అన్వేషించండి

Raghurama complaint to Guntur SP : కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు - జగనే టార్గెట్ !

Andhra News : తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ విషయంలో రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ కుట్ర చేశారని పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కోరారు.

Raghuramakrishna Raju :  మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ  జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పట్లో జరిగిన ఘటనలతో పాటు వాటికి సంబంధించిన సాక్ష్యాలను కూడా జత చేశారు. 

పుట్టిన రోజు నాడు అరెస్టు చేసిన సీఐడీ అధికారులు            

2021 మే 14వ తేదీన రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నారు. ఆ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న  సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారు. ఏ కేసు పెట్టారో.. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పలేదు. వెంటనే గుంటూరుకు తరలించారు. అయితే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఆ రోజు రాత్రి గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఉంచారు. అరెస్టు చేసిన తర్వాత సీఐడీ అధికారులు సుమోటో రాజద్రోహం కేసులు పెట్టినట్లుగా ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. కుట్ర ఉందని కేసు పెట్టారు.
Raghurama complaint to Guntur SP :  కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు -  జగనే టార్గెట్ !

అదే రోజు రాత్రి కస్టోడియల్ టార్చర్                

ఉదయమే కోర్టులో హాజరు పరిచే సమయంలో ఆయన నడవలేకపోయారు. కోర్టులో తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. తనను కొడుతున్న దృశ్యాలను లైవ్ లో ఇతరులకు చూపించారని రఘురామ ఆరోపించారు. వ్యవహారం హైకోర్టుకు చేరడంతో దీంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించాలని ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు గాయాలు కాలేదని.. వేరే సమస్యల వల్ల కాళ్లకు ఇబ్బందులు వచ్చాయని నివేదిక ఇచ్చారు. అయితే డాక్టర్లు తప్పుడు నివేదికలు ఇచ్చారని.. తనకు హైదరాబాద్‌లో సైనిక ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలని రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో  పరీక్ష - కొట్టారని  రిపోర్ట్ 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  హైదరాబాద్ సైనిక ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఆయనకు గాయాలు అయినట్లుగా తేలింది. బలమైన వస్తువుతో కొట్టడం ద్వారా గాయం అయినట్లుగా తేలడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో రాజద్రోహం సెక్షన్లను నిలిపివేసింది. ఆ తర్వాత తనపై జరిగిన దాడి విషయంలో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. తనను అరెస్టు చేసిన అధికారుల కాల్ రికార్డులను భద్ర పరిచేలా.. ఆదేశాలు తెచ్చుకున్నారు. సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. 

జగన్ చంపాలని చూశారని ఆర్ఆర్ఆర్ ఆరోపణ                 

జగన్మోహన్ రెడ్డి తనను చంపేందుకు ప్రయత్నించారని రఘురామ గట్టిగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం  మారడంతో రఘురామ ఫిర్యాదుపై గుంటూరు ఎస్పీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నాడు సొంతంగా కేసు పెట్టిన అధికారులు.. అందరి కాల్ రికార్డులు భద్రపర్చి ఉండటంతో.. ఒక వేళ దర్యాప్తు చేస్తే .. జగన్, ఐపీఎస్ సునీల్ కుమార్ ఇబ్బందుల్లో పడుతారన్న  అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Lok Sabha Updates: కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు- మోడీపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు- మోడీపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
Bhole Baba : ఒకప్పుడు ఇంటిలిజెన్స్‌లో అధికారే భోలే బాబా- ఆయన సత్సంగ్ కార్యక్రమంలోనే తొక్కిసలాట
ఒకప్పుడు ఇంటిలిజెన్స్‌లో అధికారే భోలే బాబా- ఆయన సత్సంగ్ కార్యక్రమంలోనే తొక్కిసలాట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Lok Sabha Updates: కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు- మోడీపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు- మోడీపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
Bhole Baba : ఒకప్పుడు ఇంటిలిజెన్స్‌లో అధికారే భోలే బాబా- ఆయన సత్సంగ్ కార్యక్రమంలోనే తొక్కిసలాట
ఒకప్పుడు ఇంటిలిజెన్స్‌లో అధికారే భోలే బాబా- ఆయన సత్సంగ్ కార్యక్రమంలోనే తొక్కిసలాట
Jio - Airtel New Plans: 2జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్‌ చిల్లు
2జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్‌ చిల్లు
Andhra Pradesh: 9 నెలల క్రితం అదృశ్యమైన యువతి ఇప్పుడెలా దొరికిందీ? జమ్మూ ఎందుకు వెళ్లినట్టు?
విజయవాడలో 9 నెలల క్రితం అదృశ్యమైన యువతి ఇప్పుడెలా దొరికిందీ? జమ్మూ ఎందుకు వెళ్లినట్టు?
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Embed widget