అన్వేషించండి

Vijayasai Reddy Resignation: జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి

Andhra Pradesh News | వైసీపీ అధినేత జగన్‌తో ఫోన్లో మాట్లాడిన తరువాతే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

Vijayasai Reddy Resigned as Rajyasabha Member | న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్ సీపీ నేత వి. విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు విజయసాయిరెడ్డి తన రాజీనామా పత్రం సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. చెప్పినట్లుగానే శనివారం నాడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, తన రాజీనామాను ఉపరాష్ట్రపతి వెంటనే ఆమోదించారని విజయసాయిరెడ్డి తెలిపారు. 

జగన్‌తో మాట్లాడాకే రాజీనామా చేశా..

అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. లండన్ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడా. ఆ తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. వెన్నుపోటు వ్యాపారాలు, వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు. రాజకీయాల నుంచి కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారు. నేను అబద్ధం చెప్పడం లేదు. నా మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే తత్వం నాది. కేసులకో, ఎవరికో భయపడే వ్యక్తిని కాదు. భయమనేది నా బ్లడ్ లోనే లేదు. పదవికి న్యాయం చేయడం లేదని భావించి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎవరికైనా దమ్ముంటే నేను డబ్బులు తీసుకుని రాజీనామా చేసినట్లు నిరూపించండి’ అని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.

వారి వ్యాపారాలతో ఏ సంబంధం లేదు

మా వియ్యకుండు నా క్లాస్ మేట్. తరువాత నేను ఛార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను. ఆయన వ్యాపారంలోకి వెళ్లారు. నా కూతుర్ని ఆయన కొడుకుకు సంబంధం చేసుకున్నప్పుడే మరోసారి కలిశాను. వాళ్లకు ఏ వ్యాపారాలు ఉన్నాయో నాకు పూర్తిగా తెలియదు. నేను నిరంతరం నా పనులు, రాజకీయాలపై మాత్రమే ఫోకస్ చేశా. కేవీ రావుతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. కాకినాడ పోర్ట్ విషయంలో నాకు ఏ సంబంధం లేదు. కానీ నన్ను ఏ2గా చేర్చారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు పంపింది నేనే అనేది నిజం కాదు.

కూటమికి ప్రయోజనం చేకూరుతుంది..

రాజకీయాల నుంచి తప్పుకుంటే నేను బలహీనుడ్ని అవుతాను. నాకు ఏ ప్రయోజనం ఉంటుందో మీరే చెప్పండి (మీడియాకు విజయసాయిరెడ్డి ప్రశ్న). ఓ పార్టీలో జనరల్ సెక్రటరీగా, అటు రాజ్యసభ సభ్యుడిగా న్యాయం చేయలేకపోతున్నాను. ఆ స్థానంలో మెరుగైన వ్యక్తి రావాలని భావించి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశా. ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యత్వానికే రాజీనామా చేశా. వైసీపీ సభ్యుడిగా త్వరలో రాజీనామా చేస్తాను. నా రాజీనామా కూటమికే ప్రయోజనం చేకూరుస్తుంది. ఏ పదవులు ఆశించిగానీ, ప్రయోజనం కోసమో, కేసుల మాఫీ కోసమో రాజీనామా అనేది నిజం కాదు. ఓ మహిళ గురించి తనతో సంబంధం ఉందని దుష్ప్రచారం చేస్తే న్యాయపోరాటం చేశా. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు. 

బీజేపీలో ఎంపీ కావడం, గవర్నర్ పదవి ఆశించడం లాంటి ఉద్దేశంతో రాజీనామా చేయలేదు. విదేశాల్లో పర్యటించా, ఎన్నో విషయాలు నేర్చుకున్నా. విజయసాయిరెడ్డి విశాఖపట్నం దోచేశాడని ప్రచారం జరిగింది. మంచి పౌండ్, ప్రాస ఉందని బాగా ప్రచారం చేశారు. కూతురు, అల్లుడు వాళ్లకు బాగానే ఆస్తులున్నాయి. వారి వ్యాపారాలతో నాకు లింక్ పెడితే చేసేదేం లేదు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మరోసారి చెబుతున్న. వైసీపీ 2019లో 151 సీట్లు నెగ్గింది, 2024లో 40 శాతం ఓటింగ్ సాధించింది. అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్. నాలాంటి వాళ్లు 1000 మంది పార్టీని వీడినా జగన్ కు ఎలాంటి నష్టం లేదని’ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Also Read: Nara Lokesh: దావోస్ నుంచి తిరిగొచ్చిన నారా లోకేష్, గన్నవరం ఎయిర్‌పోర్టులో మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
Type-2 Diabetes Risk : స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Panchayat Elections: ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
Priya Prakash Varrier: ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
Embed widget