అన్వేషించండి

Rajahmundry News : బాణసంచా తయారుచేస్తున్న ఇంట్లో భారీ పేలుడు, యువకుడు మృతి

Rajahmundry News : రాజమండ్రిలో అవవాంబే గృహాల సమీపంలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Rajahmundry News : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగి భారీ పేలుడు జరిగింది. దీంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయింది. రాజమండ్రిలోని 16వ వార్డులో ఆవరోడ్డు రైతు నగర్ లోని ఓ ఇంట్లో ప్రమాదం జరిగింది. ఈ పేలుడులో కోటేశ్వరరరావు(35) అనే యువకుడు  మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది.  ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పోలీస్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం 

తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ క్వార్టర్స్ లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, బెల్లం, ఖైనీ, సారా కాసే పాత్రలు సహా పలు వస్తువులు తగలబడిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు . కడియం పోలీస్ స్టేషన్ వెనుక వైపుగల ఈ భవనం ఖాళీగా ఉంటోంది. దీంతో ఇటీవలే ఈ వస్తువులను అందులోకి మార్చినట్లు తెలుస్తోంది. కాగా సోమవారం ఉదయం ఈ వస్తువులు ఉన్న గదిలో నుంచి మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా ఆ బిల్డింగ్లో కరెంట్ కూడా లేదని చెబుతున్నారు. దీంతో ప్రమాద కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజమహేంద్రవరం అర్బన్  డీఎస్పీ శ్రీ లతను సంప్రదించగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియ జేస్తామని చెప్పారు.

 టపాసుల స్టాల్స్ లో అగ్నిప్రమాదం 

 విజయవాడలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గాంధీనగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో దీపావళికి ఏర్పాటు చేసిన టపాసుల స్టాల్స్ లో మంటలు చెలరేగాయి. టపాసుల స్టాల్స్ లో క్రాకర్స్ భారీ శబ్ధంతో పేలిపోయాయి. దీంతో కొన్ని స్టాల్స్ అగ్నికి కాలిపోయాయి.  దుకాణదారులు, స్థానికులు ప్రాణ భయంతో గ్రౌండ్ బయటకు పరుగులు తీశారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారని సమాచారం. మరికొందరు స్థానికుల సహాయంతో దుకాణాదారులు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు జింఖానా గ్రౌండ్ కు వెళ్లి పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన స్టాల్స్ షాపుల వారికి లక్షల రూపాయల నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ క్రాకర్ స్టాల్ లో పటాసు పేలడంతో అది భారీ అగ్ని ప్రమాదంగా మారింది. ఈ ప్రమాదంలో మూడుకు పైగా దీపావళి క్రాకర్స్ స్టాల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిని పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది ఎంతగానో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  ఈ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget