అన్వేషించండి

Case On Pawan : పవన్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తి అదృశ్యం - ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న తాడేపల్లి సీఐ !

పవన్ కారు వల్ల తాను కింద పడ్డానని ఫిర్యాదు చేసిన శివ అనే వ్యక్తి కనిపించడం లేదు. కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఐ కూడా ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు.

Case On Pawan :  పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావటం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది.ఈ వ్యవహారం సంచలనంగా మారటంతో అటు పోలీసులు, ఇటు ఫిర్యాదు దారుడు కూడా జాగ్రత్తలు పాటించారు  ఫిర్యాదు చేసిన వ్యక్తి కోసం మీడియా వెతుకులాట చేపట్టింది. అయితే అధికారికంగా ఈ కేసు వ్యవహారంలో పోలీసులు వివరణ కోసం చేసిన ప్రయత్నం కూడా విఫలం అయ్యింది. తాడేపల్లి స్టేషన్ సీఐ తన ఫోన్ ను స్విఛ్ ఆఫ్ చేసుకున్నారు.  

పవన్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‍ తో పాటుగా ఆయన కారు డ్రైవర్ పై కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తాడేపల్లి పీఎస్‍లో రెండు రోజుల క్రితం నమోదయిన కేసు వివరాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పవన్‍పై IPC 336, రెడ్‍విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటం గ్రామంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లే సమయంలో పవన్  కారు పై కూర్చొని ప్రయాణించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా  వైరల్ అయ్యాయి. అయితే పవన్ కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ తో పాటుగా హైవే రహాదారిపై వెళ్లే వారికి కూడా ఇబ్బందులు కలిగాయని, తనకు కూడా కారు తగిలిందని ఫిర్యాదు చేస్తూ తెనాలి మారిస్ పేటకు చెందని శివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ  ఎఫ్ఐఆర్ మోదీ పర్యటన పూర్తయిన తరువాత వెలుగులోకి రావటం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది.  

ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న పోలీసులు 

పోలీసులు ఏదైనా పెద్ద కేసు నమోదు చేసినప్పుడు మీడియాకు సమాచారం అందిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం సమాచారం బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారని అందులో భాగంగానే కేసు నమోదు చేసిన సమాచారాన్ని బయటకు రాకుండా చర్యలుతీసుకున్నారని అంటున్నారు. అయితే  ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఐ శేషగిరిని సంప్రదించేందుకు మీడియా ప్రయత్నించింది.  ఆయన ఫోన్ ను స్వీచ్ ఆఫ్ చేసుకున్నారు. అంతే కాదు పోలీసులకు ఫిర్యాదు చేసిన శివ అనే వ్యక్తి కూడా గ్రామం విడిచి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఫిర్యాదు తరువాత కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి రక్షణ కల్పించే అంశంలో భాగంగానే ముందు జాగ్రత్తగా వేరొక ప్రాంతానికి వెళ్లాల్సిందిగా సూచించినట్లు చెబుతున్నారు.

కేసు నమోదులో పోలీసులపై ఒత్తిడి...!

పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు వ్యవహారం రాజకీయ కోణంలో జరిగిందనే ప్రచారం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లిన సమయంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంతే కాదు పవన్ ఇప్పటం వెళుతుండగా పోలీసులే  జనసేన కార్యాలయం ముందు పవన్ ను అడ్డగించేందుకు ప్రయత్నించారు. దీంతో పవన్ నడుచుకుంటూ అయినా సరే వెళ్లి తీరతాననంటూ కార్యాలయం నుండి బయటకు వచ్చారు. దీంతో గత్యంతరం లేని పరిస్దితుల్లో పోలీసులు పవన్ కు అనుమతి ఇచ్చారు.  ఆ తరువాత పవన్ తన వాహనం పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటూ, అలానే ఇప్పటం వరకు వెళ్ళారు. ఆ రోజే పోలీసులు రెచ్చగోట్టేలా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా పవన్ పై ఆలస్యంగా కేసు నమోదు చేయటం, నమోదు అయిన కేసు వివరాలను కూడా బయటపెట్టేందుకు రెండు రోజులు ఆలస్యం చేయటం వెనుక పూర్తి రాజకీయ కోణంలోనే జరిగిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు కూడా ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్దితి నెలకొందని అంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget