అన్వేషించండి

RAGHU RAMA : అమరావతి మహోద్యమ వేదికపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ... ఏకైక రాజధానికే మద్దతన్న రఘురామ !

అమరావతి రైతుల సభకు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. దీంతో అన్ని పార్టీల నేతలూ అమరావతికి మద్దతు తెలిపినట్లయిది.


తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహోద్యమ సభకు వైఎస్‌ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. తనపై వైఎస్ఆర్‌సీపీ నేతలు అయిన చెవిరెడ్డి, పెద్దిరెడ్డి దాడి చేయించే అవకాశం ఉందని అందువల్ల తాను వర్చవల్‌గా సమావేశంలో పాల్గొంటానని ఢిల్లీలో గురువారం ఆయన ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆయన తిరుపతిలో అడుగు పెట్టారు. ఆయన వస్తున్నట్లుగా కొంత మంది  అమరావతి జేఏసీ నేతలకే సమాచారం ఉంది. ఆయన రాకతో అమరావతి మహోద్యమ సభ వేదికపై అన్ని పార్టీల నేతలూ ఉన్నట్లు అయింది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయి.
RAGHU RAMA : అమరావతి మహోద్యమ వేదికపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ... ఏకైక రాజధానికే మద్దతన్న రఘురామ !

Also Read: పేదలపై సామాజిక దాడి - బినామీలతో అమరావతి ఉద్యమం .. చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఆగ్రహం !

వైఎస్ఆర్‌సీపీ విధానం మాత్రం మూడు రాజధానులు. ఆ పార్టీతో విబేధించిన రఘురామకృష్ణరాజు అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నారు.  పలు అంశాలపై వైఎస్ఆర్‌సీపీ విధానాలతో వ్యతిరేకిస్తున్న ఆయన ప్రతీ రోజూ ప్రెస్‌మీట్ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. అమరావతి రైతులకు మొదటి నుంచి మద్దతుగా నిలిచారు. ఏపీకి వస్తే తనపై దాడులు జరిగే అవకాశం ఉందని.. తప్పుడు కేసులతో అరెస్టు చేసే ప్రమాదం ఉందన్న కారణంగా ఆయన చాలా కాలంగా ఏపీకి రావడం లేదు. సొంత నియోజకవర్గం అయిన నర్సాపురానికీ వెళ్లడం లేదు. 

Also Read: పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్‌ కొత్త వ్యూహం !

ఆయన అనుమానాలను నిజం చేస్తూ గతంలో తన పుట్టినరోజు నాడు హైదరాబాద్ లోని ఇంటికి వచ్చినప్పుడు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పటి వరకూ ఆయనపై కేసు నమోదైన విషయం కూడా ఎవరికీ తెలియదు. మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని రాజద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు . అప్పట్నుంచి మళ్లీ ఏపీకి కానీ..  హైదరాబాద్‌కు కానీ వచ్చే ప్రయత్నం చేయలేదు. 

Also Read: పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?

కానీ అనూహ్యంగా ఆయన తిరుపతి సభకు హాజరయ్యారు. రఘురామ రాజు రాక వైఎస్ఆర్‌సీపీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. స్టేజ్‌మీద వైఎస్ఆర్‌సీపీ ఎంపీ కూడా ఉండటం ఆ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే అంశమే. సాంకేతికంగా రఘురామకృష్ణరాజు ఇంకా వైఎస్ఆర్‌సీపీ సభ్యుడే.  అమరావతి వేదికపై అన్ని పార్టీల నేతలు ఉన్నట్లయింది.  రఘురామకృష్ణరాజు రారు అని అనుకున్నారు కానీ  కానీ సరైన సమయంలో వచ్చి వైఎస్ఆర్‌సీపీని  ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారు.  

Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget