజేపీ మాట్లాడుతుంది . ఎవరు మత పిచ్చిగాళ్లో, ఎవరు మత విద్రోహులో, విషం చిమ్మేది ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసన్నారు. TTD ని గుంజడం కాదు .. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే .. మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వాలని సవాల్ చేశారు.





















