అన్వేషించండి

Pavan Kalyan : పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్‌ కొత్త వ్యూహం !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ... ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల పాటు డిజిటల్ ఉద్యమం చేయాలని నిర్ణయించారు.


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరింత దూకుడుగా ఉద్యమించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే విశాఖలో బహిరంగసభ,  అమరావతిలో నిరాహారదీక్ష  చేసిన ఆయన .. ఇక ముందు డిజిటల్ ఉద్యమం చేయాలని సంకల్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలందరూ పార్లమెంట్‌లో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందు కోసం  మూడు రోజుల పాటు డిజిటల్ ఉద్యమం నిర్వహించనున్నారు. 18, 19, 20 తేదీల్లో ప్రజలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి..   వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

 

Also Read: పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?

ఇరవై రెండు మంది వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ప్రశ్నిస్తున్నారు. అన్యాయం జరుగుతున్నా నోరు మెదపని ఎంపీలు ఎందుకని ఘాటుగానే విమర్శిస్తున్నారు.  అయితే పార్లమెంట్‌లో మాత్రం ఏపీకి చెందిన ఎంపీలు అరకొరగానే స్పందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని అసలు ఎవరూ పోరాటం చేయడం లేదు. కనీసం ప్లకార్డులు కూడా ప్రదర్శించడం లేదు. దేశంలోనే ఎక్కువ ఎంపీలు ఉన్న టాప్ ఫైవ్ పార్టీల జాబితాలో వైఎస్ఆర్‌సీపీ ఉంది. అయినా ఆ పార్టీ ఎంపీలు .. బాధ్యత లేనట్లుగా ఉంటున్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. 

 

Also Read: బాలయ్య ఇలాకాలో వైసీపీ నేతల డిష్యుం డిష్యుం! ఇలాగైతే కష్టమే..!

టీడీపీ ఎంపీలు ముగ్గురు ఉన్నారు. వారు కూడా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సభను స్తంభింపచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో వారిపై ఒత్తిడి తేవడం ఒక్కటే మార్గమని జనసేన అధినేత నిర్ణయించుకున్నారు. పార్టీ కార్యకర్తలను డిజిటల్ ఉద్యమం వైపుగా నడిపిస్తున్నారు. 

Also Read: తిరుపతిలో అమరావతి రైతుల సభ ఏర్పాట్లు పూర్తి.. వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని పార్టీల నేతలూ హాజరయ్యే అవకాశం !

జనసేన పార్టీ గతంలో రోడ్లను బాగు చేయాలన్న డిమాండ్‌తో ఇలాగే డిజిటల్ ఉద్యమం నిర్వహించింది.  ఏపీ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, గుంతలు తేలిన రోడ్లను జనసేన కార్యకర్తలు ట్వీట్ చేసి.. వాటిని  ట్రెండింగ్‌లోకి తీసుకు వచ్చారు.  తర్వాత శ్రమదాన కార్యక్రమం కూడా చేపట్టారు. ఆ తరహాలోనే ఇప్పుడు ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది . మరి జనసేన ఉద్యమానికి స్పందించి.. పార్లమంట్ సభ్యులు కనీసం ప్లకార్డులైనా పట్టుకుంటారేమో చూడాలి ! 

Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget