అన్వేషించండి

Rajampet Mla Posters : ఎమ్మెల్యే మేడాపై మాకు నమ్మకం లేదు, రాజంపేటలో కలకలం రేపుతున్న స్టిక్కర్లు!

Rajampet Mla Posters : రాజంపేట ఎమ్మెల్యే మేడాపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలపై ఆయనకు వ్యతిరేకంగా స్టిక్కర్లు అతికించారని ప్రచారం జరుగుతోంది.

Rajampet Mla Posters : అధికార వైసీపీ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి 'మా నమ్మకం నువ్వే జగన్' సిక్కర్లు అతికిస్తుంది. అయితే స్టిక్కర్లు అతికించేందుకు వెళ్లున్న వైసీపీ నేతలకు మాత్రం కొన్ని చోట్ల విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఘటనే రాజంపేటలో వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యేపై స్థానికంగా పోస్టర్లు వెలిశాయి. మా నమ్మకం నువ్వే జగనన్న కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిపై మాకు నమ్మకం లేదంటూ పోస్టర్లు అతికించారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. స్థానిక వైసీపీ  నాయకులు, కార్యకర్తలే ఈ పోస్టర్లు వేయించారని జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఇలా పోస్టర్లు వేయించారని స్థానికులు అంటున్నారు. కొద్ది రోజులుగా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిపై అసమ్మతి వర్గం గుర్రుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరుగుతుండటంతో ఇలా పోస్టర్లతో ఏర్పాటుచేసి తమ నిరసనను తెలియజేశారని తెలుస్తోంది. ఈ పోస్టర్ల వ్యవహారం రాజంపేట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఏపీలో స్టిక్కర్ల రాజకీయం 

ఆంధ్రప్రదేశ్ లో 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమం కొనసాగుతోంది. వైసీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి మెగా ప్రజా సర్వే చేస్తున్నారు. ఇళ్లకు సీఎం జగన్  స్టిక్లర్లు అంటిస్తున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 20 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అయితే మా నమ్మకం నువ్వే జగన్ అంటూ సాగుతున్న కార్యక్రమంలో అక్కడక్కడా అసమ్మతి ఎదురవుతుంది. కొన్ని చోట్ల ప్రజలు ప్రశ్నిస్తుంటే మరికొన్ని చోట్ల వైసీపీ నేతలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు పోస్టర్లు పెడుతున్నారు.  సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ది పాలనకు సంబంధించి ప్రజల స్పందనలను నమోదు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటి వరకు జగనన్నకు మద్దతు తెలుపుతూ 8296082960 నంబర్‌కు 15 లక్షల పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ప్రకటించింది. ప్రజలకు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలియ చేస్తూ ఐదు ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లినపుడు వారి అనుమతితో జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ కూడా అంటిస్తున్నారు. నచ్చితే స్టిక్కర్ గోడకు అంటించుకోవచ్చు. అదే విధంగా సెల్ ఫోన్ పై కూడా అంటించే స్టిక్కర్ లను పంపిణి చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సర్వే కార్యక్రమంపై రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. కోటి 60 లక్షల ఇళ్ల దగ్గరకు వెళ్లి ప్రజల అభిప్రాయం తీసుకునే పనిలో ఉన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నేతలు. 

జగన్ స్టిక్కర్లకు ప్రతిపక్షాల కౌంటర్...

అధికార పార్టీకి చెందిన నాయకులు స్టిక్కర్‌ల పంపిణికి ప్రతిపక్షాలు కూడా కౌంటర్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. మా ఖర్మ నువ్వే జగన్...మా కొద్దు జగన్ అంటూ పోటీ స్టిక్కర్‌లను కూడా పంపిణి చేస్తున్నాయి. జగన్ కు సంబంధించిన స్టిక్కర్ ఎక్కడ ఉన్నా.. దానికి పక్కనే ప్రతిపక్ష పార్టీకి చెందిన స్టిక్కర్‌ను వేసేస్తున్నారు. దీంతో ఈ వ్యవహరం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కౌంటర్ స్టిక్కర్‌లు వేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి విఫలమైన అంశాలు, గంజాయి వంటి మత్తు పదార్దాల రవాణా, శాంతి భద్రతల వైఫల్యాలు, జీవో నెంబర్ వన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget