అన్వేషించండి

Anantapur: బాలయ్య ఇలాకాలో వైసీపీ నేతల డిష్యుం డిష్యుం! ఇలాగైతే కష్టమే..!

అది టీడీపీ కంచుకోట. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ ప్లాన్. కానీ ఈ నేతలు మాత్రం తమ స్వార్థం కోసం అసమ్మతి కార్యకలాపాలు నడుపుతూనే ఉన్నారు!

బాలయ్య కోట హిందూపురంలో జాగ్రత్తగా పార్టీని పటిష్ఠం చేయాల్సిన వైసీపీ నేతల మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇద్దరి ముఖ్య నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మాటలు, ఆరోపణల యుద్ధం అధికార పార్టీలో ఇరు నేతల మధ్య ఆధిపత్య ధోరణి కోసం ఏ స్థాయిలో పోరాటం జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఎంఎల్సీ ఇక్బాల్, ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ మధ్య గత వారం నుంచి జరగుతున్న పరిణామాలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

ఇటీవల మండల పార్టీ కన్వీనర్ల నియామకంపై ఎంఎల్సీ ఇక్బాల్.. ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ ఇద్దరు కూడా వేరువేరుగా తమ అనుచరులను మండల పార్టీ కన్వీనర్లుగా ప్రకటించారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది. తాము ప్రకటించిన వారినే అధిష్ఠానం నుంచి కూడా ప్రకటించేందుకు ఇరు నేతలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోజురోజుకు ఇద్దరి మద్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరు అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా మారింది. తమ వారిని ప్రకటించేందుకు నేతలు ఓ వైపు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఎంఎల్సీ ఇక్బాల్ పై నియోజకవర్గంలోని మరో బలమైన సామాజికవర్గ నేతలు కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

ఇక్బాల్ ఎవరిని కలుపుకుపోరు అంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక్బాల్ ను ఒంటరి చేసేందుకు నవీన్ నిశ్చల్.. వేణుగోపాల్ రెడ్డి లాంటి మిగిలిన నేతలంతా కలిసి పనిచేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే నవీన్ నిశ్చల్ గతంలో తన స్థానంలో వేరొకరని ఇంచార్జ్ గా ప్రకటించడంతో హర్ట్ అయ్యి తెలుగు దేశంలో చేరేందుకు టీడీపీ నేతతో మాట్లాడిన ఆడియోను ఇటీవలే ఇక్బాల్ వర్గం కావాలనే లీక్ చేయించి నవీన్ నిశ్చల్ పార్టీకి విధేయుడు కాదన్న మెసెజ్ పంపేందుకు చేసిన ప్రయత్నాలు హిందూపురంలో తీవ్రమైన చర్చకు కారణమవుతుంది.

ఆయన ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చాడు..కానీ తెలుగుదేశం అధికారంలో వున్నపుడు పార్టీని కష్టకాలంలో నడిపిన తనను పక్కనపెట్టి.. ఇక్బాల్‌కు సీటిస్తే ఆయన అందరిని కలుపుకొని పోవడంలో విఫలం అయ్యాడంటూ నవీన్ నిశ్చల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా అందరూ మూకుమ్ముడిగా ఇక్బాల్ పై ఆరోపణలు చేస్తూ అదిష్ఠానానికి కంప్లైంట్ చేస్తున్నారు. కావాలనే తమను ఇబ్బందికి పెట్టేందుకు ఇక్బాల్ వర్గం చేస్తున్న మాటల దాడి, గతంలో ఎప్పుడో జరిగిన వాటిపై ఇప్పుడు ప్రచారం చేస్తూ తమ క్యారెక్టర్ ను  దిగజార్చే ప్రయత్నం చేయడంపై సీరియస్ గా వుంది నవీన్ నిశ్చల్ వర్గం. అయితే నియోజకవర్గం ఇంచార్జ్‌గా మండల పార్టీ కన్వీనర్లుగా ప్రకటించే అధికారం తమకే వుంటుందని, కానీ ఇందులో నవీన్ నిశ్చల్ ఇన్వాల్వ్ అయ్యి వేరే వారిని ప్రకటించడమే వివాదానికి కారణం అని ఇఖ్బాల్ వర్గం ఆరోపిస్తుంది.

టీడీపీలో బాలయ్య కంచుకోటలో ఇలా నేతల మద్య ఆధిపత్య పోరు పార్టీకి ఏమాత్రం మంచిది కాదని అదిష్ఠానం హితబోద చేస్తున్నప్పటికి నేతల మద్య మాత్రం ఏమాత్రం సయోధ్య కుదరడం లేదు. మరోవైపు, మరో రెండేళ్ళలో  ఎన్నికలు దగ్గరవుతున్ననేపథ్యంలో నేతల మద్య జరగుతున్న గొడవలు పార్టీకి మంచిది కాదని కార్యకర్తలు కూడా చెప్తున్నారు.

Also Read: Suicide: అనుమానపు మొగుడి టార్చర్‌.. భరించలేక పోయింది నవ వధువు.. చివరకు..

Also Read: Kidnap Case: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. స్నాప్‌ చాట్‌ లో పరిచమైన వ్యక్తితో లాంగ్ డ్రైవ్.. ఆ తర్వాత

 

Also Read: Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు... పక్కా స్కెచ్ తో రూ.కోట్లు కొట్టేసిందా?... శిల్ప కాల్ డేటా విశ్లేషిస్తోన్న పోలీసులు

Also Read: Warangal Crime: బెయిల్ పూచీకత్తు కోసం ఫోర్జరీ సంతకాలు... కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget