By: ABP Desam | Updated at : 09 Feb 2022 12:32 PM (IST)
విజయవాడ ఏపీ ఎన్జీవో కార్యాలయానికి భద్రత పెంపు
ఏపీ ప్రభుత్వంతో పీఆర్సీ చర్చలు జరిపి సమ్మె విరమణ చేసిన ఉద్యోగ సంఘాల నేతలకు ఇప్పుడు చిక్కులు వస్తున్నాయి. నలుగురు ఉద్యోగ సంఘ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఏర్పాటైన కమిటీలో ఉన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండిశ్రీనివాసరావు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి కుట్రపూరితంగా తమ హక్కులను కూడా ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేయడమే కాదు సొంత ఉద్యమం ప్రారంభించారు.
కొత్త జిల్లాల ప్రకటనతో ఆ నేతల్లో పెరుగుతున్న ఆశలు, ఇంతకీ ఎవరా నేతలు.. అసలు కథేమిటీ !
ఈ క్రమంలో విజయవాడలోని ఎన్జీవో ఆఫీసు ఎదురుగా పెట్టిన ఫ్లెక్సీల్లో బండి శ్రీనివాసరావుతో పాటు శివారెడ్డి అనే మరో ఉద్యోగ నేత ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఎన్జీఒ కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ముట్టడించే అవకాశం ఉందంటూ పోలీసులు కు సమాచారం అందింది. దీంతో అప్రమత్తంమైన పోలీసులు.. అదనపు బలగాలను మోహరించారు. ఎపి ఎన్జీఒ భవనం ఉన్న రహదారిని బారికేడ్లతో మూసివేశారు. ఐడెంటి కార్డు ఉంటేనే ఆ వీధిలోకి అనుమతిస్తున్నారు. ఆందోళన చేసేందుకు వస్తే... అరెస్టు చేసేందుకు వాహనాలను సిద్దం చేశారు.
కుమార్తె పెళ్లికార్డులో మెగా బ్రదర్స్ ఫొటోలు, అభిమానానికి మెగాస్టార్ ఫిదా!
అయితే ఎన్జీవో భవనాన్ని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించలేదు. మరో వైపు ఉద్యోగ సంఘ నేతలపై తీవ్ర విమర్శలు వస్తూండటంతో వివరణ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో నలుగురు ఉద్యోగ నేతలపై తీవ్రమైన ఆరోపణలను ఉద్యోగులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో వారు సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉండటంతో తాము ఎందుకు సమ్మె విరమణ ప్రకటన చేశామో చెప్పుకునేందుకు మంగళవారం ప్రెస్మీట్ పెట్టాలనుకున్నారు. కానీ ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హాజరు కాలేదు. దీంతో సమావేశం నిర్వహించలేదు.
ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమణ ప్రకటన చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పీఆర్సీ విషయంలో తమకేమాత్రం సంతృప్తి లేదని టీచర్లు బహిరంగంగానే చెబుతున్నారు. వారు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమను ఉమ్మడి పోరాటం పేరుతో మోసం చేశారని ఉపాధ్యాయులు అనుకోవడంతోనే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగు నేతలు తమ సంఘాల్లోని సభ్యుల నుంచీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
Breaking News Telugu Live Updates: రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం, సీఎం జగన్, చంద్రబాబు హాజరు
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
ఏపీ రాజకీయ వేదికపై ఇంత వరకు చూడని సీన్ ఇవాళ మీరు చూడబోతున్నారు!
Machilipatnam Crime News : మచిలీపట్నంలో దారుణం, పోలీసులమని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం
Pawan Kalyan: పదవులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్లు!