By: ABP Desam | Updated at : 26 Jan 2022 04:22 PM (IST)
మూడు జిల్లాలుగా తూర్పుగోదావరి జిల్లా
ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న జిల్లా పునర్విభజన ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. నిన్న అకస్మాత్తుగా మంత్రిమండలి ఆమోదంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక ఉతర్వలు కూడా వచ్చాయి.
మంత్రిమండలి ఆమోదించిన జాబితా చూసిన ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో భిన్న స్పందన ఉంది. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను విభజించాలని భావించిన ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. ఈ విభజనలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు పెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా మూడుగా విడిపోనుంది.
మూడుగా విభజిస్తున్న తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకినాడ, అమలాపురాన్ని విడగొడుతున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అరకు పార్లమెంటు స్థానంలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అరకు కేంద్రంగా ప్రకటించే అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్లిపోయింది.
రాజమండ్రి కేంద్రంగా పరిపాలన సాగించే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలైన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలతోపాటు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉండే రెండు నియోజకవర్గాలు కలపనున్నారు.
ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్టుగానే అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేయాబోతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అమలాపురం కేంద్రంగా పరిపాలన సాగించే జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలు ఉండనున్నాయి.
కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్తోపాటు పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాలు ఉండనున్నాయి.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన పేర్లపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పునర్విభజన గనుక జరిగితే అందులో అమలాపురం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ఏనాటి నుంచో డిమాండ్ ఉంది. గతంలో అనేక దళిత, ఇతర సామాజిక సంఘాలు ఎన్నో సందర్భల్లో ఉన్నతాధికారులకు, ప్రజ్పాతినిధులకు వినతిపత్రాన్ని సమర్పించారు. దీనికి కాపు ఉద్యమ నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. ముమ్మిడివరంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముందు ముమ్మిడివరం శాసన సభ్యుడు పొన్నాడ సతీష్ కూడా కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాజాగా లేఖ రాశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కృష్ణదేవరాయులు, జీఎంసీ బాలయోగి పేర్లు కొత్తగా ఏర్పడే జిల్లాలకు పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.
కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్తో కోనసీమ దళిత సంఘాలన్నీ ఏకమై ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్లు సమర్పించడంతోపాటు ప్రభుత్వం గుర్తించేలా అమలాపురం కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానిస్తున్నారు.
మరికొందరు అయితే కోనసీమగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్న టైంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సస్పెన్ష్ కొనసాగుతోంది. ఇప్పటికే గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం... అభ్యంతరాలు తీసుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది.
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్మీట్
Konaseema: ‘కోనసీమ’ పేరు మార్పుపై ఉద్రిక్తతలు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ - కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
MLC Anantha Udaya Bhaskar Arrest: ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అరెస్ట్, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు ! ఎందుకు ప్రకటించడం లేదో !
MLC Driver Murder Case: ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ గన్మెన్లు సస్పెండ్, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అరెస్ట్
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?