అన్వేషించండి

RAGHU RAMA : అమరావతి మహోద్యమ వేదికపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ... ఏకైక రాజధానికే మద్దతన్న రఘురామ !

అమరావతి రైతుల సభకు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. దీంతో అన్ని పార్టీల నేతలూ అమరావతికి మద్దతు తెలిపినట్లయిది.


తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహోద్యమ సభకు వైఎస్‌ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. తనపై వైఎస్ఆర్‌సీపీ నేతలు అయిన చెవిరెడ్డి, పెద్దిరెడ్డి దాడి చేయించే అవకాశం ఉందని అందువల్ల తాను వర్చవల్‌గా సమావేశంలో పాల్గొంటానని ఢిల్లీలో గురువారం ఆయన ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆయన తిరుపతిలో అడుగు పెట్టారు. ఆయన వస్తున్నట్లుగా కొంత మంది  అమరావతి జేఏసీ నేతలకే సమాచారం ఉంది. ఆయన రాకతో అమరావతి మహోద్యమ సభ వేదికపై అన్ని పార్టీల నేతలూ ఉన్నట్లు అయింది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయి.
RAGHU RAMA : అమరావతి మహోద్యమ వేదికపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ... ఏకైక రాజధానికే మద్దతన్న రఘురామ !

Also Read: పేదలపై సామాజిక దాడి - బినామీలతో అమరావతి ఉద్యమం .. చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఆగ్రహం !

వైఎస్ఆర్‌సీపీ విధానం మాత్రం మూడు రాజధానులు. ఆ పార్టీతో విబేధించిన రఘురామకృష్ణరాజు అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నారు.  పలు అంశాలపై వైఎస్ఆర్‌సీపీ విధానాలతో వ్యతిరేకిస్తున్న ఆయన ప్రతీ రోజూ ప్రెస్‌మీట్ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. అమరావతి రైతులకు మొదటి నుంచి మద్దతుగా నిలిచారు. ఏపీకి వస్తే తనపై దాడులు జరిగే అవకాశం ఉందని.. తప్పుడు కేసులతో అరెస్టు చేసే ప్రమాదం ఉందన్న కారణంగా ఆయన చాలా కాలంగా ఏపీకి రావడం లేదు. సొంత నియోజకవర్గం అయిన నర్సాపురానికీ వెళ్లడం లేదు. 

Also Read: పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్‌ కొత్త వ్యూహం !

ఆయన అనుమానాలను నిజం చేస్తూ గతంలో తన పుట్టినరోజు నాడు హైదరాబాద్ లోని ఇంటికి వచ్చినప్పుడు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పటి వరకూ ఆయనపై కేసు నమోదైన విషయం కూడా ఎవరికీ తెలియదు. మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని రాజద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు . అప్పట్నుంచి మళ్లీ ఏపీకి కానీ..  హైదరాబాద్‌కు కానీ వచ్చే ప్రయత్నం చేయలేదు. 

Also Read: పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?

కానీ అనూహ్యంగా ఆయన తిరుపతి సభకు హాజరయ్యారు. రఘురామ రాజు రాక వైఎస్ఆర్‌సీపీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. స్టేజ్‌మీద వైఎస్ఆర్‌సీపీ ఎంపీ కూడా ఉండటం ఆ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే అంశమే. సాంకేతికంగా రఘురామకృష్ణరాజు ఇంకా వైఎస్ఆర్‌సీపీ సభ్యుడే.  అమరావతి వేదికపై అన్ని పార్టీల నేతలు ఉన్నట్లయింది.  రఘురామకృష్ణరాజు రారు అని అనుకున్నారు కానీ  కానీ సరైన సమయంలో వచ్చి వైఎస్ఆర్‌సీపీని  ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారు.  

Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Elections :  ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Paris Olympics 2024: చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Elections :  ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Paris Olympics 2024: చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
Old City Bonalu 2024 : లాల్‌ దర్వాజా  సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
Double iSmart: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
వయస్సును రివర్స్ చేయొచ్చు - నమ్మడం లేదా? తన ఏజ్‌ను 22 ఏళ్లకు తగ్గించుకున్న ఈ 78 ఏళ్ల డాక్టర్ సీక్రెట్ ఇదే
వయస్సును రివర్స్ చేయొచ్చు - నమ్మడం లేదా? తన ఏజ్‌ను 22 ఏళ్లకు తగ్గించుకున్న ఈ 78 ఏళ్ల డాక్టర్ సీక్రెట్ ఇదే
Wine Shops Closed : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
Embed widget