అన్వేషించండి

RAGHU RAMA : అమరావతి మహోద్యమ వేదికపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ... ఏకైక రాజధానికే మద్దతన్న రఘురామ !

అమరావతి రైతుల సభకు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. దీంతో అన్ని పార్టీల నేతలూ అమరావతికి మద్దతు తెలిపినట్లయిది.


తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహోద్యమ సభకు వైఎస్‌ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. తనపై వైఎస్ఆర్‌సీపీ నేతలు అయిన చెవిరెడ్డి, పెద్దిరెడ్డి దాడి చేయించే అవకాశం ఉందని అందువల్ల తాను వర్చవల్‌గా సమావేశంలో పాల్గొంటానని ఢిల్లీలో గురువారం ఆయన ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆయన తిరుపతిలో అడుగు పెట్టారు. ఆయన వస్తున్నట్లుగా కొంత మంది  అమరావతి జేఏసీ నేతలకే సమాచారం ఉంది. ఆయన రాకతో అమరావతి మహోద్యమ సభ వేదికపై అన్ని పార్టీల నేతలూ ఉన్నట్లు అయింది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయి.
RAGHU RAMA : అమరావతి మహోద్యమ వేదికపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ... ఏకైక రాజధానికే మద్దతన్న రఘురామ !

Also Read: పేదలపై సామాజిక దాడి - బినామీలతో అమరావతి ఉద్యమం .. చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఆగ్రహం !

వైఎస్ఆర్‌సీపీ విధానం మాత్రం మూడు రాజధానులు. ఆ పార్టీతో విబేధించిన రఘురామకృష్ణరాజు అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నారు.  పలు అంశాలపై వైఎస్ఆర్‌సీపీ విధానాలతో వ్యతిరేకిస్తున్న ఆయన ప్రతీ రోజూ ప్రెస్‌మీట్ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. అమరావతి రైతులకు మొదటి నుంచి మద్దతుగా నిలిచారు. ఏపీకి వస్తే తనపై దాడులు జరిగే అవకాశం ఉందని.. తప్పుడు కేసులతో అరెస్టు చేసే ప్రమాదం ఉందన్న కారణంగా ఆయన చాలా కాలంగా ఏపీకి రావడం లేదు. సొంత నియోజకవర్గం అయిన నర్సాపురానికీ వెళ్లడం లేదు. 

Also Read: పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్‌ కొత్త వ్యూహం !

ఆయన అనుమానాలను నిజం చేస్తూ గతంలో తన పుట్టినరోజు నాడు హైదరాబాద్ లోని ఇంటికి వచ్చినప్పుడు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పటి వరకూ ఆయనపై కేసు నమోదైన విషయం కూడా ఎవరికీ తెలియదు. మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని రాజద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు . అప్పట్నుంచి మళ్లీ ఏపీకి కానీ..  హైదరాబాద్‌కు కానీ వచ్చే ప్రయత్నం చేయలేదు. 

Also Read: పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?

కానీ అనూహ్యంగా ఆయన తిరుపతి సభకు హాజరయ్యారు. రఘురామ రాజు రాక వైఎస్ఆర్‌సీపీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. స్టేజ్‌మీద వైఎస్ఆర్‌సీపీ ఎంపీ కూడా ఉండటం ఆ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే అంశమే. సాంకేతికంగా రఘురామకృష్ణరాజు ఇంకా వైఎస్ఆర్‌సీపీ సభ్యుడే.  అమరావతి వేదికపై అన్ని పార్టీల నేతలు ఉన్నట్లయింది.  రఘురామకృష్ణరాజు రారు అని అనుకున్నారు కానీ  కానీ సరైన సమయంలో వచ్చి వైఎస్ఆర్‌సీపీని  ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారు.  

Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget